Shuru
Apke Nagar Ki App…
మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం ఎమ్మెల్యే కీలక ఆదేశాలు
K AMPAIAH ACHARI
మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం ఎమ్మెల్యే కీలక ఆదేశాలు
More news from తెలంగాణ and nearby areas
- Post by Mahesh Mahi1
- హనీ ట్రాప్లో కొత్త మలుపు: రంగమ్మ ముఠాలో చీలికలు,నరేంద్ర రెడ్డి నేతృత్వంలో రెండో గ్యాంగ్ బయటపడింది 📝 ప్రత్యేక కథనం: అనంతపురం నగరాన్ని కుదిపేస్తున్న హనీ ట్రాప్ వ్యవహారంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఒకే ముఠాగా కొనసాగుతున్న రంగమ్మ గ్యాంగ్లో చీలికలు ఏర్పడి, నరేంద్ర రెడ్డి నేతృత్వంలో కొత్తగా రెండో ముఠా ఏర్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం, రంగమ్మ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, తీయటి మాటలతో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను హనీ ట్రాప్లోకి దింపి, బెదిరింపులతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 40 మందికి పైగా బాధితులను ఈ ముఠా టార్గెట్ చేసినట్టు అంచనా. ఇదే సమయంలో, రంగమ్మకు సమీపంగా ఉన్న నరేంద్ర రెడ్డి, ఇద్దరు యువతులతో కలిసి వేరుగా కొత్త ముఠా ఏర్పాటు చేసి, స్వతంత్రంగా హనీ ట్రాప్ కార్యకలాపాలు ప్రారంభించినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత విస్తరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.2
- నాగర్కర్నూలు జిల్లాలో మూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వం 11 శాతం ఫిట్మెంట్తో పాటు, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడంతో కార్మికులు శాంతించారు. సుదీర్ఘ చర్చల అనంతరం గుర్తింపు సంఘాల ఎన్నికలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. శనివారం ఉదయం నుంచే బస్సులు డిపోల నుంచి బయటకు రావడంతో ప్రయాణికులకు ఊరట లభించింది1
- మలేరియా లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.మలేరియాను కేవలం ఒక సాధారణ జ్వరంగా చూడకూడదనీ,దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందనీ,తగు జాగ్రత్తలతో మలేరియా నుండి రక్షణ పొందవచ్చునని రాయదుర్గం అర్బన్ వైద్యాధికారులు డా. యశ్వంత్,మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్రప్రసాద్ తెలిపారు.మలేరియా అంతానికి అందరూ కట్టుబడి ఉండాలనీ,ఇప్పుడు మనకు సాధ్యమే,ఇప్పుడు మనం చేసి తీరాలి" అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. రాయదుర్గం అర్బన్ పరిధిలోని 14 సచివాలయం మారెమ్మగుడి దగ్గర ప్రజలకు మలేరియా జ్వర లక్షణాలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై అవగాహన కల్పించారు.1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్...1
- నగలు అమ్మి భర్త ఈశ్వర్ రెడ్డిని లేపేసేందుకు ప్రియుడితో కుట్ర పన్నిన భార్య శిల్పాతో పాటు కిరాయి హంతకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కుట్ర, హత్య కేసు ను ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించిన ASP, విభూకృష్ణ...1
- కర్నూలు జిల్లా నందవరం మండలం, పూలచింత గ్రామంలో ఎస్సీ కాలనీ నివాసులకు గత నెల రోజుల నుండి నీటి కొరత ఉంది అని అధికారులను కోరిన పట్టించుకునే నాధుడు లేకుండా అయిపోయిందనీ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా అధికారులు కూడా కులవివక్షత చూపించడం ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించడం జరిగింది . వెంటనే కలెక్టర్ చొరవ తీసుకొని పంచాయతీ సెక్రెటరీను సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. మా సమస్యలను పరిష్కరించకపోతే మా దళిత సంఘాలను కలుపుకొని ధర్నాలు, రాస్తారోకోలు,చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు పోతురాజు భాస్కర్, చంటి, బుజ్జన్న ,ఏలిష్, తదితరులు పాల్గొన్నారు.1
- నేను మలేరియా వ్యాధి ప్రమాదాన్ని గుర్తించి, దాని నివారణ కోసం నిబద్ధతతో పనిచేస్తాను. నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, నీరు నిల్వ ఉండకుండా చూసి దోమల పెరుగుదలను అడ్డుకుంటాను. దోమల నెట్లు, రిపెలెంట్లు వినియోగిస్తూ నా కుటుంబం, పొరుగువారిని కూడా ప్రోత్సహిస్తాను. మలేరియా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పిస్తాను. “చికిత్స కంటే నివారణ మేలైనది” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేస్తాను. సమాజం కలిసి పనిచేస్తేనే మలేరియా నిర్మూలన సాధ్యమని నమ్ముతూ, ఆరోగ్యకరమైన భారత్ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తాను.1
- కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం లో పెట్రోల్ డీజిల్ కొరత ప్రజలను వినియోగదారులను వేధిస్తోంది.. మైదుకూరు పట్టణంలో ని అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. జిల్లా కేంద్రం నుండి డీజిల్ పెట్రోల్ సరఫరా కాకపోవడం బంకు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. బుక్ చేసిన తర్వాత నాలుగు నుండి ఐదు రోజులు పడుతుంది ఈ పరిస్థితి ఏర్పడుతుందని యజమానులు తెలుపుతున్నారు.. పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు క్యూ కట్టారు.. పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందన్న అనుమానంతో వాహనదారులు ఎగబడి క్యాన్లలో సైతం పెట్రోలు నింపుకొని వెళ్తున్న వినియోగదారులు .. ప్రభుత్వ అధికారులు స్పందించి డీజిల్ పెట్రోల్ కొత్తలేకుండా చూడాలని వినియోదారులు ప్రజలు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు..1