logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*नारी शक्ति का उदय, विरोधियों की पराजय!*👊🏻 कांग्रेस ने संसद में महिला आरक्षण का विरोध किया, नारी शक्ति ने प्रतिकार किया। मध्य प्रदेश के मुख्यमंत्री श्री मोहन यादव के नेतृत्व में एकजुट यह सैलाब गवाह है कि अब महिला विरोधी राजनीति के दिन लद चुके हैं।

10 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Rural, Telangana•
10 hrs ago

*नारी शक्ति का उदय, विरोधियों की पराजय!*👊🏻 कांग्रेस ने संसद में महिला आरक्षण का विरोध किया, नारी शक्ति ने प्रतिकार किया। मध्य प्रदेश के मुख्यमंत्री श्री मोहन यादव के नेतृत्व में एकजुट यह सैलाब गवाह है कि अब महिला विरोधी राजनीति के दिन लद चुके हैं।

More news from Kumuram Bheem Asifabad and nearby areas
  • करीमनगर थ्री टाउन पुलिस स्टेशन के सब-इंस्पेक्टर एन. चैतन्य चंदर को निलंबित कर दिया गया है। खानपुर में एक सैलून में बाल कटवाने गए एसआई ने दुकानदार रामुलु के साथ अभद्र व्यवहार किया। दुकानदार द्वारा "अन्ना बैठिए" कहने पर एसआई ने आपत्ति जताते हुए असभ्य भाषा का प्रयोग किया और हाथापाई की। यह घटना सीसीटीवी फुटेज में कैद हो गई और सोशल मीडिया पर वायरल होने के बाद पुलिस आयुक्त गाउस आलम ने त्वरित कार्रवाई करते हुए एसआई को निलंबित करने का आदेश जारी किया। ➡️ यह मामला पुलिस विभाग की छवि पर सवाल खड़े करता है और अधिकारियों द्वारा अनुशासनहीनता पर सख्त रुख अपनाने का संकेत देता है।
    1
    करीमनगर थ्री टाउन पुलिस स्टेशन के सब-इंस्पेक्टर एन. चैतन्य चंदर को निलंबित कर दिया गया है।  
खानपुर में एक सैलून में बाल कटवाने गए एसआई ने दुकानदार रामुलु के साथ अभद्र व्यवहार किया। दुकानदार द्वारा "अन्ना बैठिए" कहने पर एसआई ने आपत्ति जताते हुए असभ्य भाषा का प्रयोग किया और हाथापाई की।  
यह घटना सीसीटीवी फुटेज में कैद हो गई और सोशल मीडिया पर वायरल होने के बाद पुलिस आयुक्त गाउस आलम ने त्वरित कार्रवाई करते हुए एसआई को निलंबित करने का आदेश जारी किया।  
➡️ यह मामला पुलिस विभाग की छवि पर सवाल खड़े करता है और अधिकारियों द्वारा अनुशासनहीनता पर सख्त रुख अपनाने का संकेत देता है।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    41 min ago
  • కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన ( TRS) , మొత్తాన్ని TRS పేరు, తెలంగాణ పేరు ఎటూ పోకుండా చూసుకున్నారు. పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత.. 1. విద్య: ప్రైవేట్‌ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తాం.. 2. వైద్యం: ఏ రోగమైనా రానీ, ఏ ఆస్పత్రైనా సరే ఉచితంగా అందిస్తాం.. 3. వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం.. 4. ఉపాధి: రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు.. మొదటి ఏడాదిలోనే సింగిల్‌ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.. ఉద్యమకారులకు లక్ష సూపర్‌ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం.. 5. సామాజిక న్యాయం ..
    1
    కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన ( TRS) , మొత్తాన్ని TRS పేరు, తెలంగాణ పేరు ఎటూ పోకుండా చూసుకున్నారు. 
పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత.. 
1. విద్య: ప్రైవేట్‌ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తాం..
2. వైద్యం: ఏ రోగమైనా రానీ, ఏ ఆస్పత్రైనా సరే ఉచితంగా అందిస్తాం.. 
3. వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం..
4. ఉపాధి: రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు.. 
మొదటి ఏడాదిలోనే సింగిల్‌ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.. ఉద్యమకారులకు లక్ష సూపర్‌ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం.. 
5. సామాజిక న్యాయం ..
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా సిరిసిల్లలో బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.
    1
    కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా సిరిసిల్లలో బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • *తేదీ: 25-04-2026* *పత్రికా ప్రకటన* *కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంయుక్త సమీక్ష* కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి" అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ గారికి సూచించారు. "ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి" అని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ "ఎమ్మెల్యే సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలి" అని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి.
    1
    *తేదీ: 25-04-2026*  
*పత్రికా ప్రకటన*
*కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంయుక్త సమీక్ష*  
కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి.  జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్  ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి" అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ గారికి సూచించారు.
"ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు.
గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి" అని సూచించారు.
పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  మాట్లాడుతూ "ఎమ్మెల్యే  సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలి" అని అన్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్  అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి,
కామారెడ్డి.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్:జిల్లాలో కొంతమంది వైద్యులే సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా తప్పుడు వైద్య ప్రచారం చేస్తూ పేద ప్రజలను, అమాయక రోగులను మోసం చేస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. dyfi నాయకుల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు అనంతరం నరేష్ పటేల్ మాట్లాడుతూ ముఖ్యంగా షుగర్ (మధుమేహం), బీపీ (రక్తపోటు) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అవసరం లేదని, ఇంటి చిట్కాలతో పూర్తిగా నయం అవుతుంది“ఒక్క మందుతో శాశ్వతంగా పోతుంది వంటి అవాస్తవాలు ప్రచారం చేస్తూ వీడియోలు విడుదల చేయడం ప్రజల ప్రాణాలతో ఆటలాడటమేనని విమర్శించారు. వైద్యులపై ఉన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి తప్పుడు వీడియోలు విడుదల చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని తెలిపారు. ప్రజలు ఈ ప్రచారాలను నమ్మి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేస్తే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాపాయకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పేదలు ఈ మోసాలకు ఎక్కువగా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హతలేని వ్యక్తులు మాత్రమే కాకుండా కొంతమంది వైద్యులే ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడటం అత్యంత ఆందోళనకరమని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారు లాభాల కోసం ఇలా వ్యవహరించడం ఖండనీయమని పేర్కొన్నారు. ఇక మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రజల పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ తీవ్ర దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. అవసరం లేని పరీక్షలు చేయించడం, అధిక బిల్లులు వేయడం, అప్రామాణిక చికిత్సలు సూచించడం, పారదర్శకత లేకుండా ఫీజులు వసూలు చేయడం ద్వారా పేద ప్రజలను ఆర్థికంగా నాశనం చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భయాన్ని ఉపయోగించుకుని లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతోందని విమర్శించారు. వైద్య రంగం సేవా ధర్మాన్ని కోల్పోయి పూర్తిగా వ్యాపారంగా మారడం దురదృష్టకరమని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వైద్య ప్రచారం చేస్తున్న వైద్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇలాంటి వైద్యుల లైసెన్సులను రద్దు చేయాలని, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఉన్న ఫేక్ మెడికల్ వీడియోలను తక్షణమే తొలగించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని, అవసరం లేని టెస్టులు, అధిక బిల్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలపై ప్రభుత్వ పర్యవేక్షణను కఠినంగా అమలు చేయాలని, ప్రజల్లో సరైన వైద్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (DMHO) అధికారులు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్,సహాయ కార్యదర్శులు,అరవింద్ నాయకులు సిన.రాజేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు
    1
    కరీంనగర్:జిల్లాలో కొంతమంది వైద్యులే సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా తప్పుడు వైద్య ప్రచారం చేస్తూ పేద ప్రజలను, అమాయక రోగులను మోసం చేస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 
dyfi నాయకుల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు అనంతరం నరేష్ పటేల్ మాట్లాడుతూ ముఖ్యంగా షుగర్ (మధుమేహం), బీపీ (రక్తపోటు) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అవసరం లేదని, ఇంటి చిట్కాలతో పూర్తిగా నయం అవుతుంది“ఒక్క మందుతో శాశ్వతంగా పోతుంది వంటి అవాస్తవాలు ప్రచారం చేస్తూ వీడియోలు విడుదల చేయడం ప్రజల ప్రాణాలతో ఆటలాడటమేనని విమర్శించారు.
వైద్యులపై ఉన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి తప్పుడు వీడియోలు విడుదల చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని తెలిపారు. ప్రజలు ఈ ప్రచారాలను నమ్మి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేస్తే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాపాయకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పేదలు ఈ మోసాలకు ఎక్కువగా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అర్హతలేని వ్యక్తులు మాత్రమే కాకుండా కొంతమంది వైద్యులే ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడటం అత్యంత ఆందోళనకరమని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారు లాభాల కోసం ఇలా వ్యవహరించడం ఖండనీయమని పేర్కొన్నారు.
