కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పౌర సేవలపై మాజీ డిప్యూటీ మేయర్ ఆగ్రహం...రూపాయికి అంత్యక్రియలు అమలు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ పౌరసేవల కార్యాలయంపై దాడి, పర్నిచర్ ధ్వంసం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పౌర సేవలపై జనాగ్రహం వ్యక్తం అయింది. ఏకంగా బిజెపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ పౌర సేవల కార్యాలయం దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మేయర్ సమక్షంలోనే ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో రూపాయికి అంత్యక్రియల పథకం అమల్లో అధికారులు నిర్లక్ష్యంపై అధికార పార్టీ బిజేపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ ఫైర్ అయ్యారు. అధికారులను తీరుపై ఆగ్రహంతో దూషించి పౌర సేవల కార్యాలయం దాడి చేసి హల్చల్ చేశారు. అధికారంలో ఉన్న వారే ఆవేదనతో ఆందోళనకు దిగి పర్నిచర్ ధ్వంసం చేయడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. కరీంనగర్ లోని 35 డివిజన్ కు చెందిన కొండమీది వెంకటేశం అనారోగ్యం మృతిచెందగా నిరుపేద పేద కుటుంబానికి చెందినవారు కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేస్తున్న రూపాయికే అంత్యక్రియల పథకం వర్తింపజేయాలని మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సంబంధిత అధికారులు సరిగా స్పందించకపోవడంతో రమేష్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తన ప్రతాపం చూపారు. విధినిర్వహణలో ఉండే ఉద్యోగిని పిలిపించాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహంతో కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా మనిషి చనిపోయి బాధతో పోన్ చేస్తే రెస్పాండ్ కాని సంబంధిత అధికారిని పిలిపించండని ర్యాష్ గా ప్రవర్తించారు. అదే సమయంలో మేయర్ శ్రీనివాస్ రాగ ఆయన సమక్షంలోనే అధికారులతో వాగ్వివాదానికి దిగారు. బీజేపీకి చెందిన మేయర్ సమక్షంలోనే బిజెపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ వ్యవహరించిన తీరు కలకలం సృష్టించింది. మృతుడికి కరీంనగర్ లో స్వంత ఇల్లు ఉన్నప్పటికీ ఆధార్ కార్డు వరంగల్ లో ఉండడం వల్ల రూపాయికే అంతక్రియల పథకం వర్తింపచజేయలేదని అధికారులు చెప్పగా సొంత ఇల్లు ఉన్న వ్యక్తికి ఎలా పథకాన్ని వర్తింపజేయరని రమేష్ నిలదీశారు. రమేష్ వ్యవహరించిన తీరుతో మేయర్ నిర్ఘాంతపోయి వెంటనే నిర్లక్ష్యం నిర్వహించిన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. జరిగిన పొరపాటును కప్పిపుచ్చుకునే పనిలో మునిసిపల్ అధికారులు నిమగ్నమై, ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ దూషించిన మాజీ డిప్యూటీ మేయర్ పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పౌర సేవలపై మాజీ డిప్యూటీ మేయర్ ఆగ్రహం...రూపాయికి అంత్యక్రియలు అమలు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ పౌరసేవల కార్యాలయంపై దాడి, పర్నిచర్ ధ్వంసం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పౌర సేవలపై జనాగ్రహం వ్యక్తం అయింది. ఏకంగా బిజెపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ పౌర సేవల కార్యాలయం దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మేయర్ సమక్షంలోనే ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో రూపాయికి అంత్యక్రియల పథకం అమల్లో అధికారులు నిర్లక్ష్యంపై అధికార పార్టీ బిజేపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ ఫైర్ అయ్యారు. అధికారులను తీరుపై ఆగ్రహంతో దూషించి పౌర సేవల కార్యాలయం దాడి చేసి హల్చల్ చేశారు. అధికారంలో ఉన్న వారే ఆవేదనతో ఆందోళనకు దిగి పర్నిచర్ ధ్వంసం చేయడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. కరీంనగర్ లోని 35 డివిజన్ కు చెందిన కొండమీది వెంకటేశం అనారోగ్యం మృతిచెందగా నిరుపేద పేద కుటుంబానికి చెందినవారు కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేస్తున్న రూపాయికే అంత్యక్రియల పథకం వర్తింపజేయాలని మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సంబంధిత అధికారులు సరిగా స్పందించకపోవడంతో రమేష్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తన ప్రతాపం చూపారు. విధినిర్వహణలో ఉండే ఉద్యోగిని పిలిపించాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహంతో కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా మనిషి చనిపోయి బాధతో పోన్ చేస్తే రెస్పాండ్ కాని సంబంధిత అధికారిని పిలిపించండని ర్యాష్ గా ప్రవర్తించారు. అదే సమయంలో మేయర్ శ్రీనివాస్ రాగ ఆయన సమక్షంలోనే అధికారులతో వాగ్వివాదానికి దిగారు. బీజేపీకి చెందిన మేయర్ సమక్షంలోనే బిజెపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ వ్యవహరించిన తీరు కలకలం సృష్టించింది. మృతుడికి కరీంనగర్ లో స్వంత ఇల్లు ఉన్నప్పటికీ ఆధార్ కార్డు వరంగల్ లో ఉండడం వల్ల రూపాయికే అంతక్రియల పథకం వర్తింపచజేయలేదని అధికారులు చెప్పగా సొంత ఇల్లు ఉన్న వ్యక్తికి ఎలా పథకాన్ని వర్తింపజేయరని రమేష్ నిలదీశారు. రమేష్ వ్యవహరించిన తీరుతో మేయర్ నిర్ఘాంతపోయి వెంటనే నిర్లక్ష్యం నిర్వహించిన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. జరిగిన పొరపాటును కప్పిపుచ్చుకునే పనిలో మునిసిపల్ అధికారులు నిమగ్నమై, ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ దూషించిన మాజీ డిప్యూటీ మేయర్ పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
- కరీంనగర్ లో హిందువులు కదం తొక్కారు. మంగళవారం గణేష్ నగర్ లో నిర్వహించే హిందూ సమ్మేళనం సక్సెస్ కోసం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియం సమీపంలోని స్వశక్తి కళాశాల వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ, గణేష్ నగర్ హనుమాన్ నగర్, దోబివాడ బాలాజీ నగర్, తిరుమలనగర్ NGO,S కాలనీల మీదుగా సాగింది. కాషాయ జెండాలు చేతబూని జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఓపెన్ టాప్ జీప్ లో హనుమంతుని విగ్రహాన్ని ఊరేగిస్తూ హిందూ బంధువులందరూ మంగళవారం సాయంత్రం 6 గంటలకు గణేష్ నగర్ బైపాస్ రోడ్ లో జరిగే హిందూ సమ్మేళనానికి హాజరు కావాలని కోరారు. 3000 మందితో శోభయాత్ర ద్వారా హిందూ సమ్మేళనానికి చేరుకోవడం జరుగుతుందని హిందూ సమ్మేళన నిర్వాహకులు లైన్స్ క్లబ్ ప్రతినిధి హనుమాండ్ల రాజిరెడ్డి తెలిపారు. గడప లోపల కులం,మతం గడప దాటితే మనమంతా హిందువులమేనని చాటి చెప్పాలని కోరారు.2
- గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, కావాలని దాష్టీకాన్ని ప్రదర్శించే వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈదుల్ అజ్ఞ బక్రీద్ పండుగ నిర్వహణకై సహకరించాలని, ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో.. నగర ఇస్లామీయ ధార్మిక పండితులు, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు సోమవారం కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రాకి, సీపీ గౌష్ ఆలం లను వారి కార్యాలయాల్లో కలిసి వినతిపత్రములు అందజేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఈ వినతి పత్రాలను అందజేసినట్లు గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. బక్రీద్ లో ఖుర్బానీ ఇచ్చే జంతువుల్లో ఆవులు, చిన్న చిన్న దూడలు వంటివి లేకుండా జాగ్రత్తలు వహించాలని.. వెటర్నరీ డాక్టర్లు ధృవీకరించిన సర్టిఫైడ్ జంతువులను మాత్రమే కొనుగోలు చేయాలని, వారసంతల్లో ఆవులు వెళ్లకుండా ఈ బక్రీద్ మాసం సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఖుర్బానీ కోసం ఆరోగ్య కరమైన జంతువులు ఉండేట్లు చూసుకోవాలని, చట్ట పరిధిలో ఉండి పండుగ జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే పనులు చేయొద్దని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. జంతువులు రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు ఆపితే వారికి సహకరించాలని, గోరక్షకుల ముసుగులో దుండగులు ఆపినచో తక్షణమే 100కు కాల్ చేయాలని, సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు. గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అల్లరి మూకలపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడిజిల్లాలోని పశువుల సంతల్లో వెటర్నరీ డాక్టర్లను అందుబాటులో ఉంచాలని, వెటర్నరీ డాక్టర్ల చేత సర్టిఫైడ్ చేయబడిన పశువులను మాత్రమే సంతల్లోకి అనుమతించాలని కోరారు. ఈఅంశంపై అన్ని పార్టీలతో కలిసి జిల్లా స్థాయిలో కలెక్టర్, సీపీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఈకార్యక్రమంలో జమియతుల్ ఉలమా జిల్లా ఉపాధ్యక్షుడు ముఫ్తీ ఘియాస్ మొహియుద్దీన్, జిల్లా సున్నీ ఉలమా బోర్డు అధ్యక్షుడు మౌలానా అలీమోద్దీన్ నిజామీ, జమియత్ ఆహిలే హాదీస్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సమీ, సదర్ ఖాజీ హఫీజ్ మన్కబత్ షాఖాన్, సున్నీ మర్కజి మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, సిటీ జమియతుల్ ఉలమా ఉపాధ్యక్షుడు హాఫిజ్ సయ్యద్ రిజ్వాన్, ముఫ్తీ నదీమ్, హఫీజ్ అస్గర్ అలీ, హఫీజ్ అబ్దుల్ జబ్బార్, ఎంఐఎం కార్పొరేటర్లు ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, నాయకులు అసదుల్లా బేగ్, బాబుజానీ, లయన్ గఫ్ఫార్, లింగంపల్లి శ్రీనివాస్, అసిమ్, మజారోద్దీన్, గాలి రాజు, సురేశ్, అక్బర్ అలీ, వాజిద్ అలీఖాన్, సాజిద్, మెరాజ్, షబ్బీర్, ఖాలీద్, ఖదీర్ ఖాన్, కౌసర్ మజీద్ అధ్యక్షుడు డాక్టర్ యునూస్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.3
- గన్నేరువరం పోలీస్ స్టేషన్లో నాగుపాము కలకలం రేపింది. స్టేషన్ ఎస్సై నరేందర్ రెడ్డి తన గదిలో కుర్చీలో కూర్చొని వచ్చిన వారితో మాట్లాడుతుండగా, వెనుక భాగంలోని కిటికీ ద్వారా నాగుపాము లోపలికి ప్రవేశించింది. పాము ఎస్సై భుజం వైపు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, ఎదురుగా ఉన్న వ్యక్తి గమనించి అప్రమత్తం చేయడంతో ఎస్సై వెంటనే టేబుల్పైకి ఎగబాకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో స్టేషన్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న గ్రామానికి చెందిన పాములు పట్టే నైపుణ్యం కలిగిన కళ్ళెం పోచయ్యను పిలిపించారు. ఆయన స్టేషన్ గదిలో టేబుల్ కింద దాగి ఉన్న నాగుపామును పట్టుకుని చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.1
- భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా... మానుకోట జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. జిల్లాలోని పలు పెట్రోల్ బంక్ల వద్ద వాహనాలు బారులు తీరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచే బంక్ల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధనం అందుబాటులో లేకపోవడంతో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, రైతులు మరియు సాధారణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బంక్ల వద్ద ఇంధనం పూర్తిగా అయిపోయిందని నిర్వాహకులు చెబుతుండగా, మరికొన్ని చోట్ల పరిమితంగా మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ పరిస్థితి కారణంగా అత్యవసర సేవలు కూడా ప్రభావితమవుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. బంక్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగి ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు పరిస్థితిని సమీక్షించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- వరంగల్: భద్రకాళి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం వైభవోపేతంగా అశ్వవాహన సేవపై శ్రీ భద్రకాళి అమ్మవారిని ఊరేగించారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య మేళతాళాలతో అమ్మవారి రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.1
- బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ "కేటీఆర్"పిలుపు మేరకు మాజీ మంత్రి "కొప్పుల ఈశ్వర్"ఆదేశానుసారం సోమవారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక తెలంగాణ తల్లి విగ్రహంకు పూలమాలలు వేసి అనంతరం బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.మరియు అక్కడ ఉన్న స్థానికులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో,మాజీ మున్సిపల్ ఛైర్మన్ సంగి సత్తెమ్మ గారు, ధర్మపురి మండల కన్వీనర్ అయ్యోరి రాజేష్ కుమార్ , పట్టణ కన్వీనర్ బండారి రంజిత్, నాయకులు ఓడ్నాల మల్లేశం, సంగి శేఖర్, చిలువేరి శ్యాంసుందర్, బండారి అశోక్,చుక్క రవి,బాకీ శేఖర్,గుర్రాల సుధాకర్,అనంతుల లక్ష్మణ్,ఎండీ షమీమా,తరాల కార్తీక్,జెట్టి రాజన్న, ఆనందాసు శ్రీనివాస్, స్తంభంకాడి మహేష్,నక్క రాజేందర్, మామిడి శ్రీనివాస్ ,అక్కనపెల్లి సురేందర్, చల్ల రవి,కాశెట్టి విజయ్,వేముల నరేష్, కళ్ళెం రిషిరెడ్డి,ఎండీ రావుఫ్ మొలుగూరి రాజన్న, చిపిరిశెట్టి రాజన్న, కనకుల స్వామి,మొలగూరి ప్రశాంత్,అంబటి లక్ష్మణ్,,మామిడి శివసాయి,మూటపెల్లి రాజేందర్,ఎడ్ల రాజేశం,ఎండీ అలీ, మూటపెల్లి రాహుల్, అప్పాల శివ,దుర్గం రవి, ముత్తునూరి మహేష్, కొండాపురం యశ్వంత్, చల్ల మున్నా,గడిపెల్లి నరేందర్ తదితరులు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది...1
- కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పౌర సేవలపై జనాగ్రహం వ్యక్తం అయింది. ఏకంగా బిజెపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ పౌర సేవల కార్యాలయం దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మేయర్ సమక్షంలోనే ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో రూపాయికి అంత్యక్రియల పథకం అమల్లో అధికారులు నిర్లక్ష్యంపై అధికార పార్టీ బిజేపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ ఫైర్ అయ్యారు. అధికారులను తీరుపై ఆగ్రహంతో దూషించి పౌర సేవల కార్యాలయం దాడి చేసి హల్చల్ చేశారు. అధికారంలో ఉన్న వారే ఆవేదనతో ఆందోళనకు దిగి పర్నిచర్ ధ్వంసం చేయడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. కరీంనగర్ లోని 35 డివిజన్ కు చెందిన కొండమీది వెంకటేశం అనారోగ్యం మృతిచెందగా నిరుపేద పేద కుటుంబానికి చెందినవారు కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేస్తున్న రూపాయికే అంత్యక్రియల పథకం వర్తింపజేయాలని మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సంబంధిత అధికారులు సరిగా స్పందించకపోవడంతో రమేష్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తన ప్రతాపం చూపారు. విధినిర్వహణలో ఉండే ఉద్యోగిని పిలిపించాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహంతో కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా మనిషి చనిపోయి బాధతో పోన్ చేస్తే రెస్పాండ్ కాని సంబంధిత అధికారిని పిలిపించండని ర్యాష్ గా ప్రవర్తించారు. అదే సమయంలో మేయర్ శ్రీనివాస్ రాగ ఆయన సమక్షంలోనే అధికారులతో వాగ్వివాదానికి దిగారు. బీజేపీకి చెందిన మేయర్ సమక్షంలోనే బిజెపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ వ్యవహరించిన తీరు కలకలం సృష్టించింది. మృతుడికి కరీంనగర్ లో స్వంత ఇల్లు ఉన్నప్పటికీ ఆధార్ కార్డు వరంగల్ లో ఉండడం వల్ల రూపాయికే అంతక్రియల పథకం వర్తింపచజేయలేదని అధికారులు చెప్పగా సొంత ఇల్లు ఉన్న వ్యక్తికి ఎలా పథకాన్ని వర్తింపజేయరని రమేష్ నిలదీశారు. రమేష్ వ్యవహరించిన తీరుతో మేయర్ నిర్ఘాంతపోయి వెంటనే నిర్లక్ష్యం నిర్వహించిన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. జరిగిన పొరపాటును కప్పిపుచ్చుకునే పనిలో మునిసిపల్ అధికారులు నిమగ్నమై, ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ దూషించిన మాజీ డిప్యూటీ మేయర్ పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.1