logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నడి చౌరస్తాపై విద్యార్థినులకు పోలీసులకు మధ్య వాగ్వివాదంవిద్యార్థినిపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్* మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టి ఈడ్చుకుని కొట్టిన విద్యార్థినిలు షాద్ నగర్ పట్టణ శివారులో నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినిల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కమ్మదనం వద్ద ఓ భవనంలో కొనసాగుతున్న ఈ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ప్రిన్సిపల్ అక్రమాలు వేధింపులపై గళం ఎత్తి మెరుపు ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా ఆదివారం కావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున కళాశాల భవనం నుండి రోడ్లపైకి వచ్చారు. అయితే ఈ క్రమంలో పట్టణ చౌరస్తాకు చేరుకున్న విద్యార్థినిలు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు ఆందోళన విరమింప చేయడానికి బలవంతంగా విద్యార్థినీలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో విద్యార్థినిలతో ఓ మహిళా కానిస్టేబుల్ వాగ్వివాదానికి దిగారు.ఇంతలో ఓ మహిళా కానిస్టేబుల్ విద్యార్థినిపై చేయి చేసుకోవడం చూసి మిగతా విద్యార్థులు ఆగ్రహానికి గురై తమనె కొడతారా అంటూ మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని ఈడ్చుకుని చితకబాదారు. ఈ ఘటనకు అందరూ నిశ్చేస్తులై పోయారు.ఒకరిపై చేయి చేసుకున్న ఎవరిని విడిచిపెట్టబోమని విద్యార్థినిలు తీవ్రంగా పోలీసులను హెచ్చరించారు. lఈ క్రమంలో పోలీసులు విద్యార్థినిలను బలవంతంగా కొంతమందిని పోలీసు వాహనంలోకించుకొని వెళ్లిపోయారు.మహిళా సిబ్బంది సరిగ్గా సంఖ్య లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి..

on 2 November
user_Shaik Habeeb
Shaik Habeeb
Journalist Nagarkurnool•
on 2 November

నడి చౌరస్తాపై విద్యార్థినులకు పోలీసులకు మధ్య వాగ్వివాదంవిద్యార్థినిపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్* మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టి ఈడ్చుకుని కొట్టిన విద్యార్థినిలు షాద్ నగర్ పట్టణ శివారులో నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినిల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కమ్మదనం వద్ద ఓ భవనంలో కొనసాగుతున్న ఈ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ప్రిన్సిపల్ అక్రమాలు వేధింపులపై గళం ఎత్తి మెరుపు ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా ఆదివారం కావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున కళాశాల భవనం నుండి రోడ్లపైకి వచ్చారు. అయితే ఈ క్రమంలో పట్టణ చౌరస్తాకు చేరుకున్న విద్యార్థినిలు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు ఆందోళన విరమింప చేయడానికి బలవంతంగా విద్యార్థినీలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో విద్యార్థినిలతో ఓ మహిళా కానిస్టేబుల్ వాగ్వివాదానికి దిగారు.ఇంతలో ఓ మహిళా కానిస్టేబుల్ విద్యార్థినిపై చేయి చేసుకోవడం చూసి మిగతా విద్యార్థులు ఆగ్రహానికి గురై తమనె కొడతారా అంటూ మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని ఈడ్చుకుని చితకబాదారు. ఈ ఘటనకు అందరూ నిశ్చేస్తులై పోయారు.ఒకరిపై చేయి చేసుకున్న ఎవరిని విడిచిపెట్టబోమని విద్యార్థినిలు తీవ్రంగా పోలీసులను హెచ్చరించారు. lఈ క్రమంలో పోలీసులు విద్యార్థినిలను బలవంతంగా కొంతమందిని పోలీసు వాహనంలోకించుకొని వెళ్లిపోయారు.మహిళా సిబ్బంది సరిగ్గా సంఖ్య లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి..

