Shuru
Apke Nagar Ki App…
పాల్వంచ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ముందు క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రంగాపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్థానిక ప్రాథమిక పాఠశాల గేటు ఎదురుగా ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం ఉదయం పాఠశాల వద్దకు వెళ్లిన గ్రామస్థులకు గేటు ముందు కోసిన నిమ్మకాయలు, బొగ్గు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలు వంటి పూజా సామాగ్రి ఆనవాళ్లు కనిపించాయి. పాఠశాల వంటి విద్యా మందిరం ముందు ఇలాంటి అవాంఛనీయ పనులకు పాల్పడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
VANAMA SRINIVAS RAO
పాల్వంచ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ముందు క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రంగాపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్థానిక ప్రాథమిక పాఠశాల గేటు ఎదురుగా ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం ఉదయం పాఠశాల వద్దకు వెళ్లిన గ్రామస్థులకు గేటు ముందు కోసిన నిమ్మకాయలు, బొగ్గు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలు వంటి పూజా సామాగ్రి ఆనవాళ్లు కనిపించాయి. పాఠశాల వంటి విద్యా మందిరం ముందు ఇలాంటి అవాంఛనీయ పనులకు పాల్పడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రంగాపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్థానిక ప్రాథమిక పాఠశాల గేటు ఎదురుగా ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం ఉదయం పాఠశాల వద్దకు వెళ్లిన గ్రామస్థులకు గేటు ముందు కోసిన నిమ్మకాయలు, బొగ్గు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలు వంటి పూజా సామాగ్రి ఆనవాళ్లు కనిపించాయి. పాఠశాల వంటి విద్యా మందిరం ముందు ఇలాంటి అవాంఛనీయ పనులకు పాల్పడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.2
- ఏప్రియల్ 4 న నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోశ్ కుమార్ ఆవిష్కరించారు. టిజిఎం వర్షిప్ సెంటర్ నందు మండల అధ్యక్షులు తేళ్ల ఎబినేజర్ అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు సిలువ, మరణ, పునరుద్ధానం ను ప్రకటించుట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రైస్తవ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియో సెల్ అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, నియోజకవర్గ అధ్యక్షులు పిడి దాసు, కెనడి రాజు, టి సంజీవరావు, తేళ్ల ఎబినేజర్, కోట దేవదానం, మోదుగు ఓనేసిమ్, దయాకర్, జాన్ పరంజ్యోతి, రాయల తిమోతి, జీవన్ కుమార్, కట్టా మహేష్, ఎన్ సుందర్ రాజు, యెహోషువ పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం అర్పణపల్లి సమీపంలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసి గా గుర్తించబడ్డారు.1
- గీసుగొండ వరంగల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గీసుగొండ మండలంలో కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి వారిని నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు సతీమణి దొంతి శాలిని రెడ్డి గారు కూతురు దొంతి అనన్య రెడ్డి గారు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు,అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు.1
- హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను విజ్ఞప్తి చేశారు. అలాగే, బిల్లు నోటీసును అసెంబ్లీ సెక్రటరీకి కూడా కేటీఆర్ మరియు ఎమ్మెల్యేలు అందజేశారు.1
- జనగాం జిల్లా:జనగామ పట్టణంలో భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ 95వ వర్ధంతి సందర్భంగా సీపీఎం జిల్లా కార్యాలయంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.1
- గూర్తేడు పోలీస్ స్టేషన్ పరిధిలో కమర్షియల్ క్వాంటిటీ గంజాయి కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 24 కిలోల గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు మరియు రెండు బైక్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది1
- Post by Ramprasad islavath1