logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విశాఖపట్నం గాజువాకలో ఆరుబయట LIC ఏజెంట్ పై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి గాజువాకలో దారుణం! విశాఖపట్నం గాజువాకలో ఆరుబయట LIC ఏజెంట్ వెంకట అప్పారావు పై మాస్క్ వేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశారు. అక్కిరెడ్డిపాలెం మల్లమ్మ గుడి దగ్గర జరిగిన ఘటనలో బాధితుడు స్థానిక ఆర్.కె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాజువాక పోలీసులు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

9 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago

విశాఖపట్నం గాజువాకలో ఆరుబయట LIC ఏజెంట్ పై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి గాజువాకలో దారుణం! విశాఖపట్నం గాజువాకలో ఆరుబయట LIC ఏజెంట్ వెంకట అప్పారావు పై మాస్క్ వేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశారు. అక్కిరెడ్డిపాలెం మల్లమ్మ గుడి దగ్గర జరిగిన ఘటనలో బాధితుడు స్థానిక ఆర్.కె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాజువాక పోలీసులు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కర్ణాటకలో ప్రజలను ఆకట్టుకుంటున్న దృశ్యం. ఈ చిత్రంలో, భారతదేశంలోని కర్ణాటకలో ప్రతిరోజూ ఆహారం పెట్టే 85 ఏళ్ల వృద్ధురాలి మరణం పట్ల ఒక కోతి దుఃఖిస్తున్న తెలుగు వైరల్ కథ ఉంది.* తనకు రోజూ ఆహారం పెట్టే మహిళ మరణించడంతో ఒక కోతి తీవ్రమైన దుఃఖాన్ని ప్రదర్శించింది. ఈ సంఘటన కర్ణాటకలోని చన్నపట్నలో జరిగింది. కోతి ఆ స్త్రీ శరీరాన్ని హత్తుకుని, వదిలి వెళ్ళడానికి నిరాకరించింది••
    1
    కర్ణాటకలో ప్రజలను ఆకట్టుకుంటున్న దృశ్యం.
ఈ చిత్రంలో, భారతదేశంలోని కర్ణాటకలో ప్రతిరోజూ ఆహారం పెట్టే 85 ఏళ్ల వృద్ధురాలి మరణం పట్ల ఒక కోతి దుఃఖిస్తున్న తెలుగు వైరల్ కథ ఉంది.*
తనకు రోజూ ఆహారం పెట్టే మహిళ మరణించడంతో ఒక కోతి తీవ్రమైన దుఃఖాన్ని ప్రదర్శించింది.
ఈ సంఘటన కర్ణాటకలోని చన్నపట్నలో జరిగింది.
కోతి ఆ స్త్రీ శరీరాన్ని హత్తుకుని, వదిలి వెళ్ళడానికి నిరాకరించింది••
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని జనసేన నాయకులు ఆకుల గజేంద్ర బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి నాలుగు రోజుల క్రితం నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో ఆయన చేరారు. దీంతో మొదటిసారి స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని మరియు కూటమి నేతలను ఆయన కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు రాజకీయంగా తొలి గురువు అమర్నాథ్ రెడ్డి అని వారి కుటుంబంతో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న విషయాన్ని తెలియజేశారు. తన ఆలోచనలకు అనుగుణంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ విధి విధానాలు నచ్చే జనసేన తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనకు తగిన గౌరవం గుర్తింపు లేని కారణంగానే వైకాపాను వీడియానని ఇక తన జీవితాంతం జనసేనలోనే కొనసాగుతూ ప్రజాసేవలో రాణిస్తానని ఆయన స్పష్టం చేశారు. కూటమి పార్టీ నేతలతో కలిసి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దిలీప్ కుమార్, పూల చైతు, నాగరాజు, చందు, అరుణ్, శివ, రాజేష్, రమేష్ లతోపాటు మురాదు తదితరులు పాల్గొన్నారు.
