Shuru
Apke Nagar Ki App…
గద్వాల: పిచ్చికుక్కల సంచారం.... భయాందోళనలో గ్రామస్తులు ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో పిచ్చికుక్కల సంచారం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సింహాలతో పాటు ఈ పిచ్చి కుక్కలు కూడా సంచారం చేయడం ద్వారా ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులకు పిచ్చికుక్క కరిచింది. ప్రజలు వీధుల వెంబడి తిరిగిందుకే భయపడుతున్నారు. ఏ కుక్క కరుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామ సింహాలను పిచ్చికుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరారు.
Ram Ram
గద్వాల: పిచ్చికుక్కల సంచారం.... భయాందోళనలో గ్రామస్తులు ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో పిచ్చికుక్కల సంచారం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సింహాలతో పాటు ఈ పిచ్చి కుక్కలు కూడా సంచారం చేయడం ద్వారా ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులకు పిచ్చికుక్క కరిచింది. ప్రజలు వీధుల వెంబడి తిరిగిందుకే భయపడుతున్నారు. ఏ కుక్క కరుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామ సింహాలను పిచ్చికుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో పిచ్చికుక్కల సంచారం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సింహాలతో పాటు ఈ పిచ్చి కుక్కలు కూడా సంచారం చేయడం ద్వారా ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులకు పిచ్చికుక్క కరిచింది. ప్రజలు వీధుల వెంబడి తిరిగిందుకే భయపడుతున్నారు. ఏ కుక్క కరుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామ సింహాలను పిచ్చికుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరారు.1
- పెద్దపల్లి నియోజకవర్గంలోని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు డివైడర్ను కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరు మరణించారు మరణించిన వారు మంచిర్యాలకు చెందిన ఎడ్ల శ్రీనివాస్ రజితగా గుర్తించారు తమ కూతురు కరీంనగర్లో ఎంబిబిఎస్ చదువుతుండగా తనను చూసేందుకు కరీంనగర్ వెళ్లి తిరిగి మంచిర్యాలకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది మరణించిన దంపతుల పార్థివదేహాలను పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చరీకి తరలించారు1
- కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం రాఘాయిపల్లి సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వకుర్తి నుండి హైదరాబాద్ వెళుతున్న బొలెరో వాహనాన్ని హైదరాబాద్ నుండి కల్వకుర్తి వైపు వస్తున్న మారుతి కారు ఎదురురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో మార్చాలకు చెందిన తలసాని గిరిధర్ రెడ్డి మృతి చెందాడు. మృతుడు సౌమ్యుడుగా గుర్తింపు ఉన్న బీజేపీ పార్టీ క్రియాశీలక నాయకుడు మృతి చెందడంతో మార్చాలా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న వెల్దoడ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం మృత దేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.1
- వికారాబాద్ జిల్లా నవాబు పెట్టు మండల పరిధిలోని గంగాడ, పూలపల్లి, అంతప్ప గూడ గేట్, పర్వేద గ్రామాలకు కరోనా తర్వాత బస్సు సౌకర్యం లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆయా గ్రామాల నూతన సర్పంచులు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ కు విన్నవించగా, ఆయన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి తెలపి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ గ్రామాలకు నూతన బస్సును ప్రారంభించినట్లు తెలిపారు. బస్సు సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఈ ప్రాంతంలో మరిన్ని సర్వీసులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రజల ఇష్టం మేరకు ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.1
