Shuru
Apke Nagar Ki App…
అటవీ అధికారుల తీరులో అసలు మార్పు రావడం లేదు: ఎమ్మెల్యే ఆగ్రహం తాను చాలాసార్లు చెప్పినా అడవి అధికారుల తీరు మారడం లేదని ఎమ్మెల్యే బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసుల ఆందోళన నేపథ్యంలో ఆదివారం రాత్రి అటవీశాఖ ఉన్నతాధికారి శాంతారామ్ తో ఐటిడిఏపిఓ మకరందు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడారు. అటవీ అధికారుల తీరుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చాలా సందర్భాలలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రతినిధులను, ప్రజలను, ఆదివాసులను అటవీ అధికారులు వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులపై దాడి చేసిన అటవీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
P.G. Murthy
అటవీ అధికారుల తీరులో అసలు మార్పు రావడం లేదు: ఎమ్మెల్యే ఆగ్రహం తాను చాలాసార్లు చెప్పినా అడవి అధికారుల తీరు మారడం లేదని ఎమ్మెల్యే బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసుల ఆందోళన నేపథ్యంలో ఆదివారం రాత్రి అటవీశాఖ ఉన్నతాధికారి శాంతారామ్ తో ఐటిడిఏపిఓ మకరందు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడారు. అటవీ అధికారుల తీరుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చాలా సందర్భాలలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రతినిధులను, ప్రజలను, ఆదివాసులను అటవీ అధికారులు వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులపై దాడి చేసిన అటవీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- వర్షాకాలంలో నీటి కలుషితాన్ని అరికట్టేందుకు బావులు, బోర్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లింపు జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తాగునీటి వనరుల పరిశుభ్రత చర్యలు చేపట్టారు. సర్పంచ్ సక్రు, గ్రామ కార్యదర్శి విశ్వ పర్యవేక్షణలో గ్రామపంచాయతీ సిబ్బంది బావులు, బోర్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. వర్షాల కారణంగా నీటిలో బ్యాక్టీరియా, వైరస్లు, ఇతర హానికర సూక్ష్మక్రిములు వ్యాపించే ప్రమాదం ఉండటంతో క్లోరినేషన్ నిర్వహించారు. కలుషిత నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు ప్రబలకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు తాగునీటిని మరిగించి వినియోగించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.1
- జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ధాన్యం అక్రమాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 87 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సిఎంఆర్ ధాన్యం పక్కదారి మళ్లించినట్లు గుర్తించారు1
- హెడ్ క్వార్టర్స్ క్వార్టర్ గార్డ్ ను సందర్శించిన రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్మ్డ్ హెడ్క్వార్టర్స్లోని క్వార్టర్ గార్డును పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా క్వార్టర్ గార్డు గదులు, పరిసరాలను పరిశీలించిన ఆయన వాటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.1
- మాయాపూర్ గ్రామంలో ఘనంగా గంగ నీళ్ల జాతర పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు దిలావర్పూర్ మండలం మాయాపూర్ గ్రామంలో గంగ నీళ్ల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాజా భజంత్రీల మధ్య గోదావరి నది నుండి జలాలను తీసుకువచ్చి గ్రామంలోని అమ్మవారి విగ్రహాలను అభిషేకించారు. ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని,ప్రజలందరూ సుఖ,సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి అవసరం : శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన 'సంఘటన్ శ్రీజన్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా బోరాజ్,జైనథ్,బేలా,సాత్నాల మండలాల్లో ఆదివారం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15లోగా మండల కాంగ్రెస్ కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐక్యత, క్రమశిక్షణ,సమిష్టి కృషితోనే పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. నూతన కమిటీల ఏర్పాటులో వర్గ విభేదాలకు తావివ్వకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. సామాజిక న్యాయం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశాల్లో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గీమ్మ సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు మాధవ్ పటేల్, గీమ్మ దీపక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మల్యాల కరుణాకర్, అక్తర్ అలీ, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు బెజ్జంకి అనిల్, బోరాజ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, జైనథ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం జగదీశ్వర్ రెడ్డి, బేలా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రూపీరావు, సాత్నాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కినక బాపురావుతో పాటు ఎస్సీ సెల్, మైనారిటీ సెల్, కిసాన్ సెల్, బీసీ సెల్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- అనాధ వృద్ధుల ఆశ్రమంలో మహా CMD బర్త్ డే 2 Mahaa CMD Vamsi Krishna Birthday Celebrations in Nizamabad mahaa news all reporter1
- ఆదివాసుల ఆందోళన వద్దకు వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో ఉన్న ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసుల వద్దకు ఎమ్మెల్యే బొజ్జు చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన యువకులను అటవీశాఖ అధికారులు కొట్టి ఇంతవరకు అప్పగించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకపు కూడా ఆదివాసులు ఆదివారం రాత్రి మూడు గంటలుగా ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వారి వద్దకు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.1
- నిరపుత్రి పూజకు బయలుదేరిన తెలంగాణ ఆంధ్రా అయ్యప్ప సేవకులు శబరిమలలో రెండు రోజుల పాటు నిర్వహించే నిరపుత్రి పూజ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి అయ్యప్ప భక్తులు, సేవకులు శబరిమలకు వరి కంకులను పెద్ద ఎత్తున తీసుకొని శబరిమల మెల్ శాంతి పూజారులకు అందచేశారు.1
- అమ్మవారికి బోనం సమర్పించిన బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆషాడ మాసం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కొత్త కుండలో వండిన బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి ఏలేటి కవిత రెడ్డి నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నందిగుండం దుర్గామాత ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకట చారి, మరియు సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.1