డీఎస్సీ ప్రక్రియలో పారదర్శక లోపించింది, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. వైసిపి ఇన్చార్జి మోహన్ డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు రేపల్లె పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి.ఈ సందర్భంగా రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ పీటా నాగమోహన్ కృష్ణ మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, అర్హులైన ప్రతి అభ్యర్థికీ న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పట్టణంలోని ముఖ్య వీధుల గుండా సాగిన ఈ బైక్ ర్యాలీలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిమట బాలాజీ, చిత్రాల ఓబేదులతో పాటు పలువురు స్థానిక నేతలు, విభాగల అధ్యక్షులు, భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.
డీఎస్సీ ప్రక్రియలో పారదర్శక లోపించింది, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. వైసిపి ఇన్చార్జి మోహన్ డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు రేపల్లె పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి.ఈ సందర్భంగా రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ పీటా
నాగమోహన్ కృష్ణ మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, అర్హులైన ప్రతి అభ్యర్థికీ న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని
స్పష్టం చేశారు. పట్టణంలోని ముఖ్య వీధుల గుండా సాగిన ఈ బైక్ ర్యాలీలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిమట బాలాజీ, చిత్రాల ఓబేదులతో పాటు పలువురు స్థానిక నేతలు, విభాగల అధ్యక్షులు, భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.
- డీఎస్సీ ప్రక్రియలో పారదర్శక లోపించింది, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. వైసిపి ఇన్చార్జి మోహన్ డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు రేపల్లె పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి.ఈ సందర్భంగా రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ పీటా నాగమోహన్ కృష్ణ మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, అర్హులైన ప్రతి అభ్యర్థికీ న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పట్టణంలోని ముఖ్య వీధుల గుండా సాగిన ఈ బైక్ ర్యాలీలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిమట బాలాజీ, చిత్రాల ఓబేదులతో పాటు పలువురు స్థానిక నేతలు, విభాగల అధ్యక్షులు, భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.3
- సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు.......... ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న సీడ్ యాక్సిస్ రోడ్డు, ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి ఏర్పాట్లను అమరావతి డెవలప్మెంట్ చైర్మన్ లక్ష్మీ పార్థసారధి, కలెక్టర్ సాయి కాంత్ వర్మ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ను ఆదేశించారు.1
- వాకింగ్ ట్రాక్ లో కంటి పరీక్షలు కరోనా తరువాత ప్రజలకు ఆరోగ్యం పట్ల రోజురోజుకీ శ్రద్ధ పెరుగుతున్న క్షేమం తెలిసింది. దీన్ని ఆసరాగా తీసుకొని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఈరోజు గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ లో వాసం కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వాకర్స్ కు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా షుగర్ బీపీ చెక్ చేసి పలు సలహాలు ఇచ్చారు.1
- నవులూరి చెన్నారెడ్డి హత్య జీర్ణించుకోలేని ఘటన... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచర్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా, తమ శ్రేయస్సు కోరుకునే కుటుంబ సభ్యుడిలా ఉన్న నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్య అత్యంత బాధాకరమని, ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. రెంటచింతలలో నిర్వహించాల్సిన రిలే నిరాహార దీక్షకు సంబంధించి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొట్టం బ్రహ్మారెడ్డితో కలిసి నవులూరి చెన్నారెడ్డి పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకుని, అక్కడి నుంచి రెంటాలకు వెళ్తున్న సమయంలో దారికాచి హత్య చేయడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ హత్యకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.నవులూరి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తమ కుటుంబంతో ఎంతోకాలంగా ఉన్న అనుబంధం, సన్నిహిత సంబంధాల కారణంగా బాధలో కొన్ని మాటలు మాట్లాడితే, వాటిని వక్రీకరించి కూటమి ప్రభుత్వం, వారికి అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా తమపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.