Shuru
Apke Nagar Ki App…
షోషల్ మీడియా లో వైరలావుతున్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
MD. YOUSUF ALI KHAN
షోషల్ మీడియా లో వైరలావుతున్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
More news from తెలంగాణ and nearby areas
- షోషల్ మీడియా లో వైరలావుతున్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్1
- అనాధ వృద్ధుల ఆశ్రమంలో మహా CMD బర్త్ డే 2 Mahaa CMD Vamsi Krishna Birthday Celebrations in Nizamabad mahaa news all reporter1
- అటవీ అధికారుల తీరులో అసలు మార్పు రావడం లేదు: ఎమ్మెల్యే ఆగ్రహం తాను చాలాసార్లు చెప్పినా అడవి అధికారుల తీరు మారడం లేదని ఎమ్మెల్యే బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసుల ఆందోళన నేపథ్యంలో ఆదివారం రాత్రి అటవీశాఖ ఉన్నతాధికారి శాంతారామ్ తో ఐటిడిఏపిఓ మకరందు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడారు. అటవీ అధికారుల తీరుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చాలా సందర్భాలలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రతినిధులను, ప్రజలను, ఆదివాసులను అటవీ అధికారులు వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులపై దాడి చేసిన అటవీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.1
- వేములవాడలో ముదిరాజ్ మత్స్యకారుల భవన నిర్మాణానికి భూమిపూజ రూ. 6 లక్షలతో నూతన భవనం. శంకుస్థాపన చేసిన చైర్మన్ పుల్కం రాజు ఆత్మగౌరవ ప్రతీకలుగా కుల సంఘ భవనాలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ శరవేగంగా అభివృద్ధి సోషల్ మీడియా చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు : పుల్కం రాజు వేములవాడ పట్టణంలో స్థానిక ముదిరాజ్ మత్స్యకారుల నూతన భవన నిర్మాణానికి సుమారు ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఆదివారం ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్యఅతిథిగా హాజరై, కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ... స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే పట్టణ పరిధిలోని 54 కుల సంఘాల భవన నిర్మాణాల అభివృద్ధికి ప్రతి సంఘానికి రూ. 6 లక్షల చొప్పున నిధులు కేటాయించి, పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.గతంలో అభివృద్ధి నోచుకోని కుల సంఘాలను. కానీ తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే చేతల ప్రభుత్వమని నిరూపిస్తోందన్నారు. ఇటువంటి భవనాలు నిర్మించడం వల్ల ఆయా సంఘాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. సంఘ సభ్యులందరూ ఒకే చోట చేరి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించు కోవడానికి, తమ సమాజ పురోగతికి సంబంధించిన విషయాలపై విస్తృతంగా చర్చా కార్యక్రమాలు జరుపుకోవడానికి ఈ భవనాలు వేదికగా నిలుస్తాయని తెలిపారు. అంతేకాకుండా సంఘానికి సంబంధించిన విలువైన వస్తువులు, శుభకార్యక్రమాలు మరియు పండుగల సామాగ్రిని సురక్షితంగా భద్రపరుచుకోవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని స్పష్టం చేశారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి ఇవి కేంద్ర బిందువులుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పట్టణాభివృద్ధిపై కొందరు చోటామోటా నేతలు సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి స్థానిక ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని చైర్మన్ హెచ్చరించారు. వేములవాడ సమగ్ర పురోగతే లక్ష్యంగా పాలన సాగుతోందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమర్థవంతమైన నాయకత్వంలో వేములవాడ పట్టణం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోందని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర శ్రమ, దృఢ సంకల్పంతో పట్టణ ముఖచిత్రం పూర్తిగా మారబోతోందని తెలిపారు. పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు, రూపురేఖలు మార్చేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో ఆరోపణలు చేసే చిల్లర నాయకుల మాటలను ప్రజలు ఎవరూ నమ్మరని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధే వారికి చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు.ఈ భూమిపూజ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుం మధు, పట్టణ కౌన్సిలర్లు తోట రాజు, కొండ రాజశేఖర్, ముదిరాజ్ మత్స్యకార సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.1
- కవ్వాల్ గ్రామంలోని పోచమ్మ ఆలయానికి అసంపూర్తి రహదారి.. భక్తుల అవస్థలు జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఇందూర్ పోచమ్మ దేవస్థానానికి వెళ్లే రహదారిని సగం వరకు మాత్రమే నిర్మించి పనులు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన భాగం పూర్తిగా బురదమయంగా మారి ద్విచక్ర వాహనాలు జారిపడే పరిస్థితి నెలకొంది. వర్షాల సమయంలో ఆలయానికి చేరుకోవడం మరింత కష్టంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తి రహదారిని వెంటనే పూర్తి చేసి సురక్షిత ప్రయాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, భక్తులు అధికారులను కోరుతున్నారు.2
- వాహనదారుల ఇక్కట్లు తీరుస్తున్న యువకుడు సుకరి చందు.. శభాష్ అంటున్న ఇరు గ్రామాల ప్రజలు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అని ఎదురు చూడకుండా తన సొంత ఖర్చుతో రోడ్డును బాగు చేస్తున్నాడు వైకుంఠ పూర్ గ్రామవాసి సుకరి చందు.వంజర్ నుండి వానల్పాడు వెళ్లే రహదారి మొత్తం పాడైపోయి అధ్వాన్నంగా తయారయ్యింది. ఈ సమస్యను ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని చందు వాపోయాడు.దీంతో తన సొంత ఖర్చులతో మొరం తెప్పించుకొని గుంతలు ఏర్పడ్డ చోట మొరం పోసి బాగు చేస్తున్నాడు. ఈ విషయాన్ని విన్న పలువురు వాహనదారులు, ఇరు గ్రామాల ప్రజలు సుంకర చెందును శభాష్ అంటున్నారు.1
- సదర్మార్ట్ ఆయకట్టుకు నీరు అందించండి నారుమల్లు సిద్ధం చేసుకుంటున్న ఆయకట్టు రైతంగం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని సదర్ మార్ట్ రైతాంగానికి నీటిని విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలు బ్రోకపోవడంతో పంట సాగుకు ఆలస్యం అవుతుందని ప్రస్తుతం ఆయకట్టుకు సరిపోయి నీరు ప్రాజెక్టులో నిల్వ ఉందని అన్నారు నీటిని విడుదల చేస్తే సాగు పనులు చేసుకుంటామని రైతులు కోరారు ఇటీవల కురిసిన వర్షంతో ఆయకట్టు యువ ప్రాంతంలో రైతులు నారుమడులను సిద్ధం చేసి నాట్లు పోసుకుంటున్నారు1
- జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ధాన్యం అక్రమాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 87 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సిఎంఆర్ ధాన్యం పక్కదారి మళ్లించినట్లు గుర్తించారు1