ఇక మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రజల పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ తీవ్ర దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. అవసరం లేని పరీక్షలు చేయించడం, అధిక బిల్లులు వేయడం, అప్రామాణిక చికిత్సలు సూచించడం, పారదర్శకత లేకుండా ఫీజులు వసూలు చేయడం ద్వారా పేద ప్రజలను ఆర్థికంగా నాశనం చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భయాన్ని ఉపయోగించుకుని లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతోందని విమర్శించారు. వైద్య రంగం సేవా ధర్మాన్ని కోల్పోయి పూర్తిగా వ్యాపారంగా మారడం దురదృష్టకరమని అన్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు వైద్య ప్రచారం చేస్తున్న వైద్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇలాంటి వైద్యుల లైసెన్సులను రద్దు చేయాలని, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఉన్న ఫేక్ మెడికల్ వీడియోలను తక్షణమే తొలగించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని, అవసరం లేని టెస్టులు, అధిక బిల్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలపై ప్రభుత్వ పర్యవేక్షణను కఠినంగా అమలు చేయాలని, ప్రజల్లో సరైన వైద్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (DMHO) అధికారులు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్,సహాయ కార్యదర్శులు,అరవింద్ నాయకులు సిన.రాజేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • मध्य प्रदेश के मुख्यमंत्री श्री मोहन यादव के नेतृत्व में एकजुट यह सैलाब गवाह है कि अब महिला विरोधी राजनीति के दिन लद चुके हैं।
    1
    मध्य प्रदेश के मुख्यमंत्री श्री मोहन यादव के नेतृत्व में एकजुट यह सैलाब गवाह है कि अब महिला विरोधी राजनीति के दिन लद चुके हैं।
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    10 hrs ago
  • రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మెప్మా ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ముందుగా ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి.. పలు సూచనలు చేశారు.టార్ఫాలిన్లు, గన్ని సంచులు, నీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయా అని ఆరా తీసి.. పరిశీలించారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చింది? సన్న రకం వడ్లు వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లుల కేటాయింపు.. ఆన్లైన్లో వివరాల నమోదు పై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే రైతులు ప్యాడీ క్లీనర్లు వినియోగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని సూచించారు. పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. 
మెప్మా ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ముందుగా ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి.. పలు సూచనలు చేశారు.టార్ఫాలిన్లు, గన్ని సంచులు, నీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయా అని ఆరా తీసి.. పరిశీలించారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చింది? సన్న రకం వడ్లు వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లుల కేటాయింపు.. ఆన్లైన్లో వివరాల నమోదు పై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే రైతులు ప్యాడీ క్లీనర్లు వినియోగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని సూచించారు. పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • *తేదీ: 25-04-2026* *జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి, కామారెడ్డి* పత్రికా ప్రకటన *జనగణన-2027: స్వీయ గణనకు అవకాశం* *26-04-2026 నుండి 10-05-2026 వరకు పోర్టల్‌లో నమోదు చేసుకోండి* *ప్రజలందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్* కామారెడ్డి: జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్‌ఎల్‌ఓ ప్రక్రియకు సంబంధించి స్వీయ గణన కార్యక్రమం తేదీ: 26-04-2026 నుండి 10-05-2026 వరకు నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి శ్రీ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ "ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం స్వీయ గణన కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు. *స్వీయ గణన విధానం:* 1. ప్రతి కుటుంబం తమ గృహ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 2. మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ పరికరం ద్వారా అయినా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 3. నమోదు పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య లభిస్తుంది. 4. ఆ గుర్తింపు సంఖ్యను మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు తప్పనిసరిగా తెలియజేయాలి. 5. నమోదు చేసిన వివరాలను అవసరమైతే తర్వాత సవరించుకునే అవకాశం కూడా ఉంది. "జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగానే దేశ, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సరైన సమాచారం నమోదు చేయాలి. జిల్లా ప్రజలందరూ స్వీయ లెక్కింపు ప్రక్రియలో చురుగ్గా పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి" అని కలెక్టర్ కోరారు. *ముఖ్యమైన తేదీలు:* - *స్వీయ గణన:* 26-04-2026 నుండి 10-05-2026 వరకు - *గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్‌ఎల్‌ఓ:* 11-05-2026 నుండి 09-06-2026 వరకు ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
    1
    *తేదీ: 25-04-2026*  
*జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి, కామారెడ్డి*  
పత్రికా ప్రకటన 
*జనగణన-2027: స్వీయ గణనకు అవకాశం*  
*26-04-2026 నుండి 10-05-2026 వరకు పోర్టల్‌లో నమోదు చేసుకోండి*  
*ప్రజలందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్*
కామారెడ్డి: జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్‌ఎల్‌ఓ ప్రక్రియకు సంబంధించి స్వీయ గణన కార్యక్రమం తేదీ: 26-04-2026 నుండి 10-05-2026 వరకు నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి శ్రీ ఆశిష్ సంగ్వాన్  తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ "ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం స్వీయ గణన కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు.
*స్వీయ గణన విధానం:*
1. ప్రతి కుటుంబం తమ గృహ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
2. మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ పరికరం ద్వారా అయినా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
3. నమోదు పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య లభిస్తుంది.
4. ఆ గుర్తింపు సంఖ్యను మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు తప్పనిసరిగా తెలియజేయాలి.
5. నమోదు చేసిన వివరాలను అవసరమైతే తర్వాత సవరించుకునే అవకాశం కూడా ఉంది.
"జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగానే దేశ, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సరైన సమాచారం నమోదు చేయాలి. జిల్లా ప్రజలందరూ స్వీయ లెక్కింపు ప్రక్రియలో చురుగ్గా పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి" అని కలెక్టర్  కోరారు.
*ముఖ్యమైన తేదీలు:*
- *స్వీయ గణన:* 26-04-2026 నుండి 10-05-2026 వరకు 
- *గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్‌ఎల్‌ఓ:* 11-05-2026 నుండి 09-06-2026 వరకు 
ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కలెక్టర్  విజ్ఞప్తి చేశారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.