కోరుట్లలో అక్రమంగా గంజాయి, రవాణా చేస్తూ ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు* కోరుట్ల జనవరి 08 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో పట్టణం మాదాపూర్ కాలనీకి చెందిన బిల్లికర్ దేవిశ్రీప్రసాద్ (వయస్సు 19 సంవత్సరాలు) మరియు భీముని దుబ్బకు చెందిన ఏనుగుల రాజేష్ (వయస్సు 20 సంవత్సరాలు) చెడు వ్యసనాలకు అలవాటు పడి, గత రెండు నెలలుగా గంజాయి అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారు ఒక గుర్తుతెలియని యువకుడి వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, కోరుట్ల మండలంతో పాటు పట్టణంలోని యువతకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని సమాచారం అందిందినట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఎం. చిరంజీవి వివరాలు వెల్లడించారు. అదే క్రమంలో జగిత్యాల జిల్లాలోని ఒక గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుండి 50 గ్రాముల గంజాయిని తీసుకొని, బజాజ్ డిస్కవరీ బైక్పై విక్రయించేందుకు కోరుట్ల మాదాపూర్ కాలనీ వైపు వెళ్తుండగా, నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు వారిని అడ్డుకున్నారు. కోరుట్ల శివారులోని మాదాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఎస్సై ఎం. చిరంజీవి, పోలీసు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల గంజాయి, ఒక బజాజ్ డిస్కవరీ ద్విచక్ర వాహనం మరియు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇప్పటికే ఇలాంటి కేసులు నమోదు చేశామని, మత్తు పదార్థాల అక్రమ వ్యాపారంలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కోరుట్లలో అక్రమంగా గంజాయి, రవాణా చేస్తూ ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు* కోరుట్ల జనవరి 08 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో పట్టణం మాదాపూర్ కాలనీకి చెందిన బిల్లికర్ దేవిశ్రీప్రసాద్ (వయస్సు 19 సంవత్సరాలు) మరియు భీముని దుబ్బకు చెందిన ఏనుగుల రాజేష్ (వయస్సు 20 సంవత్సరాలు) చెడు వ్యసనాలకు అలవాటు పడి, గత రెండు నెలలుగా గంజాయి అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారు ఒక గుర్తుతెలియని యువకుడి వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, కోరుట్ల మండలంతో పాటు పట్టణంలోని యువతకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని సమాచారం అందిందినట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఎం. చిరంజీవి వివరాలు వెల్లడించారు. అదే క్రమంలో జగిత్యాల జిల్లాలోని ఒక గుర్తుతెలియని వ్యక్తి
వద్ద నుండి 50 గ్రాముల గంజాయిని తీసుకొని, బజాజ్ డిస్కవరీ బైక్పై విక్రయించేందుకు కోరుట్ల మాదాపూర్ కాలనీ వైపు వెళ్తుండగా, నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు వారిని అడ్డుకున్నారు. కోరుట్ల శివారులోని మాదాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఎస్సై ఎం. చిరంజీవి, పోలీసు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల గంజాయి, ఒక బజాజ్ డిస్కవరీ ద్విచక్ర వాహనం మరియు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇప్పటికే ఇలాంటి కేసులు నమోదు చేశామని, మత్తు పదార్థాల అక్రమ వ్యాపారంలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- పులి సంచరిస్తోంది..జర పైలం జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.1
- నాను మహారాజ్1
- వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు1
- Post by Ravi Poreddy1
- ట్రాక్టర్ ఆటో ఢీకొని ఒకరు మృతి బాన్సువాడ ప్రతినిధి రెవిన్యూ అధికారులు ఇష్టం వచ్చిన విధంగా ఒకేసారి రెండు గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక తరలించడానికి అనుమతులు ఇవ్వడంతో, వారు అట్టివేగంగా ట్రాక్టర్లు నడుపుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇప్పటికే ఇసుక ట్రాక్టర్ల వల్ల, ఇసుక లారీల వల్ల బీర్కూర్, కిష్టాపూర్, కొల్లూర్, దామరించ, చించోల్లి బిచ్కుంద, జూకల్, పిట్లం, నిజం సాగర్, మద్నూర్ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక దందా కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఒకటే రోజు చించొల్లి, కిష్టాపూర్ గ్రామాల మంజీరా నది నుంచి ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు ఇవ్వడంతో, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారు. ఎక్కువగా ఇసుక ట్రిప్పులు జరుగుతే ఎక్కువగా డబ్బులు వస్తాయని ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు అతివేగంగా ట్రాక్టర్లను నడుపుతూ ప్రాణాలను తీస్తున్నారు. గురువారం రాత్రి బుడిమి నుంచి నాగారం గ్రామంలో వరి నాట్లు వేయడానికి వచ్చి తిరిగి వెళుతుండగా కొల్లూరు శివారులోని రైస్ మిల్ వద్ద 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటో ను అతివేగంగా ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకేసారి ఆటో బోల్తా పడి రుక్మిణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, తీవ్ర గాయాలు కుకురైన కూలీలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరార్ లో ఉన్నారు. ఏ గ్రామానికి చెందిన ట్రాక్టర్, డ్రైవర్ ఎవరు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.2
- రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1
- జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83,12,000 చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. టెంపుల్ సిటీ కారిడార్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, అధికారులు పాల్గొన్నారు.2