  • user_User7605
    User7605
    Srikakulam, Andhra Pradesh
    😡
    on 8 November
  • user_User1808
    User1808
    Chintapalle, Alluri Sitharama Raju
    😂
    on 8 November
  • user_Mraju
    Mraju
    Ardhaveedu, Prakasam
    😂
    on 5 November
  • user_User4642
    User4642
    Lingalaghanpur, Jangoan
    🤝
    on 3 November
  • user_User4642
    User4642
    Lingalaghanpur, Jangoan
    😤
    on 3 November
More news from Siddipet and nearby areas
  • Post by Katravath Hathiram
    1
    Post by Katravath Hathiram
    user_Katravath Hathiram
    Katravath Hathiram
    Lawyer Siddipet•
    10 hrs ago
  • నెల్లూరు నగరంలోని నేటి ఉదయం అంగరంగ వైభవంగా అటల్ బిహారీ వాజ్పాయ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.నెల్లూరుకు చేరుకున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర దారి పొడవునా నిలబడి ఘనంగా స్వాగతం‌ పలికిన బి జె పి శ్రేణులు వాజ్ పాయ్ మోడీల సారధ్యంలో దేశంలో ఏపిలో జరిగిన అభివృద్ధి పనులతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించిన నేతలు, ఈ కార్యక్రమంలో వాజ్ పాయ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బిజెపి ఎపి అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలుగు దేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి,ఇంటూరి నాగేశ్వరరావు, వాకాటి నారాయణ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు సుమంత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    1
    నెల్లూరు నగరంలోని నేటి ఉదయం అంగరంగ వైభవంగా అటల్ బిహారీ వాజ్పాయ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.నెల్లూరుకు చేరుకున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర దారి పొడవునా నిలబడి ఘనంగా స్వాగతం‌ పలికిన బి జె పి శ్రేణులు వాజ్ పాయ్ మోడీల సారధ్యంలో దేశంలో ఏపిలో జరిగిన అభివృద్ధి పనులతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించిన నేతలు, ఈ కార్యక్రమంలో  వాజ్ పాయ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బిజెపి ఎపి అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలుగు దేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి,ఇంటూరి నాగేశ్వరరావు, వాకాటి నారాయణ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు సుమంత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    Journalist Spsr Nellore•
    21 hrs ago
  • మన తిరుపతిలో దురంధర్ సినిమా. పాకిస్తాన్ యొక్క కుట్రలను బట్టబయలు చేసిన హిందీ సినిమా కాంధహార్ విమానం హైజాక్ మరియు దొంగ నోట్లు పాకిస్తాన్లో ముద్రించిన ఘటనలపై ఈ సినిమాలో భారత ప్రజలకు నగ్నసత్యం తెలుపుతూ చిత్రీకరించాడు. అంతేకాకుండా ఒక సైనికుడు స్ఫూర్తితో పాకిస్తాన్లో వెళ్లి తన ప్రాణాలను అడ్డుపెట్టి దేశాన్ని కాపాడిన గొప్ప వ్యక్తికి గురించి కూడా ఈ సినిమాలో చూపడం జరిగింది.జాతీయవాదం మిత్రులందరూ కచ్చితంగా ఈ చిత్రాన్ని చూడగలరు.భారత్ మాతా కి జై హిందూ సంఘాల ప్రతినిధులు, మహేష్ డేగల,వజ్రాల చంద్ర శేఖర్,మునిరామ్ రెడ్డి,సురేష్ నాయక్
    1
    మన తిరుపతిలో దురంధర్ సినిమా. 
పాకిస్తాన్ యొక్క కుట్రలను బట్టబయలు చేసిన హిందీ సినిమా కాంధహార్ విమానం హైజాక్ మరియు దొంగ నోట్లు పాకిస్తాన్లో ముద్రించిన ఘటనలపై  ఈ సినిమాలో భారత ప్రజలకు నగ్నసత్యం  తెలుపుతూ చిత్రీకరించాడు. అంతేకాకుండా ఒక సైనికుడు స్ఫూర్తితో పాకిస్తాన్లో వెళ్లి తన ప్రాణాలను అడ్డుపెట్టి దేశాన్ని కాపాడిన గొప్ప వ్యక్తికి గురించి కూడా ఈ సినిమాలో చూపడం జరిగింది.జాతీయవాదం మిత్రులందరూ కచ్చితంగా ఈ చిత్రాన్ని చూడగలరు.భారత్ మాతా కి జై హిందూ సంఘాల ప్రతినిధులు, మహేష్ డేగల,వజ్రాల చంద్ర శేఖర్,మునిరామ్ రెడ్డి,సురేష్ నాయక్
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati•
    22 hrs ago