    1
    పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని జనసేన నాయకులు ఆకుల గజేంద్ర బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి  సన్మానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి నాలుగు రోజుల క్రితం నాగబాబు సమక్షంలో  జనసేన పార్టీలో ఆయన చేరారు. దీంతో మొదటిసారి స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని మరియు కూటమి నేతలను ఆయన కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు రాజకీయంగా తొలి గురువు అమర్నాథ్ రెడ్డి అని వారి కుటుంబంతో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న విషయాన్ని తెలియజేశారు.  తన ఆలోచనలకు అనుగుణంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ విధి విధానాలు నచ్చే జనసేన తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనకు తగిన గౌరవం గుర్తింపు లేని కారణంగానే వైకాపాను వీడియానని ఇక తన జీవితాంతం జనసేనలోనే కొనసాగుతూ ప్రజాసేవలో రాణిస్తానని ఆయన స్పష్టం చేశారు. కూటమి పార్టీ నేతలతో కలిసి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దిలీప్ కుమార్, పూల చైతు, నాగరాజు, చందు, అరుణ్, శివ, రాజేష్, రమేష్ లతోపాటు మురాదు తదితరులు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • *తండ్రితో గొడవ… పాపపై ప్రతీకారం తీర్చుకున్న ఆటో డ్రైవర్* మహారాష్ట్రలోని పాల్ఘర్ పట్టణంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఆటో డ్రైవర్ తన వ్యక్తిగత కోపాన్ని అదుపులో పెట్టుకోలేక, నిరపరాధ నాలుగేళ్ల పాపపై అమానుషంగా దాడి చేయడం సమాజాన్ని కలచివేసింది. ఈ ఘటనకు కారణం, పాప తండ్రితో నిందితుడికి జరిగిన వాగ్వాదమే. చిన్న విషయంగా మొదలైన ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరుకుని, డ్రైవర్‌లో కోపాన్ని రగిలించింది. అయితే ఆ కోపాన్ని తండ్రిపై కాకుండా, అమాయకమైన పాపపై చూపడం అతని క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచింది. దాడి సమయంలో నిందితుడు నాలుగేళ్ల పాపను పట్టుకుని నేలకేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమెపై తీవ్రంగా దాడి చేస్తూ ఇనుప రాడ్‌తో తలపై కొట్టాడు. ఈ దారుణ ఘటనలో పాప తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన పాపను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స కొనసాగుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
    1
    *తండ్రితో గొడవ… పాపపై ప్రతీకారం తీర్చుకున్న ఆటో డ్రైవర్* 
మహారాష్ట్రలోని పాల్ఘర్ పట్టణంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఆటో డ్రైవర్ తన వ్యక్తిగత కోపాన్ని అదుపులో పెట్టుకోలేక, నిరపరాధ నాలుగేళ్ల పాపపై అమానుషంగా దాడి చేయడం సమాజాన్ని కలచివేసింది.
ఈ ఘటనకు కారణం, పాప తండ్రితో నిందితుడికి జరిగిన వాగ్వాదమే. చిన్న విషయంగా మొదలైన ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరుకుని, డ్రైవర్‌లో కోపాన్ని రగిలించింది. అయితే ఆ కోపాన్ని తండ్రిపై కాకుండా, అమాయకమైన పాపపై చూపడం అతని క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచింది.
దాడి సమయంలో నిందితుడు నాలుగేళ్ల పాపను పట్టుకుని నేలకేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమెపై తీవ్రంగా దాడి చేస్తూ ఇనుప రాడ్‌తో తలపై కొట్టాడు. ఈ దారుణ ఘటనలో పాప తీవ్రంగా గాయపడింది.
