పొందూరు ఖద్దరుకు మహర్దశ.. రూ. 100 కోట్లతో క్లస్టర్ యూనిట్. ఎమ్మెల్యే కూన రవికుమార్ పొందూరు: పొందూరు ఖద్దరుకు ఉన్న చారిత్రక విశిష్టతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ స్పష్టం చేశారు. సుమారు రూ. 100 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ క్లస్టర్ యూనిట్ ద్వారా ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఖాదీ–ఖద్దర్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నియోజకవర్గ పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పొందూరు ఖద్దరుకు గ్లోబల్ గుర్తింపు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి, ‘జీఐ’ ట్యాగ్ సాధించడంలో కీలక పాత్ర పోషించామని గుర్తుచేశారు. ఇప్పుడు రూ. 100 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్లస్టర్ ద్వారా ఆధునిక సాంకేతికతను జోడించి ఖాదీ ఉత్పత్తుల తయారీ, శిక్షణ, మార్కెటింగ్లను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్లు వివరించారు. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే వేలాది మంది స్థానిక మహిళలకు, కార్మికులకు, యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. స్థల విస్తీర్ణం, మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీటి వసతులు, రహదారి అనుసంధానంపై అధికారులతో సమీక్షించిన ఆయన, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగానే ఈ క్లస్టర్ మంజూరైందని, ఇది స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త గుర్తింపునిస్తుందని స్పష్టం చేశారు. క్లస్టర్ యూనిట్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ విభాగం ఉన్నతాధికారులు, కూటమికి చెందిన స్థానిక నాయకులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
పొందూరు ఖద్దరుకు మహర్దశ.. రూ. 100 కోట్లతో క్లస్టర్ యూనిట్. ఎమ్మెల్యే కూన రవికుమార్ పొందూరు: పొందూరు ఖద్దరుకు ఉన్న చారిత్రక విశిష్టతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ స్పష్టం చేశారు. సుమారు రూ. 100 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ క్లస్టర్ యూనిట్ ద్వారా ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బుధవారం మండల కేంద్రంలో ఖాదీ–ఖద్దర్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నియోజకవర్గ పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పొందూరు ఖద్దరుకు గ్లోబల్ గుర్తింపు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి, ‘జీఐ’ ట్యాగ్
సాధించడంలో కీలక పాత్ర పోషించామని గుర్తుచేశారు. ఇప్పుడు రూ. 100 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్లస్టర్ ద్వారా ఆధునిక సాంకేతికతను జోడించి ఖాదీ ఉత్పత్తుల తయారీ, శిక్షణ, మార్కెటింగ్లను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్లు వివరించారు. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే వేలాది మంది స్థానిక మహిళలకు, కార్మికులకు, యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. స్థల విస్తీర్ణం, మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీటి వసతులు, రహదారి అనుసంధానంపై
అధికారులతో సమీక్షించిన ఆయన, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగానే ఈ క్లస్టర్ మంజూరైందని, ఇది స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త గుర్తింపునిస్తుందని స్పష్టం చేశారు. క్లస్టర్ యూనిట్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ విభాగం ఉన్నతాధికారులు, కూటమికి చెందిన స్థానిక నాయకులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
- పొందూరు: పొందూరు ఖద్దరుకు ఉన్న చారిత్రక విశిష్టతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ స్పష్టం చేశారు. సుమారు రూ. 100 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ క్లస్టర్ యూనిట్ ద్వారా ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఖాదీ–ఖద్దర్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నియోజకవర్గ పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పొందూరు ఖద్దరుకు గ్లోబల్ గుర్తింపు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి, ‘జీఐ’ ట్యాగ్ సాధించడంలో కీలక పాత్ర పోషించామని గుర్తుచేశారు. ఇప్పుడు రూ. 100 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్లస్టర్ ద్వారా ఆధునిక సాంకేతికతను జోడించి ఖాదీ ఉత్పత్తుల తయారీ, శిక్షణ, మార్కెటింగ్లను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్లు వివరించారు. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే వేలాది మంది స్థానిక మహిళలకు, కార్మికులకు, యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. స్థల విస్తీర్ణం, మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీటి వసతులు, రహదారి అనుసంధానంపై అధికారులతో సమీక్షించిన ఆయన, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగానే ఈ క్లస్టర్ మంజూరైందని, ఇది స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త గుర్తింపునిస్తుందని స్పష్టం చేశారు. క్లస్టర్ యూనిట్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ విభాగం ఉన్నతాధికారులు, కూటమికి చెందిన స్థానిక నాయకులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.4
- అయ్యా రాజకీయాలు ఏమైనా వుంటే వేరే టాపిక్ మీద చేసుకోండి.స్వామి వారి లడ్డులో ఎలాంటి కొవ్వు పదార్థాలు లేవు అని సిబిఐ తేల్చిన తరువాత ఒక హిందువుగా మనమందరం సంతోషపడాలి.కాని బాధ ఎందుకు. తప్పు ఎవరిదైనా స్వామి వారు వదిలిపెట్టారు. ఇకనైనా స్వామి వారికి రాజకీయాలు ఆపాదించ్చవద్దనికోరుకుంటున్నాము.1
- Post by APPARAO KONCHADA1
- పొందూరు మండలంలో రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించబోయే ఖాదీ–ఖద్దర్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం స్థలాన్ని పరిశీలించారు. ఖద్దరు కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు లభిస్తుందని ఆయన వివరించారు.1
- ఫిబ్రవరి 4,టెక్కలి మండలం నర్సింగపల్లి తదితర గ్రామాల్లో బుధవారం ఉదయం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి నలుగురిని గాయపరిచిన విషయం తెలిసిందే. మధ్యాహ్నానానికి ఆ సంఖ్య 9కి చేరింది. గాయపడిన మరో ఐదుగురు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. ఒక రోజులో తొమ్మిది మంది కుక్క కాటుకు గురవ్వడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు పరిశీలించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.3
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి టెక్కలి మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో నర్సింగపల్లి మొక్ర. మొఖలింగపురం. కిట్టలపాడు తదితర గ్రామాల్లో పిచ్చుకలు స్వైర విహారం చేస్తూ కనబడిన వారి కల్లా కరిచి గాయాల పాలు చేస్తున్నాయి. దీనితో తెల్లవారి నుండి టెక్కలి జిల్లా ఆసుపత్రికి కుక్కలు కరిచిన బాధితులు చికిత్స కోసం తరలివస్తున్నారు .ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పిచ్చి కుక్కల్ని అరికట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు4
- వైసీపీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేయాలి గ్రామస్థాయిలో వైసీపీ బలోపేతానికి నాయకులు ,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కోరారు. బుధవారం పాతపట్నం మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు కలిసి కట్టుగా పని చేయాలని అన్నారు. అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే విధంగా సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- శ్రీకాకుళం: నగరంలో ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జేమ్స్, కిమ్స్ సంస్థలు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ప్రారంభించారు. ముందస్తు అవగాహన, ఆరోగ్యకరమైన ఆహారం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సరు జయించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.1