Shuru
Apke Nagar Ki App…
విద్యుత్ వైర్లకు తగిలిన JCB.. డ్రైవర్ సజీవదహనం విద్యుత్ వైర్లకు JCB తగలడంతో మంటలు వ్యాపించి డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమైన ఘటన చింతపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని చెరువూరులో జరుగుతున్న వంతెన నిర్మాణ పనులకు విశాఖకి చెందిన శ్రీనివాసరాజు JCBని తీసుకువెళ్తుండగా ఇటుక దిబ్బలు గ్రామానికి వచ్చేసరికి విద్యుత్ వైర్లకు JCB తగిలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాసరాజుకు మంటలు అంటుకొని సజీవదహనం అయ్యారు.
Nava surya
విద్యుత్ వైర్లకు తగిలిన JCB.. డ్రైవర్ సజీవదహనం విద్యుత్ వైర్లకు JCB తగలడంతో మంటలు వ్యాపించి డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమైన ఘటన చింతపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని చెరువూరులో జరుగుతున్న వంతెన నిర్మాణ పనులకు విశాఖకి చెందిన శ్రీనివాసరాజు JCBని తీసుకువెళ్తుండగా ఇటుక దిబ్బలు గ్రామానికి వచ్చేసరికి విద్యుత్ వైర్లకు JCB తగిలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాసరాజుకు మంటలు అంటుకొని సజీవదహనం అయ్యారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- విద్యుత్ వైర్లకు JCB తగలడంతో మంటలు వ్యాపించి డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమైన ఘటన చింతపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని చెరువూరులో జరుగుతున్న వంతెన నిర్మాణ పనులకు విశాఖకి చెందిన శ్రీనివాసరాజు JCBని తీసుకువెళ్తుండగా ఇటుక దిబ్బలు గ్రామానికి వచ్చేసరికి విద్యుత్ వైర్లకు JCB తగిలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాసరాజుకు మంటలు అంటుకొని సజీవదహనం అయ్యారు.1
- Post by Shyam1
- గత 4 సంవత్సరాలుగా మమ్మల్ని నమ్మినందుకు విజయనగరంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ దంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కొనసాగించాలని మేము ఎదురుచూస్తున్నాము. Thank you to everyone in Vizianagaram for trusting us over the past 4 years. We look forward to continuing to care for your dental health. Dr. Kiran Vungarala, ఎత్తు వంకర పళ్ళు చికిత్స నిపుణులు Dr. Priyanka Majji, చిగుళ్ల చికిత్స మరియు దంత ఇంప్లాంట్లు నిపుణులు Kiran Dental Clinic, Vizianagaram1
- దేవుడి నైవేద్యంతో ‘ధన’ రాజకీయం చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ నిప్పులు, ఉదయ అక్షరం, పిబ్రవరి -19:తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరమైన అపచారానికి పాల్పడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, బడ్జెట్లోని డొల్లతనాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు.గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని బొత్స విమర్శించారు. "సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరుగుతున్న వేళ, చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని ఇప్పటికే తేలిపోయింది. తన రాజకీయ ఉనికి కోసం దేవుడి నైవేద్యాన్ని కూడా అపవిత్రం చేయడానికి ఆయన వెనుకాడటం లేదు" అని మండిపడ్డారు.చంద్రబాబు తన ‘ధనదాహం’ కోసం ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తున్నారో బొత్స సత్యనారాయణ సంచలన గణాంకాలతో వివరించారు. గతంలో కిలో రూ. 320 కే లభించిన నాణ్యమైన నెయ్యిని పక్కన పెట్టి.. ఇప్పుడు చంద్రబాబు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ తో సంబంధాలున్న ‘ఇందాపూర్ డెయిరీ’ ద్వారా కిలో రూ. 700 కు సరఫరా చేయిస్తున్నారని ఆరోపించారు. ధరను అకస్మాత్తుగా రెట్టింపు చేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో, ఆ కమిషన్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "భక్తి ముసుగులో అవినీతి వ్యాపారం చేస్తున్నారు. రూ. 320 నుంచి రూ. 700 కు ధర పెరగడం వెనుక ఉన్న ‘సీక్రెట్’పై బహిరంగ చర్చకు సిద్ధమా?" అని కూటమి నేతలకు బొత్స సవాల్ విసిరారు.కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. సభలో వాస్తవాలు మాట్లాడితే ప్రభుత్వం బట్టబయలవుతుందనే భయంతోనే చర్చ నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఇప్పుడు బడ్జెట్లో కోతలు విధిస్తూ మోసం చేస్తున్నారని, దమ్ముంటే పూర్తిస్థాయి చర్చకు రావాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.1
- మన్యం జిల్లా పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగివేమన జయంతి ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం గారు యోగివేమన చిత్రపటానికి పుష్పమాలను తో అలంకరించారు. సంస్కృత పండితులు బౌరోతు శంకర రావు మాట్లాడుతూ 17వ శతాబ్దానికి చెందిన యోగివేమన చెప్పిన పద్యాలు అక్షర సత్యాలు. విశ్వ మానవాళికి వేమన చెప్పిన పద్యాలు వేదాలతో సమానము. వాడుకు భాషలో అందరి కి అర్థమయ్యే రీతిలో పద్యాలు చెప్పారు. వేమన శతకంలో కొన్ని పద్యాలు మాత్రమే మనకు ఎరుక . వేమన స్ఫూర్తితో శంకర శతకాన్ని రచించానని 2025 జూన్ నెల నుండి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు శంకర శతక పద్యాలు ప్రార్థనలో రోజుకు ఒక పద్యాన్ని విద్యార్థులతో చదివించ దానికి అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు ఉపాధ్యాయులు వేమన గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు1
- నరసన్నపేట: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం శాసనసభలో జీరో అవర్లో మాట్లాడుతూ, తన నియోజకవర్గ పరిధిలోని 25 ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిలో 14 అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ పాఠశాలల నిర్మాణాలను త్వరితగతిన పునర్నిర్మించాలని విద్యాశాఖ మంత్రికి నివేదిక సమర్పించి, సభలో విన్నవించారు.1
- మూడు పూటలా అన్నం కోసం మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- వీఆర్పురం మండలం దుర్భలంక గ్రామంలో గురువారం పురిటి నొప్పులతో బాధ పడుతున్న లక్ష్మిని కుటుంబ సభ్యులు 15కి.మీ మంచంపై మోశారు. రోడ్డు సక్రమంగా లేక పోవడంతో అతి కష్టం మీద 108 వాహనం వద్దకు తీసుకొచ్చారు. రేఖపల్లి పీహెచ్సీకి తరలిస్తుండగా మార్గం మధ్యలో వాహనాన్ని నిలిపి పురుడు పోశామని 108 సిబ్బంది నవీన్, మోహన్ తెలిపారు. తల్లి, మగ బిడ్డలను వైద్య పరీక్షలు నిమిత్తం రేఖపల్లి PHCకి తరలించారు.1