Shuru
Apke Nagar Ki App…
నిర్మల్ పోలీస్ మీ పోలీస్ || Nirmal Police Mee Police || KR NEWS 369
KR NEWS 369
నిర్మల్ పోలీస్ మీ పోలీస్ || Nirmal Police Mee Police || KR NEWS 369
More news from తెలంగాణ and nearby areas
- Post by KR NEWS 3691
- Post by Solanke Ravi1
- ఈ నెల 6వ తేదీన బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ *అనుముల రేవంత్ రెడ్డి *గారి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు వివేక్ వెంకటస్వామి గారు నేడు బాసరకు విచ్చేశారు.ఈ సమీక్షా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ అభిలాష అభినవ్ గారు, బాసర సర్పంచ్ శ్రీ తీగల వెంకటేష్ గౌడ్ గారు మరియు EX MLA జి.విఠల్ రెడ్డి గారు EX సర్పంచ్ దయల లక్ష్మణ్ రావు గారు EX సర్పంచ్ కిర్గుల్ శ్రీ పెద్దకొండూరి సుధాకర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ సయ్యద్ అలీ గారు బాసర గ్రామ టీమ్ విఠల్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత మరియు ఇతర ఏర్పాట్లపై వారు క్షేత్రస్థాయిలో చర్చించారు.1
- *నేడు క్యాంపస్లోనే మంత్రి బస; అధికారులతో సమీక్ష* బాసర, ఏప్రిల్ 3: బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ)లో జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజనానంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి మాట్లాడారు. మీ కష్టసుఖాలు తెలుసుకునేందుకే నేను ఇక్కడికి వచ్చాను. విద్యాలయంలో మీకు ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? బోధన సక్రమంగా జరుగుతోందా? మౌలిక సదుపాయాల పరిస్థితి ఎలా ఉంది? అని ఆరా తీశారు. క్యాంపస్ నెలకొన్న పరిస్థితులు, వాటిని చక్కదిద్దేందుకు ఇక్కడకు వచ్చానని, ఎవరూ భయపడకుండా నిర్భయంగా తమ సమస్యలను తెలియజేయాలని విద్యార్థులకు భరోసానిచ్చారు. క్యాంపస్లో నెలకొన్న పరిస్థితులపై మంత్రి జూపల్లి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా తాగునీరు, హాస్టల్ గదుల నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదలపై చర్చించారు. విద్యార్థుల సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయడం, వారికి భరోసా కల్పించేందుకు చేసేందుకు మంత్రి ఈ రాత్రికి ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోనే బస చేయాలని నిర్ణయించుకున్నారు. మంత్రి రాకతో క్యాంపస్లో తమ సమస్యలు పరిష్కారమవుతాయని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.1
- కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మనగర్లో శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. సర్పంచ్ ప్రవీణ్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. హోరాహోరీగా సాగిన ఈ కుస్తీలు ప్రేక్షకులను అలరించాయి. గెలుపొందిన విజేతలకు సర్పంచ్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో AMC వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా1
- గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.1
- Post by Solanke Ravi3