Shuru
Apke Nagar Ki App…
ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడులు సరికావు: ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలోని ఇందన్పల్లి అనుబంధ నాయకపుగూడా యువకులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఇందన్ పల్లి ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసులను కలిసి ఆయన మద్దతు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అటవీశాఖ అధికారుల దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
P.G. Murthy
ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడులు సరికావు: ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలోని ఇందన్పల్లి అనుబంధ నాయకపుగూడా యువకులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఇందన్ పల్లి ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసులను కలిసి ఆయన మద్దతు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అటవీశాఖ అధికారుల దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
More news from తెలంగాణ and nearby areas
- వర్షాకాలంలో నీటి కలుషితాన్ని అరికట్టేందుకు బావులు, బోర్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లింపు జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తాగునీటి వనరుల పరిశుభ్రత చర్యలు చేపట్టారు. సర్పంచ్ సక్రు, గ్రామ కార్యదర్శి విశ్వ పర్యవేక్షణలో గ్రామపంచాయతీ సిబ్బంది బావులు, బోర్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. వర్షాల కారణంగా నీటిలో బ్యాక్టీరియా, వైరస్లు, ఇతర హానికర సూక్ష్మక్రిములు వ్యాపించే ప్రమాదం ఉండటంతో క్లోరినేషన్ నిర్వహించారు. కలుషిత నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు ప్రబలకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు తాగునీటిని మరిగించి వినియోగించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.1
- జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ధాన్యం అక్రమాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 87 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సిఎంఆర్ ధాన్యం పక్కదారి మళ్లించినట్లు గుర్తించారు1
- హెడ్ క్వార్టర్స్ క్వార్టర్ గార్డ్ ను సందర్శించిన రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్మ్డ్ హెడ్క్వార్టర్స్లోని క్వార్టర్ గార్డును పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా క్వార్టర్ గార్డు గదులు, పరిసరాలను పరిశీలించిన ఆయన వాటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.1
- మాయాపూర్ గ్రామంలో ఘనంగా గంగ నీళ్ల జాతర పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు దిలావర్పూర్ మండలం మాయాపూర్ గ్రామంలో గంగ నీళ్ల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాజా భజంత్రీల మధ్య గోదావరి నది నుండి జలాలను తీసుకువచ్చి గ్రామంలోని అమ్మవారి విగ్రహాలను అభిషేకించారు. ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని,ప్రజలందరూ సుఖ,సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- అనాధ వృద్ధుల ఆశ్రమంలో మహా CMD బర్త్ డే 2 Mahaa CMD Vamsi Krishna Birthday Celebrations in Nizamabad mahaa news all reporter1
- బేలా మండల కాంగ్రెస్లో వర్గపోరు బహిర్గతం: ‘సంఘట సృజన్ అభియాన్’ సమావేశంలో రచ్చ బేలా: బేలా మండల కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. ‘సంఘట సృజన్ అభియాన్’ నిమిత్తం ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో ఈ వర్గపోరు బహిర్గతమైంది. వేదికపైకి తమ నాయకులను ఆహ్వానించకపోవడంపై ఒక వర్గానికి చెందిన అనుచరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అశోక్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విలాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చంద్రకాంత్లను వేదికపైకి పిలవకపోవడాన్ని నిరసిస్తూ వారి అనుచరులు నాయకులను నిలదీశారు. దీంతో సమావేశ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా నాయకులు రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఇరువర్గాలు వినకపోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది1
- ఆదివాసుల ఆందోళన వద్దకు వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో ఉన్న ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసుల వద్దకు ఎమ్మెల్యే బొజ్జు చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన యువకులను అటవీశాఖ అధికారులు కొట్టి ఇంతవరకు అప్పగించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకపు కూడా ఆదివాసులు ఆదివారం రాత్రి మూడు గంటలుగా ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వారి వద్దకు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.1
- నిరపుత్రి పూజకు బయలుదేరిన తెలంగాణ ఆంధ్రా అయ్యప్ప సేవకులు శబరిమలలో రెండు రోజుల పాటు నిర్వహించే నిరపుత్రి పూజ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి అయ్యప్ప భక్తులు, సేవకులు శబరిమలకు వరి కంకులను పెద్ద ఎత్తున తీసుకొని శబరిమల మెల్ శాంతి పూజారులకు అందచేశారు.1
- అమ్మవారికి బోనం సమర్పించిన బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆషాడ మాసం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కొత్త కుండలో వండిన బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి ఏలేటి కవిత రెడ్డి నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నందిగుండం దుర్గామాత ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకట చారి, మరియు సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.1