గుండాల పీహెచ్సీపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆకస్మిక తనిఖీ మందుల నిల్వలు, సిబ్బంది కొరత, 108 సేవలపై క్షుణ్ణ పరిశీలన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులు, సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న చికిత్స, మందుల లభ్యత, అత్యవసర వైద్య సేవలు, ఆసుపత్రిలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించిన ఆయన, అందుబాటులో ఉన్న మందుల నిల్వలు, వాటి గడువు, అవసరమైన మందులు పూర్తిస్థాయిలో ఉన్నాయా లేదా అనే అంశాలను స్వయంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరతపై వివరాలు సేకరించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 108 అంబులెన్స్ సేవల పనితీరును సమీక్షించిన బీర్ల అయిలయ్య, అత్యవసర పరిస్థితుల్లో స్పందన సమయం, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై ఆరా తీశారు. అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో)తో ఫోన్లో మాట్లాడిన ఆయన, ఆసుపత్రిలో సిబ్బంది కొరత, మందుల లభ్యత, గడువు ముగిసే మందుల పరిస్థితి, 108 సేవలపై సమగ్ర నివేదికను వెంటనే అందజేయాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్యం అందేలా అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
గుండాల పీహెచ్సీపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆకస్మిక తనిఖీ మందుల నిల్వలు, సిబ్బంది కొరత, 108 సేవలపై క్షుణ్ణ పరిశీలన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులు, సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న చికిత్స, మందుల లభ్యత, అత్యవసర వైద్య సేవలు, ఆసుపత్రిలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించిన ఆయన, అందుబాటులో ఉన్న మందుల నిల్వలు, వాటి గడువు, అవసరమైన మందులు పూర్తిస్థాయిలో ఉన్నాయా లేదా అనే అంశాలను స్వయంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరతపై వివరాలు సేకరించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 108 అంబులెన్స్ సేవల పనితీరును సమీక్షించిన బీర్ల అయిలయ్య, అత్యవసర పరిస్థితుల్లో స్పందన సమయం, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై ఆరా తీశారు. అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో)తో ఫోన్లో మాట్లాడిన ఆయన, ఆసుపత్రిలో సిబ్బంది కొరత, మందుల లభ్యత, గడువు ముగిసే మందుల పరిస్థితి, 108 సేవలపై సమగ్ర నివేదికను వెంటనే అందజేయాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్యం అందేలా అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
- కీసర రామలింగేశ్వరుడిని దర్శించుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోమవారం కీసర శ్రీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.1
- ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతా లోపం సెల్ ఫోన్పై నిషేధం ఉన్నా.. దర్జాగా రీల్స్ చేస్తున్న భక్తులు పెద్ద రాజగోపురం వద్ద రీల్స్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసిన మహిళ దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆఫీస్ ఎదురుగా రీల్స్ చేస్తున్నా చోద్యం మహిళ ఇన్ స్టా రీల్ తో మరోసారి బయటపడ్డ ఆలయ భద్రత లోపం1
- నూతన మండల అధ్యక్షుడి అభినందన సభకు హాజరైన మంత్రి సీతక్క.. ఘనంగా కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు బానోత్ రూప్సింగ్, మాజీ అధ్యక్షుడు వజ్జ సారయ్యల అభినందన సభ విజయవంతం కావడంపై కాంగ్రెస్ నాయకులు మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రోత్సాహం అందించినందుకు ధన్యవాదాలు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.1
- గుండాల పీహెచ్సీపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆకస్మిక తనిఖీ మందుల నిల్వలు, సిబ్బంది కొరత, 108 సేవలపై క్షుణ్ణ పరిశీలన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులు, సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న చికిత్స, మందుల లభ్యత, అత్యవసర వైద్య సేవలు, ఆసుపత్రిలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించిన ఆయన, అందుబాటులో ఉన్న మందుల నిల్వలు, వాటి గడువు, అవసరమైన మందులు పూర్తిస్థాయిలో ఉన్నాయా లేదా అనే అంశాలను స్వయంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరతపై వివరాలు సేకరించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 108 అంబులెన్స్ సేవల పనితీరును సమీక్షించిన బీర్ల అయిలయ్య, అత్యవసర పరిస్థితుల్లో స్పందన సమయం, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై ఆరా తీశారు. అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో)తో ఫోన్లో మాట్లాడిన ఆయన, ఆసుపత్రిలో సిబ్బంది కొరత, మందుల లభ్యత, గడువు ముగిసే మందుల పరిస్థితి, 108 సేవలపై సమగ్ర నివేదికను వెంటనే అందజేయాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్యం అందేలా అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.1