Shuru
Apke Nagar Ki App…
రవాణా శాఖ కరీంనగర్ టు ఇల్లంతకుంట అండ్ పొత్తూరు కందికట్కూరు వంతడుపుల నాగిరెడ్డిపల్లె మీదుగా గతంలో బస్సు ఆర్టీసీ బస్సు నడిచేది రోడ్డు బాగలేక బస్సు రాలేదు.ఇప్పుడుమట్టి పోయించుకున్నాము. రోడ్డు బానే ఉన్నది. ఆర్టీసీ బస్సు వేయించగలరని మా యొక్క మనవి.
Laxmareddy Korem
రవాణా శాఖ కరీంనగర్ టు ఇల్లంతకుంట అండ్ పొత్తూరు కందికట్కూరు వంతడుపుల నాగిరెడ్డిపల్లె మీదుగా గతంలో బస్సు ఆర్టీసీ బస్సు నడిచేది రోడ్డు బాగలేక బస్సు రాలేదు.ఇప్పుడుమట్టి పోయించుకున్నాము. రోడ్డు బానే ఉన్నది. ఆర్టీసీ బస్సు వేయించగలరని మా యొక్క మనవి.
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- इंदौर कमिश्नर की जन सुनवाई में पहुचे पीड़ित1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ టీచర్ గా మారారు. పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టి పాఠాలు చెప్పారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. సీబీఎస్ఈ విధానంలో పదో తరగతి మ్యాథ్స్ పరీక్షలు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైబ్రరీ పరిశీలించారు. స్కిల్ ఇండియా లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విద్యాలయంలో రిటైల్ ల్యాబ్ లో విద్యార్థులు శిక్షణ పొందుతుండగా, ఇంచార్జి కలెక్టర్ వారితో మాట్లాడారు. వ్యాపారంలో మెలకువలు, వివిధ అంశాల్లో విద్యార్థులు పొందిన అనుభవాన్ని వివరించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబందించిన సెలబస్ పూర్తి అయిందా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. ఈ తరగతిలోని అంశాలు పై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటాయని తెలిపారు. ఇప్పుడే ప్రతి సబ్జెక్టు, పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఇంచార్జి కలెక్టర్ ఆకాంక్షించారు.1
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 18 ప్రజా తెలంగాణ న్యూస్ ఈరోజు ప్రజా నాయకుడు, మనసున్న మహానేత,మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రశేఖర్ రావు గారి 72వ జన్మదినం సందర్బంగా వేడుకలు గజ్వెల్ పట్టణంలో mlc వంటేరి యాదవరెడ్డి,గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వెల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నల్లవాగు కేసరి హనుమాన్ దేవాలయంలో brs మండల అధ్యక్షుడు బెండే మధు మరియు బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్ గారికి నిండు ఆయురారోగ్యాలతో పాటు మరింత ప్రజా సేవలో ముందుకు వెళ్లేలా ఆశీర్వధించాలని ప్రార్థించారు. అనంతరం అక్కడే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తదననంతరం గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవి, వైస్ ఛైర్మన్ కల్యాణ్ కార్ నర్సింగరావు మురియు పాలక వర్గం ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గజ్వేల్ మండలం బంగ్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన సల్లూరీ మహేష్ S%రామయ్య నిరుపేద కుటుంబానికి చెంది వారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సందర్భంగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు రాఆకాంక్షించారు72000 రూపాయల ఆర్థిక సహాయం బంగ్లా వెంకటాపూర్ లోని ఇంటికి వెళ్లి ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గజ్వేల్ బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డిల చేతుల మీదుగా అందజేశారు.