స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన పాపను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స కొనసాగుతోంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    7 hrs ago
  • బ్యాంక్‌లో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన కంప్యూటర్లు, డాక్యుమెంట్స్‌ హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. మంతల ధాటికి రెండో అంతస్తు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సాయం మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్లు, డాక్యుమెంట్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
    1
    బ్యాంక్‌లో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన కంప్యూటర్లు, డాక్యుమెంట్స్‌ 
హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. మంతల ధాటికి రెండో అంతస్తు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సాయం మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్లు, డాక్యుమెంట్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • తిరుచానూరులో శ్రీరామనవమి వైభవం – ఎస్సీ కాలనీలో సీతారాముల కల్యాణం భక్తి సంద్రం. తిరుపతి ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడు, సత్యనిష్ఠకు మార్గదర్శకుడిగా భావించే సీతారాముల వారి కల్యాణోత్సవం తిరుచానూరు ఎస్సీ కాలనీలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరగడం ఎంత ఆనందకరమైన విషయం.తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో గల రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా నాగరాజు రెడ్డి ఉభయదారులుగా సీతారాముల వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీరాముడి ఆదర్శాలు, ఆయన జీవితం మనుషులకి నీతి, న్యాయం, కర్తవ్యబోధ నేర్పించే దివ్య సందేశంగా నిలుస్తున్నాయని భక్తులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు తిరునామలి రూపేష్ బాబు, తిరుచానూరు మాజీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, ఓబీసీ మండలాధ్యక్షులు భూపాలచారి, లేబాకు ప్రసాద్, పరాసరేశ్వర స్వామి టెంపుల్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి మరియు కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    1
    తిరుచానూరులో శ్రీరామనవమి వైభవం – ఎస్సీ కాలనీలో సీతారాముల కల్యాణం భక్తి సంద్రం.
తిరుపతి ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడు, సత్యనిష్ఠకు మార్గదర్శకుడిగా భావించే సీతారాముల వారి కల్యాణోత్సవం తిరుచానూరు ఎస్సీ కాలనీలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరగడం ఎంత ఆనందకరమైన విషయం.తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో గల రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా నాగరాజు రెడ్డి ఉభయదారులుగా సీతారాముల వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీరాముడి ఆదర్శాలు, ఆయన జీవితం మనుషులకి నీతి, న్యాయం, కర్తవ్యబోధ నేర్పించే దివ్య సందేశంగా నిలుస్తున్నాయని భక్తులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు తిరునామలి రూపేష్ బాబు, తిరుచానూరు మాజీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, ఓబీసీ మండలాధ్యక్షులు భూపాలచారి, లేబాకు ప్రసాద్, పరాసరేశ్వర స్వామి టెంపుల్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి మరియు కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    14 hrs ago
  • కదిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సమీపాన పోలీసు శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అభినందినియమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పోలీస్ శాఖకు అభినందించారు. డీఎస్సీ శివనారాయణ స్వామి, సిఐ నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
    1
    కదిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సమీపాన పోలీసు శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అభినందినియమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పోలీస్ శాఖకు అభినందించారు. డీఎస్సీ శివనారాయణ స్వామి, సిఐ నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    17 hrs ago
  • రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం గజేంద్ర వాహనోత్సవం పై స్వయంభు జంబుకేశ్వరుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. సాయంకాలం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని గజేంద్ర వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు.భక్తులు అడుగడుగునా హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు. రేపటి రోజు స్వామివారి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు.
    1
    రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం గజేంద్ర వాహనోత్సవం పై స్వయంభు జంబుకేశ్వరుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. సాయంకాలం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని గజేంద్ర వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు.భక్తులు అడుగడుగునా హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు. రేపటి రోజు స్వామివారి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • పుంగనూరు న్యూస్.. పుంగనూరు నగిరి కాంపౌండ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బల్లి.. భోజనం తిన్న విద్యార్థులలో నలుగురికి వాంతులు.. డాక్టర్లకు సమాచారం తెలిపిన ఉపాద్యాయులు.. పాఠశాల వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. పాఠశాలలోనే విద్యార్థులను పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు.. భోజనాన్ని చెత్తకుండీలో పడేసిన సిబ్బంది..
    2
    పుంగనూరు న్యూస్..
పుంగనూరు నగిరి కాంపౌండ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బల్లి..
భోజనం తిన్న విద్యార్థులలో నలుగురికి వాంతులు..
డాక్టర్లకు సమాచారం తెలిపిన ఉపాద్యాయులు..
పాఠశాల వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు..
పాఠశాలలోనే విద్యార్థులను పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు..
భోజనాన్ని చెత్తకుండీలో పడేసిన సిబ్బంది..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.