- సోషల్ మీడియా క్రేజ్.. ప్రాణాల మీదకు తెస్తోంది! రీల్స్ పిచ్చితో మృత్యువుతో చెలగాటం.. కదులుతున్న బస్సు కింద దూరి యువకుడి భయంకరమైన స్కేటింగ్ విన్యాసం! నేటి తరుణంలో సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ప్రాణాలకు తెగిస్తోంది. క్షణకాలం ఆనందం కోసం.. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ మృత్యువుతో పోరాడుతున్నారు. తాజాగా ఒక యువకుడు కదులుతున్న బస్సు కింద నుంచి స్కేటింగ్ చేస్తూ అవతలి వైపుకు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. రహదారిపై ఒక బస్సు తన వేగంతో వెళ్తుండగా, వెనుక నుంచి స్కేటింగ్ చేస్తూ వచ్చిన ఒక యువకుడు అనూహ్యంగా బస్సు కిందకు దూరిపోయాడు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా లేదా బస్సు టైరు కింద పడినా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. కానీ, అదృష్టవశాత్తు ఆ యువకుడు క్షేమంగా బయటకు వచ్చాడు. చూడటానికి ఇది ఒక అద్భుతంలా అనిపించినా, ఇలాంటి చర్యలు ప్రాణాంతకమని ట్రాఫిక్ పోలీసులు మరియు సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి స్టంట్స్ చూసి చిన్నపిల్లలు, ఇతర యువకులు కూడా ప్రయత్నించే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ముఖ్య గమనిక: వీడియోలు వైరల్ కావొచ్చు కానీ, ప్రాణాలు పోతే తిరిగి రావు. సాహసాలకు, మూర్ఖత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని JTV9 News యువతకు విజ్ఞప్తి చేస్తోంది.1
- ఆత్రం సమ్మక్క కులోన్మాదహత్యపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలనీ తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ డిమాండ్. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతీ ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో మోసగించి హత్య చేసిన కెల్కారి జలపతి మరియు అతనికి సహకరించిన అతని కుటుంబ సభ్యులు,వ్యక్తులపై హత్య మరియు యస్సీ యస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని అదేవిధంగా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం దర్యాప్తు చేపట్టాలని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున, డిమాండ్ చేశారు. కెల్కారి జలపతి అనే వ్యక్తి గత నాలుగేళ్ల క్రితం ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో వివాహం చేసుకొని మోసం చేయడమే కాకుండా జలపతి ఆయన కుటుంబం సమ్మక్కపై దాడి చేసి ఇంటి నుండి గెంటివేశారు.ఈ ఏడాది మళ్ళీ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసగించినా కెల్కారి జలపతి ఆత్రం సమ్మక్కను గర్బవతి చేశాడు సమ్మక్క పెళ్లి చేసుకోమని అడగగా కుల వివక్షతతో హత్య చేశాడని పేర్కొన్నారు .ఈ కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాము. నిందితుడు కెల్కారి జలపతి అతని కుట్రలో ఉన్న కుటుంబ సభ్యులను తక్షణం అరెస్టు చేయాలి.బాధిత కుటుంబానికి ₹25 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని,ఆదివాసీ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక చట్టలు అమలు చేయాలనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నికి విజ్ఞపి చేశారు. ఈ కార్యక్రమంలో గోడం రేణుక ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు, ఉయిక ఇందిర ఆదివాసి మహిళా సంఘం జిల్లా ఉపధ్యక్షురాలు, ఆత్రం గణపతి, డివిజన్ అధ్యక్షులు సోయం లలితా మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు, వేడమ ముకుంద్ రావ్ మండల అధ్యక్షులు కొమర గోవిందరావు, పుష్నక్ నాగరావు, వెట్టి బొజ్జు, చక్రం సోము తదితరులు పాల్గొన్నారు.1
- అనంతపురం అనిల్ కుమార్ ప్రయాణం.చెట్లు,పక్షులకు గూళ్ళు,పారిశుధ్య కార్మికులు,ప్లాస్టిక్ రహిత సమాజం,చీర సంచుల ఉద్యమం,చరిత్ర వారసత్వ సంపద1
- పెద్దపల్లి పట్టణంలో ఉగాది పండుగను పురస్కరించుకొని జండా చౌరస్తా వద్ద మామిడి కాయలు వేప పూత కొత్త కుండలు చింతపండు విక్రయాలు అధికంగా పెరిగిపోయాయి ప్రజలు ఒక్కసారిగా జెండా వద్దకు చేరుకొని కొనుగోలలో మునిగిపోయారు ఉగాది పండుగ కావడంతో షడ్రుచులతో కూడిన పచ్చడలు ఇంట్లో చేసే ఆనవాయితీ ఉన్న తరుణంలో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఉదయమే జెండా వద్దకు చేరుకున్నారు1