Shuru
Apke Nagar Ki App…
ఈ వీడియో మీ స్టేటస్ గా పెట్టి నాకు సపోర్ట్ చేయండి మీ ఇంటి అవసరాలకు సంబంధించిన వస్తువులు ఓన్ డెలివరీ చేయబడును సత్తుపల్లి మరియు సత్తుపల్లి పరిసర ప్రాంతాల మాత్రమే 9550088234
Ramprasad islavath
ఈ వీడియో మీ స్టేటస్ గా పెట్టి నాకు సపోర్ట్ చేయండి మీ ఇంటి అవసరాలకు సంబంధించిన వస్తువులు ఓన్ డెలివరీ చేయబడును సత్తుపల్లి మరియు సత్తుపల్లి పరిసర ప్రాంతాల మాత్రమే 9550088234
More news from తెలంగాణ and nearby areas
- Post by Ramprasad islavath1
- సత్తనపల్లి: హోంగార్డు శ్రీధర్ కు డిఎస్పి రివార్డు నగదు ఆదివారం అందించారు. ఇటీవల పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసులో అధికారులతో కలిసి చాకచక్యంగా దొంగలను పట్టుకున్నందుకు డిఎస్పి ప్రోత్సాహంగా రివార్డు నగదును అందించారు. డీఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందుకోవటం ఆనందదాయకంగా ఉందని శ్రీధర్ అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ సురేష్ ఎస్ ఐ గిరిబాబు రవిబాబు పాల్గొన్నారు.1
- చెన్నారావుపేట మండలం, జల్లి గ్రామానికి చెందిన గందె అభిలాష్, అదే గ్రామానికి చెందిన యువతితో ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన అమ్మాయి బంధువులు అర్ధరాత్రి అభిలాష్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు, బైక్ను ధ్వంసం చేశారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట రోడ్డు శివారులో సిపిఐ కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. స్థానిక వార్డు కౌన్సిలర్లు శ్రీరామోజు రోజారాణి, ఎలుకంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేరిన వారిని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మాదన్నపేట ప్రాంత గుడిసె వాసులకు ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, విద్యుత్, సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు మరుగుదొడ్లు త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.2
- అమరావతి : *గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి Expair అయినా శీతల పానియాల అమ్మకం..!* రోగుల ప్రాణాలతో చెలగాటం..!?? మూడు నెలల క్రితం కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ అమ్ముతున్న దుకాణదారులు... ఇదేంటి అని అడిగితే చూసుకోలేదు అంటూ విచిత్ర సమాధానం... కనీసం నెలకు ఒకసారి అయినా దుకాణదారుల విక్రయాలపై దృష్టి సారించని ఆసుపత్రి పరిపాలన విభాగం... మామూళ్ల మత్తులో ఊగుతున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న రోగులు... కనీసం ఫుడ్ సేఫ్టీ అధికారులు అయినా ద్రుష్టి సారిస్తారా..!? రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇటువంటి దుకాణదారులపై చర్యలు తీసుకుంటారా..? యధావిధిగా కన్నులు మూసుకుంటారా వేచి చూడాలి.1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన కలంచర్ల జానయ్య యాదవ్ మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జటంగి నరసయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి బడుగుల రవీందర్ యాదవ్, జగన్ యాదవ్, బచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.3
- వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ రాణా పరిధిలో మార్చి 20న అర్ధరాత్రి ఎల్బీనగర్కు చెందిన ఓ యువకుడిపై కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసి రోడ్డు పక్కనున్న మురుగు కాల్వలో పడేసి వెళ్లారు. ఉదయం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు యువకుడిని అపస్మారక స్థితిలో గుర్తించి 108కు సమాచారం అందించడంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో సాధారణంగా పడిపోయి ఉండవచ్చని భావించిన కుటుంబ సభ్యులు చికిత్స కొనసాగించారు. ఇటీవల దాడి సమయంలో తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వివరాలు సేకరించగా, స్థానిక యువకులే దాడికి పాల్పడినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వైరల్ వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసి వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. యువకుడికి, దాడి చేసిన వారికి పాత కక్షలు లేనప్పటికీ ఇలా విచక్షణరహితంగా దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.1
- పెదకూరపాడు: మండల పరిధిలోని పొడపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసును పెదకూరపాడు పోలీసులు చేదించారు. బంగారము నగదు దోచుకు వెళ్లిన దొంగలను పట్టుకున్నారు. సిఐ సురేష్ ఎస్సై గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. ఆదివారం డిఎస్పి హనుమంతరావు ఆధ్వర్యంలో రికవరీ చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ చట్టం నుంచి ఎవరో తప్పించుకోలేరని ఒక రోజు వెనక ముందు తప్ప ఎవరైనా దొరకక తప్పదు అన్నారు1