  • అంబేద్కర్ భవన స్థలాన్ని వెంటనే పరిష్కరించాలి. ఏఐబిఎస్పి. పలమనేరు డిసెంబర్ 16( ప్రజా ప్రతిభ) గంగవరం మండలంలో వివాదాస్పదంగా మారిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంకు సంబంధించిన స్థలాన్ని అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం కోరారు. అందులో భాగంగా మంగళవారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు మణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.వి. మునిరత్నం, అమానుల్లా,వాణి, గుర్రం సుబ్రహ్మణ్యం, నారాయణ శెట్టి, మాట్లాడుతూ గత వారం రోజుల నుండి అంబేద్కర్ భవనానికి సంబంధించిన స్థలాన్ని అక్కడే నివాసముంటున్న శ్రీలంక కాలనీవాసులు ఆక్రమించుకోవాలనే ప్రయత్నాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. నిత్యం తహసిల్దార్ , ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆ మార్గంలోనే వెళ్తున్నప్పటికీ శ్రీలంక వాసులు ఆక్రమిస్తున్న స్థలం కనపడినా ప్రశ్నించ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీలంక శరణార్థులు రోజుకో దేవాలయం పేరు చెప్పుకొని ఉన్నత అధికారులకు అర్జీలతో పాటు ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ భవన ఆవరణలో శరణార్థులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఇతరులకు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాటిని నివారించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. లంక వాసులు ఆ స్థలములో చేస్తున్న వివిధ రకాల అసాంఘిక కార్యక్రమాలను చూసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేయక చాలా ఏళ్ల నుండి చేతగాని వారిగా మిగిలిపోతున్నారని ఆవేద వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్థల వివాదంలో శ్రీలంక వాసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళితే, ఓ అధికారి సమన్వయం పాటించండని, ఇంకొక అధికారి శ్రీలంక వాసులు రెచ్చగొట్టిన మీరు రెచ్చిపోవద్దని ఉచిత సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతవరకు ఆక్రమణదారులను అధికారులు పిలిపించి విచారించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంబేద్కర్ స్థలాన్ని ఆక్రమించి, విద్వేషాలను రెచ్చగొడుతున్న వ్యక్తులను విచారించి నివారించాలని , అంబేద్కర్ భవనం స్థలాన్ని సర్వే చేసి హద్దులు చూపించాలని కోరారు. మంజునాథ్, సూర శ్రీనివాసులు, శివ, ఆనంద, శాంతమ్మ, మునెయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
    1
    అంబేద్కర్ భవన స్థలాన్ని వెంటనే పరిష్కరించాలి. ఏఐబిఎస్పి.
పలమనేరు డిసెంబర్ 16( ప్రజా ప్రతిభ)
గంగవరం మండలంలో వివాదాస్పదంగా మారిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంకు సంబంధించిన స్థలాన్ని అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం కోరారు. అందులో భాగంగా మంగళవారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు మణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.వి. మునిరత్నం, అమానుల్లా,వాణి, గుర్రం సుబ్రహ్మణ్యం, నారాయణ శెట్టి,  మాట్లాడుతూ గత వారం రోజుల నుండి అంబేద్కర్ భవనానికి సంబంధించిన స్థలాన్ని అక్కడే నివాసముంటున్న శ్రీలంక కాలనీవాసులు ఆక్రమించుకోవాలనే ప్రయత్నాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. నిత్యం తహసిల్దార్ , ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆ మార్గంలోనే వెళ్తున్నప్పటికీ శ్రీలంక వాసులు ఆక్రమిస్తున్న స్థలం కనపడినా ప్రశ్నించ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీలంక శరణార్థులు రోజుకో దేవాలయం పేరు చెప్పుకొని ఉన్నత అధికారులకు అర్జీలతో పాటు ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ భవన ఆవరణలో శరణార్థులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఇతరులకు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాటిని  నివారించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. లంక వాసులు ఆ స్థలములో చేస్తున్న వివిధ రకాల అసాంఘిక కార్యక్రమాలను చూసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేయక చాలా ఏళ్ల నుండి చేతగాని వారిగా మిగిలిపోతున్నారని ఆవేద వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్థల వివాదంలో శ్రీలంక వాసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళితే, ఓ అధికారి సమన్వయం పాటించండని, ఇంకొక అధికారి శ్రీలంక వాసులు రెచ్చగొట్టిన మీరు రెచ్చిపోవద్దని ఉచిత సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతవరకు ఆక్రమణదారులను అధికారులు పిలిపించి విచారించకపోవడంలో  ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంబేద్కర్ స్థలాన్ని ఆక్రమించి, విద్వేషాలను రెచ్చగొడుతున్న వ్యక్తులను విచారించి నివారించాలని , అంబేద్కర్ భవనం స్థలాన్ని సర్వే చేసి హద్దులు చూపించాలని కోరారు. మంజునాథ్, సూర శ్రీనివాసులు, శివ, ఆనంద, శాంతమ్మ, మునెయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Chittoor•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.