అమ్మవారికి బోనం సమర్పించిన బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆషాడ మాసం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కొత్త కుండలో వండిన బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి ఏలేటి కవిత రెడ్డి నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నందిగుండం దుర్గామాత ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకట చారి, మరియు సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
అమ్మవారికి బోనం సమర్పించిన బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆషాడ మాసం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కొత్త కుండలో వండిన బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి ఏలేటి కవిత రెడ్డి నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నందిగుండం దుర్గామాత ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకట చారి, మరియు సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
- నందిపేట్లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన సర్పంచ్ల ఫోరం నందిపేట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను నందిపేట్ మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండలంలోని పలువురు సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కేక్ కటింగ్ కార్యక్రమం అనంతరం సుదర్శన్ రెడ్డికి సర్పంచ్ల ఫోరం సభ్యులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సుదర్శన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా అందిస్తున్న సేవలను కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారంలో ఆయన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమం ఆద్యంతం సందడిగా, ఆత్మీయ వాతావరణంలో సాగింది. సుదర్శన్ రెడ్డికి దీర్ఘాయువు, ఆరోగ్యం చేకూరాలని పలువురు ఆకాంక్షించారు.1
- జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ధాన్యం అక్రమాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 87 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సిఎంఆర్ ధాన్యం పక్కదారి మళ్లించినట్లు గుర్తించారు1
- అటవీ అధికారుల తీరులో అసలు మార్పు రావడం లేదు: ఎమ్మెల్యే ఆగ్రహం తాను చాలాసార్లు చెప్పినా అడవి అధికారుల తీరు మారడం లేదని ఎమ్మెల్యే బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసుల ఆందోళన నేపథ్యంలో ఆదివారం రాత్రి అటవీశాఖ ఉన్నతాధికారి శాంతారామ్ తో ఐటిడిఏపిఓ మకరందు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడారు. అటవీ అధికారుల తీరుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చాలా సందర్భాలలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ప్రతినిధులను, ప్రజలను, ఆదివాసులను అటవీ అధికారులు వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులపై దాడి చేసిన అటవీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.1
- కవ్వాల్ గ్రామంలోని పోచమ్మ ఆలయానికి అసంపూర్తి రహదారి.. భక్తుల అవస్థలు జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఇందూర్ పోచమ్మ దేవస్థానానికి వెళ్లే రహదారిని సగం వరకు మాత్రమే నిర్మించి పనులు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన భాగం పూర్తిగా బురదమయంగా మారి ద్విచక్ర వాహనాలు జారిపడే పరిస్థితి నెలకొంది. వర్షాల సమయంలో ఆలయానికి చేరుకోవడం మరింత కష్టంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తి రహదారిని వెంటనే పూర్తి చేసి సురక్షిత ప్రయాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, భక్తులు అధికారులను కోరుతున్నారు.2
- బేలా మండల కాంగ్రెస్లో వర్గపోరు బహిర్గతం: ‘సంఘట సృజన్ అభియాన్’ సమావేశంలో రచ్చ బేలా: బేలా మండల కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. ‘సంఘట సృజన్ అభియాన్’ నిమిత్తం ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో ఈ వర్గపోరు బహిర్గతమైంది. వేదికపైకి తమ నాయకులను ఆహ్వానించకపోవడంపై ఒక వర్గానికి చెందిన అనుచరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అశోక్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విలాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చంద్రకాంత్లను వేదికపైకి పిలవకపోవడాన్ని నిరసిస్తూ వారి అనుచరులు నాయకులను నిలదీశారు. దీంతో సమావేశ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా నాయకులు రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఇరువర్గాలు వినకపోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది1
- అమ్మవారికి బోనం సమర్పించిన బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆషాడ మాసం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కొత్త కుండలో వండిన బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి ఏలేటి కవిత రెడ్డి నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నందిగుండం దుర్గామాత ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకట చారి, మరియు సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.1
- ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడులు సరికావు: ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలోని ఇందన్పల్లి అనుబంధ నాయకపుగూడా యువకులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఇందన్ పల్లి ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసులను కలిసి ఆయన మద్దతు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అటవీశాఖ అధికారుల దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.1
- संत शिरोमणि गुरु रविदास जी की 650वीं पावन जयंती के उपलक्ष्य में चलाया जा रहा *'समरसता संकल्प अभियान'* अब देशभर में जनआंदोलन का स्वरूप ले चुका है। वाराणसी में उनकी जन्मस्थलि से प्रारंभ हुई पावन कलश यात्रा पंजाब, राजस्थान, मध्य प्रदेश सहित अनेक राज्यों तक पहुँच चुकी है, जहाँ भव्य कलश यात्राओं, सत्संगों और सामाजिक समरसता कार्यक्रमों के माध्यम से गुरु जी की अमर शिक्षाओं का व्यापक प्रसार हो रहा है। *समानता, सामाजिक समरसता, आपसी प्रेम, मानव सेवा और भाईचारे का उनका संदेश आज पूरे राष्ट्र को एकता के सूत्र में बाँधने का कार्य कर रहा है। 🙏🚩*1
- రుద్రూర్: 8 ఏళ్ల బాలున్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.అక్బర్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రూర్ మండలం అక్బర్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోధన్ నుంచి బాన్సువాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు 8 ఏళ్ల బాలుడు సిద్ధార్థను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పటికీ డ్రైవర్ బస్సును ఆపకపోవడంతో అక్బర్ నగర్ యువకులు మాట్రిక్స్ స్కూల్ వద్ద బస్సును నిలిపి ఆందోళన చేశారు.1