Shuru
Apke Nagar Ki App…
మాటల్లో చెప్పలేని సంతోషాన్ని గుండెల్లో దాచుకోలేని బాధను ఎలాంటి ముసుగు లేకుండా స్వేచ్ఛగా పంచుకునే ఏకైక పవిత్రవేదిక స్నేహం *"మాటల్లో చెప్పలేని సంతోషాన్ని, గుండెల్లో దాచుకోలేని బాధను ఎలాంటి ముసుగు లేకుండా స్వేచ్ఛగా పంచుకునే ఏకైక పవిత్ర వేదిక 'స్నేహం'!* కాలం మారుతున్నా, దారులు వేరవుతున్నా... పెదవులపై చెరగని చిరునవ్వును, గుండెల్లో వీడని ధైర్యాన్ని నింపే ఏకైక బంధం స్నేహం ఒక్కటే! నా గెలుపులో నాకంటే ఎక్కువగా పొంగిపోయి, నా ఓటమిలో కొండంత అండగా నిలిచిన ప్రతి స్నేహ బంధానికి నా హృదయపూర్వక అభివందనాలు. నా జీవితంలో భాగమై, ప్రతి క్షణం తోడుగా ఉన్న నా ప్రాణస్నేహితులందరికీ *'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ' హృదయపూర్వక శుభాకాంక్షలు! FriendshipQuotes స్నేహితులదినోత్సవం ప్రాణస్నేహితులు
Bachannapet, Jangoan, Telangan
మాటల్లో చెప్పలేని సంతోషాన్ని గుండెల్లో దాచుకోలేని బాధను ఎలాంటి ముసుగు లేకుండా స్వేచ్ఛగా పంచుకునే ఏకైక పవిత్రవేదిక స్నేహం *"మాటల్లో చెప్పలేని సంతోషాన్ని, గుండెల్లో దాచుకోలేని బాధను ఎలాంటి ముసుగు లేకుండా స్వేచ్ఛగా పంచుకునే ఏకైక పవిత్ర వేదిక 'స్నేహం'!* కాలం మారుతున్నా, దారులు వేరవుతున్నా... పెదవులపై చెరగని చిరునవ్వును, గుండెల్లో వీడని ధైర్యాన్ని నింపే ఏకైక బంధం స్నేహం ఒక్కటే! నా గెలుపులో నాకంటే ఎక్కువగా పొంగిపోయి, నా ఓటమిలో కొండంత అండగా నిలిచిన ప్రతి స్నేహ బంధానికి నా హృదయపూర్వక అభివందనాలు. నా జీవితంలో భాగమై, ప్రతి క్షణం తోడుగా ఉన్న నా ప్రాణస్నేహితులందరికీ *'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ' హృదయపూర్వక శుభాకాంక్షలు! FriendshipQuotes స్నేహితులదినోత్సవం ప్రాణస్నేహితులు
More news from తెలంగాణ and nearby areas
- వీరందరూ దేశానికి ఈ దేశ ప్రజలకు వీళ్ళు సేవకులు వీళ్లకు జీతాలు మనమే ఇస్తున్నాం: భారతదేశ ప్రజలు వీరందరూ ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు వీళ్ళు సేవకులు వీళ్ళకి జీతాలు మనమే ఇస్తున్నాం జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన కొందరు అధికారులు లేదా నాయకులు ప్రజలకు ఆమడి దూరంలో ఉన్నారు ప్రధాన మంత్రి (Prime Minister) కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి, దేశ పాలనా బాధ్యతలు చూస్తారు. కేంద్ర హోం మంత్రి: శ్రీ అమిత్ షా 2019 నుండి దేశ భద్రత, సరిహద్దుల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సహకార శాఖ బాధ్యతలను చేపడతారు రాష్ట్రపతి (President) దేశ ప్రథమ పౌరుడు మరియు రక్షణ దళాల అధిపతి కేంద్ర మంత్రులు కేబినెట్: వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ జాతీయ విధానాలను అమలు చేస్తారు రాష్ట్ర గవర్నర్లు (Governors) రాష్ట్ర స్థాయిలో నామమాత్రపు అధిపతులుగా ఉంటారు ముఖ్యమంత్రులు (Chief Ministers) రాష్ట్ర ప్రభుత్వ పాలనా అధిపతులు IAS (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) జిల్లా స్థాయిలో కలెక్టర్లుగా, ప్రభుత్వ కార్యదర్శులుగా ఉంటూ IPS (ఇండియన్ పోలీస్ సర్వీస్): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నిరోధానికి జిల్లా ఎస్పీలుగా మరియు ఇతర పోలీస్ విభాగాల్లో పనిచేస్తారు IFS (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్): అడవులు, వన్యప్రాణుల రక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు చూస్తారు IRS (ఇండియన్ రెవెన్యూ సర్వీస్): కేంద్ర పన్నులు, కస్టమ్స్ మరియు ఆదాయపు పన్నుల వసూళ్లు, ఆర్థిక నిర్వహణ చూస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) దేశ అత్యున్నత న్యాయస్థానానికి నాయకత్వం వహిస్తారు (CAG Comptroller and Auditor General) ప్రభుత్వ ఖర్చులు, ఆర్థిక లావాదేవీలను ఆడిట్ చేస్తారు ఎన్నికల కమిషనర్లు (Election Commissioners) దేశంలో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను నిర్వహిస్తారు తహశీల్దార్ (MRO): మండల స్థాయిలో రెవెన్యూ మరియు ప్రజల ధృవీకరణ పత్రాల బాధ్యతలు చూస్తారు గ్రామ సచివాలయ అధికారులు పంచాయతీ కార్యదర్శులు: గ్రామ స్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులు వీరందరికీ నీ జీతాలు మీ ఇంట్లో వాళ్ళు ఇవ్వడం లేదు ఈ దేశానికి మీరు సేవకులు ఈ దేశ ప్రజలకు మీరు పని చేస్తారు మీకు జీతాలు ఇస్తుంది ఈ దేశ ప్రజలు మీరందరూ ప్రజలకు సేవ చేసేది మరిచిపోయి మీరు ప్రజలకు ఆమడంత దూరంలో ఉన్నారు వాళ్ళని కలవాలంటే కొన్ని సంవత్సరాలు పడతాది లేదంటే లంచం అన్న ఇవ్వాలి రికమండేషన్ గా చేయాలి అందరూ ప్రజల సొమ్ము వేల కోట్లు దోచుకుంటున్నారు ఒక సామాన్యుడిగా ఈ దేశ ప్రజలకు తెలియజేస్తున్నాను1
- నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చేయరాదు : ఆర్పిఎఫ్ భువనగిరి ఎస్ఐ కె.కిష్టయ్య నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను నిలపరాదని, వాహనాలను నిలిపినచో భారత రైల్వే యాక్ట్ 159 అమెండ్మెంట్ 2026 ప్రకారం ఐదు వందల రూపాయల పెనాల్టీ విధించడం జరుగుతుందని ఆర్పిఎఫ్ భువనగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె.కిష్టయ్య తెలిపారు. బుధవారం జనగామ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పలువురు ప్రయాణికులతో మాట్లాడుతూ నిషేధిత రైల్వే ప్రగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చెసినచో భారత రైల్వే యాక్ట్ 159/2026 ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోబడతాయో వివరించారు. 500 రూపాయల నుండి ఆపై ఫైన్ వేయబడునని, ప్రజలు, ప్రయాణికులు ఇది గమనించాలి సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.2
- పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని చూసిన మాజీమంత్రి ఎర్రబెల్లి అమెరికా పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్న వెంటనే నేరుగా సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి వెళ్లిన జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు.ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ప్రజా జీవితంలో మళ్లీ చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.1
- రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్ర పూజలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా వెలసిన పద్మావతి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం శ్రవణా నక్షత్ర పూజలను శ్రీ రామభక్త భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాయగిరి కమాన్ వద్ద డప్పు వాయిద్యాలు స్వామివారి కీర్తనలతో పాదయాత్ర నిర్వహించి స్టేషన్ రాయగిరి వద్ద గల వెంకటేశ్వర స్వామి గుట్టపైకి మెట్ల ద్వారా బయలుదేరి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అభిషేకాధి కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు వివిధ ప్రాంతాలకు చెందినవారు వందల మందిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన మండలి సభ్యులు గడ్డమీ చంద్రయ్య గౌడ్ పెద్దగాని శ్రీనివాస్ గౌడ్ సామల శ్రీరాములు నర రమేష్1
- భువనగిరి: సైబర్ మోసం.. వీడియో కాల్తో బెదిరింపులు అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మన్మధ కుమార్ సూచించారు. చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి వీడియో కాల్ చేసి స్కీన్షాట్లు తీసిన మోసగాళ్లు, పోలీసు ఐడీ కార్డు డిపిగా పెట్టుకుని కేసు నమోదు కాకుండా డబ్బులు చెల్లించాలని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు పరిశీలించి ఇది సైబర్ మోసమని గుర్తించారు. అపరిచిత కాల్స్, బెదిరింపులను నమ్మవద్దని సీఐ సూచించారు.1
- నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు. నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు.. కానీ ఇంకో బలమైన కోరిక ఉంది నవంబర్ నెలలో నా మనసులో మాటలు అన్నీ బయట పెడతా, నా రాజకీయ కోరిక కూడా చెప్తాను – జగ్గారెడ్డి1
- మూడున్నర ఏళ్ల క్రితం రాహుల్ గాంధీ మాటిచ్చారు :కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి నాకు ఎవరిమీదైనా కోపం ఉంటే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీకే చెప్తాను మూడున్నరేళ్ల క్రితం రాహుల్ గాంధీకి మాటిచ్చాను..అందుకే అంతర్గత విషయాలు బయట మాట్లాడటంలేదు – కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి1
- ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా ఆపిల్ పండ్ల కోసం ఎగబడ్డ జనాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా.ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనాలు నిమిషాల్లోనే డీసీఎం ఆపిల్ పండ్ల లోడు లూటీ.1