Shuru
Apke Nagar Ki App…
Aishwarya Rajesh at Nirmal Wonderland Event || #newsupdate #krnews369
KR NEWS 369
Aishwarya Rajesh at Nirmal Wonderland Event || #newsupdate #krnews369
More news from Adilabad and nearby areas
- ఇచ్చోడ : మండలకేంద్రంలో జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ తో మాజీ ఎంపీ సోయం బాపూరావు,బోత్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ తో కలిసి పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.నరేష్ జాదవ్ మాట్లాడుతూ.ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో నిష్టగా అల్లాపై భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష నిర్వహిస్తారని,ఈ రంజాన్ మాసంలో వారి ప్రార్థన లతోరాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు రంజాన్ మాసం సామరస్యానికి సోదర భావానికి ప్రతిక ఈ సందర్భంగా ప్రజలందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు సాజిత్ ఖాన్,మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి,మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజరెడ్డి,ఇచ్చోడా గ్రామ సర్పంచ్ జాలైజాకు,జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్,బోత్ ఆత్మ కమిటీ చైర్మన్ రాజు యాదవ్,బోథ్ నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ ముస్తఫా,ఇచ్చోడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ రెడ్డి,ఇచ్చోడ ఎక్స్ ఎంపీటీసీ జాహిద్,బోత్ మాజీ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కరుణాకర్,తొడసం దౌలత్ రావు,చిట్యాల గంగన్న,సంతోష్,కాడే సంతోష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఉత్తునూరులో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని డ్వాక్రా మహిళా సమాఖ్య భవనానికి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ భూమిపూజ చేశారు. భవనం మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్థలం కేటాయించి, పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీసీ భూమయ్య, సంఘం అధ్యక్షురాలు రజిత మరియు మహిళలు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడారు.1
- కుమురం భీమ్ ఆసిఫాబాద్: సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్&బీ రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్ల నిర్వహణ లేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెంచికల్పేట్ సహా అటవీ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిని ఆర్టీసీ బస్సులు సైతం నడవలేని పరిస్థితి ఉందని తెలిపారు. అటవీశాఖ అనుమతులు సాధించి వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాదాలయంలో గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో మంజీరా నది జలాలతో అభిషేకం పంచామృత అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గ్రహించారు పరాభవనామ ఉగాది సందర్భంగా అమ్మవారి వేపాకులు మామిడాకులతో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు పుష్పార్చన గావించారు అనంతరం నక్షత్ర హారతి ఇచ్చారు అనంతరం భక్తులకు దివ్యదర్శభాగ్యం కలిగించారు. ఆలయవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయసిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు. భక్తులకు తీర్థ వితరణగావించారు. కోరిక కోరికలు తీరనభక్తులు అమ్మవారికి ఓడిబియ్యం,1
- Post by KR NEWS 3691
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజవర్గం డోంగ్లి మండల కేంద్రంలోని గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహదేవ్ మందిరంలో వేదపండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. హనుమన్ మందిరం, మహదేవ్ మందిరం, రామాలయం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల మానవత్వం మరోసారి వెలుగుచూసింది అప్రమత్తంగా స్పందించి అడవిని, అందులోని మూగజీవులను కాపాడిన ఘటన ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లె అడవిలో మంటలు వేగంగా వ్యాపిస్తున్న సమయంలో అదే దారిలో కేసు విచారణకు వెళ్తున్న సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్ర చారి మంటలను గమనించారు.క్షణం ఆలస్యం చేయకుండా తన సిబ్బందితో కలిసి మంటల మధ్యకే దూసుకెళ్లిన పోలీసులు, ఎలాంటి భయాందోళనలు లేకుండా అగ్ని జ్వాలలను అదుపులోకి తెచ్చారు. భారీ ప్రమాదాన్ని ముందుగానే అడ్డుకున్నారు. అడవిలో నివసించే మూగజీవులు, చిన్న ప్రాణులు మంటల్లో కాలిపోకుండా కాపాడిన పోలీసుల ఈ చర్య స్థానికుల్లో ప్రశంసల వర్షం కురిపిస్తోంది.1