ఇప్పటికే చెన్నారెడ్డి హత్య కేసులో అనుమానం ఉన్న నవులూరి అశోక్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే మరో వ్యక్తి మోర్తాల ఉమామహేశ్వర్ రెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీ నియమ నిబంధనలను అతిక్రమించి ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని హెచ్చరించారు.ప్రత్యర్థులు ధైర్యంగా ఎదురుగా వచ్చి రాజకీయాలు చేయాలని, సోషల్ మీడియా, ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. “మేము మా పార్టీ నాయకులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. అవసరమైతే వారికి రక్షణగా గుండె అడ్డేసి నిలబడతాం. మీలాగా తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని మేము చూడము” అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.నవులూరి చెన్నారెడ్డి హత్య కేసులో నిందితులను త్వరగా గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మరోసారి కోరారు.1
- మమ్మల్ని ఏజెన్సీ గిరిజనులుగా గుర్తించాలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా 3 కిలోమీటర్ల పాదయాత్ర గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలి.. భూములకు రక్షణ కల్పించాలి!! ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి–ఎన్ఆర్పురం పంచాయతీ పరిధిలో గిరిజన యువకులు, గ్రామస్తులు 3 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. తమ గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చి, తమను ఏజెన్సీ గిరిజనులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సంప్రదాయ అడ్డాకుల టోపీలు ధరించి ప్రదర్శన నిర్వహించారు. బూరుగ, చిన్నకోనెల, బొంగిజ, రాయపాడు, చిమిడివలస తదితర గ్రామాల యువకులు, గ్రామస్తులు పాదయాత్రలో పాల్గొన్నారు. తమ గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని, గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. *పేరుకే గిరిజనులు... హక్కులు మాత్రం లేవు* అనంతగిరి మండలంలోని రొంపల్లి, ఎన్ఆర్పురం, భీంపోలు, గుమ్మకోట, గరుగుబెల్లి ఐదు పంచాయతీల పరిధిలో సుమారు 64 గిరిజన రెవెన్యూ గ్రామాలు, దాదాపు 20 వేల మంది నాన్షెడ్యూల్ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామాల్లో 97 శాతం మంది గిరిజనులే నివసిస్తున్నప్పటికీ, తమను ఏజెన్సీ గిరిజనులుగా గుర్తించకపోవడంతో అనేక చట్టపరమైన హక్కులు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1/70 చట్టం, పీసా చట్టం తదితర రక్షణలు తమకు అందడం లేదని తెలిపారు. *భూములకు రక్షణ కల్పించాలి* తమ తల్లిదండ్రులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి, వారి అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని భూముల రికార్డుల్లో మార్పులు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది రెవెన్యూ అధికారుల కుమ్మక్కుతో తమ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపించారు. భూముల సమస్యలపై రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే సివిల్ కోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నారని, కోర్టు కేసులకు లక్షల రూపాయలు ఖర్చవుతుండటంతో పేద గిరిజనులు న్యాయం పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. *రోడ్డు, వైద్య సౌకర్యాలు కల్పించాలి* ఎన్ఆర్పురం పెద్దూరు నుంచి రాయపాడు, చిమిడివలస, బొంగిజ, చిన్నకోనెల, బూరుగ మీదుగా వాణిజ వరకు తారు రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవాలంటే సుమారు 13 కిలోమీటర్లు, వైద్య సేవల కోసం దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. తమ గ్రామాలకు కనీస రహదారి, వైద్య సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికైనా తమ గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చి, ఏజెన్సీ గిరిజనులుగా గుర్తించాలని, గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డు సభ్యుడు సోమీల అప్పలరాజు, కోటపర్తి సింహాచలంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.4
- గుంటూరు నగరంలో వైసీపీ భారీ ర్యాలీ..................... గుంటూరు శంకర్ విల్లాస్ నుంచి లాడ్జి సెంటర్ వరకు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. 'మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ' అని నినాదాలు చేస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, పానుగంటి చైతన్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అవనిగడ్డలో వైసీపీ భారీ ర్యాలీ.. పోలీసుల అడ్డంకులు....... మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మోగా డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలపై విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీరు విడుదల చేయాలని కోరారు. ర్యాలీకి అనుమతులు లేవని, నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ర్యాలీ కొనసాగించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని సింహాద్రి రమేష్ బాబు హెచ్చరించారు.4