Shuru
Apke Nagar Ki App…
చిలుకానగర్లో SIR ప్రావాస్ అభియాన్.. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ పర్యటన బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు SIR మండల ప్రావాస్ అభియాన్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చిలుకానగర్ డివిజన్లో పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలు, కాలనీల్లో బీఎల్వోలు, ఓటర్లతో మాట్లాడి SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని ఓటర్లకు సూచించారు.
FOCUS MEDIA
చిలుకానగర్లో SIR ప్రావాస్ అభియాన్.. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ పర్యటన బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు SIR మండల ప్రావాస్ అభియాన్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చిలుకానగర్ డివిజన్లో పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలు, కాలనీల్లో బీఎల్వోలు, ఓటర్లతో మాట్లాడి SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని ఓటర్లకు సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- కాప్రా–కుషాయిగూడలో మోస్తరు వర్షం.. చల్లబడిన వాతావరణం ప్రజల్లో ఆనందం కాప్రా, కుషాయిగూడ, ఏఎస్రావు నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లు చిత్తడిగా మారాయి. అయితే, వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా కొంతమేర రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఇటీవల నెలకొన్న వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించిందని స్థానికులు తెలిపారు. వర్షం మరింత కురిస్తే భూగర్భ జలాలు పెరిగి, నీటి కొరత సమస్యకు కొంత ఉపశమనం కలుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.1
- మేడిపల్లిలో దంచి కొడుతున్న వర్షం, గ్రామస్థులకు కాస్త ఊరట.. మేడిపల్లిలో దంచి కొడుతున్న వర్షం వాతావరణ శాఖ తెలిపినట్లుగానే పట్టణంలో పలు చోట్ల వర్షం...1
- చెరువుల పరిరక్షణే లక్ష్యంగా.. శేరిలింగంపల్లిలో హైడ్రాకు భారీ మద్దతు! హైదరాబాద్లోని తమ్మిడికుంట చెరువు వద్ద హైడ్రా (HYDRAA) చేపడుతున్న చర్యలకు ప్రజా మద్దతు మరింత పెరుగుతోంది. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ చేస్తున్న సాహసోపేతమైన ప్రయత్నాలకు సంఘీభావంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్ మేట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆక్రమణల చెర నుంచి జలవనరులను కాపాడుతూ, నగర భవిష్యత్తు కోసం హైడ్రా అడుగులు వేయడం అభినందనీయమని నాయకులు కొనియాడారు. ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలపై హైడ్రా ముద్రించే కఠిన చర్యలు నిరంతరం కొనసాగాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.4
- నాగారంలో దంచి కొడుతున్న వర్షం నాగారం దమ్మైగూడ రోడ్లు జలమయం నాగారంలో దంచి కొడుతున్న వర్షం నాగారం దమ్మైగూడ రోడ్లు జలమయం వాహనదారుల అప్రమత్తంగా గుంతలు చూసుకొని వెళ్లాలని అదేవిధంగా పాదాచారులకు నీళ్లు మీద పడకుండా వాహనాలు నడపాలని సమన్వయం పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని కోరనైనది1
- ఆలస్యంగా పలకరించిన వరుణుడు ఇప్పుడు వరుసగా కురుస్తుండటంతో పొలాల్లో సందడి వెల్దుర్తి మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపాయి. ఆలస్యంగా పలకరించిన వరుణుడు ఇప్పుడు వరుసగా కురుస్తుండటంతో పొలాల్లో సందడి నెలకొంది. ట్రాక్టర్లతో భూములను దున్నిస్తూ రైతులు వరి నాట్లకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలి వరకు వర్షాభావంతో ఆందోళన చెందిన రైతులు, ప్రస్తుతం అనుకూల వాతావరణం ఏర్పడటంతో సాగు పనులను ముమ్మరం చేశారు. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే ఈ సీజన్లో మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెల్దుర్తి మండలంలోని గ్రామాల్లో పొలాలన్నీ వ్యవసాయ పనులతో కళకళలాడుతున్నాయి.1
- హైడ్రాపై తప్పుడు ప్రచారం.. డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఎం ఆరోపణ హైడ్రాపై సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలను అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో కూడా హైడ్రా పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు.1
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- 10 కిలోల గంజాయినికి స్వాధీనం చేసుకున్న కొల్లేరు పోలీసులు ఒడిశా రాష్ట్రానికి చెందిన జయదేవ్ బిశ్వాస్ (23), ప్రశంజిత్ రాయ్ (22) అనే ఇద్దరు యువకులు 10 కిలోల గంజాయిని హైదరాబాద్కు తరలించి కొల్లూరు లేబర్ క్యాంపులో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసిన ఎస్ఐపీ రాంబాబు శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.1