ఆ తర్వాత స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తాలో గజ్వేల్ మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ గారు తిరుగులేని ప్రజా నాయకునిగా తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసిన మనసున్న మానవతావాది కేసీఆర్ గారు అని వారు నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రారస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో పోరాట వీరునిగా, పదేళ్ళ పాలనలో మంచి పరిపాలనా దక్షునిగా, నేడు రాష్ట్ర ప్రజలందరూ జాతిపిత గా పిలుస్తున్న నేతగా నిజాయితీకి, నిరాడంబరతకు, నిలువెత్తు రూపం కెసిఆర్ అన్నారు. గజ్వెల్ నియోజకవర్గ అభివృద్ధిలో రాష్టానికి మార్గదర్శనం చేసి రోల్ మొడల్గా నిలిపిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారని గుర్తు చేశారు. వారు ఇచ్చిన స్ఫూర్తి తోనే తాము కూడా ప్రజా సేవలో కొనసాగుతూ సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ భగవంతుని ఆశీర్వాదం తెలంగాణ ప్రజల దీవెనలతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో పురోగమించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ జడ్పీటీసీ పంగ మల్లేశం, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి,అరుణ,జఖి ఉద్దీన్, చంద్రమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, కప్ప మమత, గోలి మమత, మురళి, బొగ్గుల స్వప్న, బాపురావు, భవాని, భాగ్యలక్ష్మీ, శ్రీధర్, అత్తెల్లి శ్రీను, ఆయా గ్రామాల సర్పంచ్ లు, రమేష్, నాగలక్ష్మి, శ్రీనివాస్, నాగరాజు, జ్యోతి స్వామి, బ్యాగారి ప్రభాకర్, నాయకులు బలమని, మద్ది రాజిరెడ్డి,కృష్ణా రెడ్డి, రగుపతి రెడ్డి, రమేష్ గౌడ్, శివ,స్వామి, మల్లేశం, బిమప్ప, అహ్మద్,దశరథ, బాపిరెడ్డి, ఉమర్, కనక గౌడ్, భాను, చందు, బూరన్, శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.2
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.1
- ఆస్తి హక్కుకు సంబంధించిన ఇరుపక్షాలకు నోటి సులు పంపి వివాదం పరిష్కరించాలనిఇచ్చిన ఉత్తర్వులు ఉల్లంఘించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పై హైకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణ పాల్పడ్డారంటూ అంటూ ఆయన కు 6నెలల జైలు శిక్ష రెండు వేలరూపాయల జరిమానావిధిస్తూ హైకోర్టు తీర్పు వెలగరించింది. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల సర్వేనెంబర్ 284/a/2 లో 2.22 ఎకరాల భూమి హక్కులకు సంబంధించిన హైకోర్టు చేసిన ఉత్తర్వులను కలెక్టర్ అమలు చేయకపోవడం సవాల్ చేస్తూ లక్ష్మి కోర్టు ధిక్కరణకే పిటిషన్ దాఖలు చేశారు .దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ లక్ష్మీ తన తాత భూమిని మ మ్యూటేషిన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని పెట్టుకున్న దరఖాస్తు పైస్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు దాన్ని పరిశీలించి చట్టప్రకారం ఉత్తర్వులు వెలువదించాలని ఆగస్టులో హైకోర్టు ఆదేశించింది భూమిని గతంలో గంగయ్య నారాయణ సాదా బై నామాల ద్వార విక్రయించారని తహసిల్దపరిశీలించి కలెక్టర్ ధరఖాస్తూ తిరస్కరించారు. కాగా తాసిల్దార్,. ఆర్ఐఇచ్చిన నివేదిక ఆధారంగాఆమేధరఖాస్తును తిరస్కరించారు. కాగాతహశిల్దార్, ఆర్ఐ నివేదిక ల ఆదారంగాతిరస్కరించడంచెల్లదంటూ హైకోర్టు తెల్చి చెప్పింది కలెక్టర్ రాహుల్ రాజ్ ఉద్దేశపు పూర్వకంగా కోర్టు ఉత్తర్వు లను లంగించినందుకు ఉల్లంఘించినందుకు ఆరు నెలల జైన్ శిక్ష రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తూహైకోర్టు తీర్పు వెలవెరించారు అప్పీలు చేసుకోవాలని కోరుతూ తీర్పు అమలుకు నాలుగు వారాలపాటు నిలిపివేతకుఉత్తర్వు జారిచేశారు. హైకోర్టు తీర్పు నిరుపేదలకు ఊపిరిగా మారింది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో రాష్ట్ర స్థాయి 8 వ వాలీబాల్ పోటీలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వేములవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు ఆది శ్రీనివాస్. రాబోయే ఒలంపిక్స్ లో రాటు తేలిన క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం క్రీడాజ్యోతి పథకంలో భాగంగా 40 క్రీడల్లో యువతీ, యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో వేములవాడ ప్రాంతంలోని క్రీడాకారులు అనేక పథకాలు సాధించారని, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వేములవాడలో జరిగే ఈ పోటీల్లో యువతీ యువకులు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించాలని కోరారు.2