Shuru
Apke Nagar Ki App…
ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తాపడడంతో ఇద్దరికి గాయాలు.. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల గండి తండాకు చెందిన బోడ వెంకన్న, తేజావత్ శ్రీహరి అనే ఇద్దరు యువకులు బ్యాంకు పనుల నిమిత్తం గంగారం మండలానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మడగూడెం గ్రామ క్రాస్ రోడ్డు వద్ద మూలమలుపు తిరిగే క్రమంలో వారి ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా, వారిని గంగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
M D Azizuddin
ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తాపడడంతో ఇద్దరికి గాయాలు.. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల గండి తండాకు చెందిన బోడ వెంకన్న, తేజావత్ శ్రీహరి అనే ఇద్దరు యువకులు బ్యాంకు పనుల నిమిత్తం గంగారం మండలానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మడగూడెం గ్రామ క్రాస్ రోడ్డు వద్ద మూలమలుపు తిరిగే క్రమంలో వారి ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా, వారిని గంగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
More news from తెలంగాణ and nearby areas
- జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.4
- అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమరాజుపల్లి గ్రామంలో ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి లక్ష్మణ్ కుమార్ వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆకాల వర్షాలకు జగిత్యాల జిల్లాలో 6160 ఎకరాల్లో మామిడి పంట, 1029 ఎకరాల్లో వరి, 1520 ఎకరాల్లో మొక్కజొన్న, 581 ఎకరాల్లో నువ్వు పంటలు దెబ్బ తిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారని మంత్రి తెలిపారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా నష్టపోవడం చాలా బాధాకరమన్నారు. అధికారులు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం వచ్చే విధంగా అంచనాలు రూపొందించి నివేదికను పంపించాలని మంత్రి ఆదేశించారు.1
- ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు... తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని.... డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి... మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి... మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ... *నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..* ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో ఎల్. రమాదేవి, జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బండ్రీ అధికారి రవీందర్ రెడ్డి కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోవులను ఎండ వేడి ప్రభావం నుండి రక్షించేందుకు చేపట్టిన చర్యలను వారు పరిశీలించారు.గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలను సమీక్షించారు.అలాగే గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్ (పశువులకు ప్రత్యేక ఆహారం) సరైన విధంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. గోవులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా చూసి, వాటికి పెట్టి గోవులు తింటున్నాయా అనే విషయాన్ని కూడా ఈవో రమాదేవి గమనించారు.గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, గోవుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇదే సందర్భంలో రాజన్న కోడె మొక్కుల నిర్వహణ, వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరంగా చర్చించారు.ఈ తనిఖీలలో పర్యవేక్షకులు విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.1
- Post by Ramprasad islavath1
- సిద్దిపేట జిల్లా : మార్చ్ 31, ప్రజా తెలంగాణ న్యూస్ / (హుస్నాబాద్ నియోజకవర్గం / కోహెడ మండలం ) అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ (ఏ. ఐ. సీ. సీ ) అధ్యక్షులు సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ... కోహెడ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) సీనియర్ నాయకులు, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేరవేర్చిన గొప్ప నాయకురాలు(తెలంగాణ దేవత ) అనారోగ్యంతో గత ఐదు రోజులుగా సర్ గంగారాం(న్యూఢిల్లీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వారు త్వరగా కోలుకోవాలని, ప్రజా క్షేత్రoలో ఉండాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.3
- వరంగల్ జిల్లా గీసుగోండ మండలం కొనయమాకులలోని పిఎస్ఆర్ గార్డెన్లో బుధవారం సంగెం, గీసుగోండ మండలాల పరిధిలో టెక్స్టైల్ పార్క్ కారణంగా భూములు కోల్పోయిన రైతులకు రాజీవ్ కాలనీలో నిర్మిస్తున్న గృహాలకు సంబంధించిన ఇంటి స్థలాల పత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు ఇది ఉపశమనంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.2
- సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంఘం (సెస్)ను తెలంగాణ ఎన్పీడీసీఎల్ టేకోవర్ చేసింది. సెస్ నే కొనసాగించాలని సెస్ పాలకవర్గం న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది. మెరుగైన విద్యుత్తును అందించేందుకు సిరిసిల్ల జిల్లాలో కో-ఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లై సొసైటీ ఏర్పడి గత కొంతకాలంగా సెస్ పరిధిలోనే విద్యుత్తు సప్లై కొనసాగుతుంది. సెస్ లైసెన్స్ మార్చి 31 తో ముగియడంతో NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి సిరిసిల్ల సెస్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. దాదాపు మూడు గంటల పాటు అధికారులతో సమీక్ష అనంతరం వరుణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సెస్ లైసెన్స్ కాలం ముగియడంతో టి.జి.ఆర్.సీ ఆదేశాల మేరకు ఎన్పీడిసియల్ ను టెకోవర్ చేశామని చెప్పారు. తదుపరి ప్రభుత్వం ఆదేశాలు వచ్చేవరకు ఎంపీడీసీఎల్ పరిధిలోనే సెస్ ఉద్యోగులు పని పనిచేస్తారని, ఇది తాత్కాలికమేనని తెలిపారు. విద్యుత్ వినియోగదారులైన రైతులు, గృహస్థులు పారిశ్రామిక వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్తు తో పాటు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. సి.ఎస్.సి సెంటర్లతో పాటు మీ సేవాలో అన్ని రకాల సేవలు అందిచబడుతాయని, రైతులు వినియోగించే కరెంట్ మోటార్లకు యూనిఫాం సర్వీస్ లైన్ చార్జీల ద్వారా తక్కువ మొత్తాన్ని చెల్లిస్తే అధిక సర్వీస్ పొందే అవకాశం ఉందని తెలిపారు. ఆన్ లైన్ లో కనెక్షన్ ఇవ్వడం ద్వారా అవినీతికి ఆస్కారం ఉండదని చెప్పారు. సెస్ ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్నామని, కోటి రూపాయల ప్రమాద భీమా, పది లక్షల రుపాయల ప్రొఫెషన్ భీమా అందించడం జరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలు పెండింగ్ లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. వచ్చే జూన్ వరకు పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని సీఎండి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 18 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. రూ.93,52,748/- నగదు రూపం లో ఆదాయంగా వచ్చినట్లు, అదే విధంగా, మిశ్రమ బంగారం – 60 గ్రాములు,100 మిల్లి గ్రాములు మిశ్రమ వెండి – 2 కిలోల 900 గ్రాములు వచ్చినట్లుగా తెలిపారు.ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి , శ్రీ రాజమౌళి (కరీంనగర్ ఏసీఆఫీస్) , పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సహాయ కార్య నిర్వహణాధికారులు, అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి పాల్గొన్నారు.1