రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు ఎనిమిది మంది విద్యార్థులు ఎంపిక చీపురుపల్లి, మే 11 చీపురుపల్లిలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్-15 (U-15) చదరంగ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. ఈ పోటీల నుండి రాష్ట్రస్థాయికి ఎంపికైన ఎనిమిది మంది విద్యార్థులను స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శంకర్రావు, ఎస్సై ఎల్. దామోదర్ రావు సోమవారం అభినందించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 30 మంది విద్యార్థులు ఈ సెలక్షన్లలో పాల్గొన్నారు. వీరిలో ఓపెన్ కేటగిరీలో నలుగురు, బాలికల విభాగంలో నలుగురు చొప్పున మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఎంపికైన వారు వచ్చే నెల జూన్ 13, 14 తేదీలలో కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చదరంగ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. విజయనగరానికి చెందిన ఎస్.వి.జె. కృష్ణ మనోహర్, అనురాగ్ విశ్వాస్, కె. నితీష్, ఆర్. వెంకట మాధవి ఎంపికవ్వగా, నెల్లిమర్లకు చెందిన ఆర్. ప్రేమ కుమార్, సారిక గ్రామానికి చెందిన ఎం. ఓంకార్, చింతపల్లికి చెందిన ఏ. శ్రీనిధి, మరియు చీపురుపల్లికి చెందిన కె. కోమల దీప్తి రాష్ట్రస్థాయికి ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ పోటీలకు చీఫ్ ఆర్బిటార్గా ఏ.డి.ఎం.ఎస్.వి. ప్రసాద్ వ్యవహరించారు. విజేతలకు సి.ఐ శంకర్రావు, ఎస్సై దామోదర్ రావు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మూర్తి, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు ఎనిమిది మంది విద్యార్థులు ఎంపిక చీపురుపల్లి, మే 11 చీపురుపల్లిలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్-15 (U-15) చదరంగ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. ఈ పోటీల నుండి రాష్ట్రస్థాయికి ఎంపికైన ఎనిమిది మంది విద్యార్థులను స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శంకర్రావు, ఎస్సై ఎల్. దామోదర్ రావు సోమవారం అభినందించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 30 మంది విద్యార్థులు ఈ సెలక్షన్లలో పాల్గొన్నారు. వీరిలో ఓపెన్ కేటగిరీలో నలుగురు, బాలికల విభాగంలో నలుగురు చొప్పున మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఎంపికైన వారు వచ్చే నెల జూన్ 13, 14 తేదీలలో కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చదరంగ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. విజయనగరానికి చెందిన ఎస్.వి.జె. కృష్ణ మనోహర్, అనురాగ్ విశ్వాస్, కె. నితీష్, ఆర్. వెంకట మాధవి ఎంపికవ్వగా, నెల్లిమర్లకు చెందిన ఆర్. ప్రేమ కుమార్, సారిక గ్రామానికి చెందిన ఎం. ఓంకార్, చింతపల్లికి చెందిన ఏ. శ్రీనిధి, మరియు చీపురుపల్లికి చెందిన కె. కోమల దీప్తి రాష్ట్రస్థాయికి ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ పోటీలకు చీఫ్ ఆర్బిటార్గా ఏ.డి.ఎం.ఎస్.వి. ప్రసాద్ వ్యవహరించారు. విజేతలకు సి.ఐ శంకర్రావు, ఎస్సై దామోదర్ రావు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మూర్తి, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
- 'అట్టహాసంగా జిల్లా టీడీపీ కార్యాలయ శంకుస్థాపన' తెలుగుదేశం పార్టీని ప్రజల చెంతకు తీసుకువెళ్లే దేవాలయమే తెలుగుదేశం పార్టీ కార్యాలయం అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విజయనగరం రూరల్ మండలం అయ్యన్నపేట సమీపంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన జిల్లా టీడీపీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే... గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే నినాదంతో పాలిస్తూ పార్టీని ప్రజలకు దగ్గర చేశారని కొనియాడారు. తెలుగుదేశం ఎప్పుడూ ప్రజల ధీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగానే పాలన చేసిందన్నారు.2
- MGM వెస్ట్స్ రోజూ వేసుకునే దుస్తులలో పూర్తి సౌకర్యాన్ని అందిస్తాయి. పగలు లేదా రాత్రి, ఏ సమయంలోనైనా వీటి ప్రీమియం ఫీల్ తో హాయిగా ఉండవచ్చు. మీ రోజువారీ జీవితంలో ఆనందం, విశ్వాసం పెంచుకోవడానికి ఇవి సరైన ఎంపిక.1
- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎర్రవరం జలపాతం ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇక్కడికి చేరుకుంటున్న ప్రజలు, సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుతున్నారు.1
- బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు, శ్రీకాకుళం జిల్లాలో 'జనతా వారధి' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను స్వీకరించి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, ముఖ్యంగా నీటి భద్రత, పారిశుధ్యంపై కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.1
- బసివి రెడ్డి గారి విగ్రహ ఏర్పాటుపై కుట్రలు తగవు: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు అనపర్తి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు గొల్లల మామిడాడలో ఏర్పాటు చేసిన ప్రముఖ దాత బసివి రెడ్డి గారి విగ్రహావిష్కరణ ఉదంతంపై స్పందించారు. వేలాది మంది పేదలకు నివాస స్థలాలు ఇప్పించి, అనేక దేవాలయాల నిర్మాణానికి సహకరించిన అపర దానకర్ణుడు బసివి రెడ్డి గారి విగ్రహాన్ని చింత దొరబాబు మరియు వారి మిత్రబృందం కలిసి ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో అధికార పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఒక ప్రైవేట్ స్థలంలో, యజమాని అనుమతితో ఏర్పాటు చేసిన విగ్రహం విషయంలో పంచాయతీ కార్యదర్శిని పంపి అభ్యంతరాలు వ్యక్తం చేయించడం, విగ్రహాన్ని తొలగించాలని ఒత్తిడి తీసుకురావడం అత్యంత దారుణమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రభుత్వ స్థలంలో కాకుండా సొంత స్థలంలో విగ్రహాన్ని పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకపోవడం వెనుక నియోజకవర్గ ముఖ్య నేత ప్రోత్సాహం ఉందనేది స్పష్టమవుతోందని", ఇలాంటి కుట్రలు చేసే వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. బసివి రెడ్డి గారికి అనపర్తి గ్రామానికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, ఇక్కడ కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూర్యనారాయణ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అనపర్తిలోని రెడ్డి సంఘం నాయకులు ఎవరైనా ముందుకు వచ్చి స్థలాన్ని కేటాయిస్తే, తన సొంత ఖర్చులతో విగ్రహాన్ని అందిస్తానని ఆయన ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి సేవా మూర్తుల విగ్రహాలను నెలకొల్పడం ద్వారా భావితరాలకు వారి గొప్పతనం మరియు సేవా తత్పరత తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహనీయుడైన బసివి రెడ్డి గారి విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించాలని నియోజకవర్గ ప్రజలను కోరుతూ, ఈ అడ్డంకులను అధిగమించి ఆ మహనీయుడిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తాను కూడా విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించబోతున్నట్లు ఆయన తెలియజేశారు.1
- ఏలూరు జిల్లాలో భారీ అక్రమ రేషన్ మాఫియా బట్టబయలు టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, పోలీసు అధికారులు అండగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలువంగర సాయి దత్తు, గరిమెళ్ళ చలపతి ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ – ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఎస్పీ ఆదేశాలు ఏలూరులో బహిర్గతమైన అక్రమ PDS మాఫియా..? టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, అధికారులపై సంచలన ఆరోపణలు ఏలూరు, మే 11 (ప్రత్యేక ప్రతినిధి): ఏలూరు జిల్లాలో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ PDS (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) రేషన్ బియ్యం దందాపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణాకు రాజకీయ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారులు అండగా ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జిల్లాలో కలకలం రేపుతోంది. సోమవారం ఏలూరులో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంటా సాయి కృష్ణ జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయన పలు కీలక ఆరోపణలు చేశారు. చింతలపూడి ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రరావు ఆధ్వర్యంలో వంగర సాయి దత్తు అనే వ్యక్తి అక్రమ రేషన్ బియ్యం మాఫియాను నడుపుతున్నాడని, ఈ వ్యవహారానికి టీడీపీ లింగపాలెం మండల అధ్యక్షుడు గరిమెళ్ళ చలపతి, ధర్మాజీగూడెం ఎస్సై సహా పలువురు అధికారులు, రాజకీయ నేతలు సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు, ఇతర శాఖల అధికారులను ప్రభావితం చేసి అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై ప్రశ్నించినందుకు తనపై ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయని గంటా సాయి కృష్ణ తెలిపారు. ఇటీవల తన ఇంటి వద్ద రేషన్ మాఫియా వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చినా “రేషన్ బియ్యం ఏమైనా డ్రగ్సా?” అంటూ నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించారు. అక్రమ రేషన్ వ్యాపారంలో నిందితుడిగా ఉన్న వంగర సాయి దత్తు నుంచి గరిమెళ్ళ చలపతికి భారీ ఎత్తున నగదు, ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపడితే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు. అదేవిధంగా, అక్రమాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చింతలపూడి ప్రాంతంలో కొనసాగుతున్న రేషన్ మాఫియాను పూర్తిగా అరికట్టాలని, తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.2
- అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరుగురు బాధితులకు రూ. 8.52 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. వైసీపీ హయాంలో నిర్వీర్యం చేయబడిన ఈ పథకం పేదల వైద్యానికి తిరిగి భరోసా కల్పిస్తుందని ఆయన తెలిపారు.1
- 'ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆకాశయానం' సాధారణంగా పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం లేదా దాతలు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయడం చూస్తుంటాం. కానీ విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎం. సత్యారావు విద్యార్థుల్లో మరింత స్ఫూర్తిని నింపేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులను ఆయన తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి వారి కలలను నిజం చేశారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఈ విద్యార్థులు విమానం ఎక్కడం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు. చదువులో రాణిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనే సందేశాన్ని విద్యార్థులకు ప్రాక్టికల్గా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఉపాధ్యాయుడు సత్యారావు తెలిపారు. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన జీతపు సొమ్మును విద్యార్థుల ప్రోత్సాహం కోసం ఈ విధంగా వెచ్చించడం పట్ల విద్యాశాఖ అధికారులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమాన ప్రయాణం కేవలం ఒక విహారయాత్ర మాత్రమే కాకుండా, విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు ఒక గొప్ప పునాదిగా నిలుస్తుందని వారు కొనియాడారు.1