Shuru
Apke Nagar Ki App…
*🙏🙏ఈరోజు గో సమ్మన్ ఆహ్వానం అభియాన్ వారి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ పత్రాలను తీసుకుని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు బాన్సువాడ హిందూ బంధువులందరూ కలిసి ఇవ్వడం జరిగింది కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హిందూ ఆత్మ బంధువులందరికీ పాదాభివందనాలు 🐂జై గోమాత జై జై గోమాత*🐄🐂
Vishwamber Rao
*🙏🙏ఈరోజు గో సమ్మన్ ఆహ్వానం అభియాన్ వారి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ పత్రాలను తీసుకుని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు బాన్సువాడ హిందూ బంధువులందరూ కలిసి ఇవ్వడం జరిగింది కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హిందూ ఆత్మ బంధువులందరికీ పాదాభివందనాలు 🐂జై గోమాత జై జై గోమాత*🐄🐂
More news from తెలంగాణ and nearby areas
- Post by Vishwamber Rao1
- కామారెడ్డి జిల్లా : నాన్వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు సోమవారం పట్టణ సీఐ నరహరి మీడియాకు వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండం లక్ష్మిని భర్త శివాజీ నాన్వెజ్ ఎందుకు వండలేదని ప్రశ్నించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఆవేశంతో పక్కనే ఉన్న కొడవలితో శివాజీపై లక్ష్మి దాడి చేసింది. దీంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో నిందితురాలు లక్ష్మిని రైల్వేస్టేషన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.1
- ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సుదూర ప్రాంతాల నుండి వచ్చి ప్రజలు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో దరఖాస్తులు చేస్తున్నారని, పరిష్కారంలో జాప్యం వహించొద్దని తెలిపారు. ప్రతి అధికారి బాధ్యతగా దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ రోజు జరిగిన ప్రజావాణిలో ప్రజల నుండి 80 దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Congress social media work1
- వెల్దుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకుడు కథల కృష్ణ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కేసీఆర్ పాలనలో అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు.1
- పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ కలెక్టర్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహం ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.1
- సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో ఈరోజు ఎండ తీవ్రత బాగా ఉన్నందున వేడిమికై ఉపశమనం కోసం వర్షం కురిసింది. ఒక్కసారిగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయిన ప్రజలు వర్షం పడటంతో కొద్దిగా చల్లబడింది. వేడిని తాపం బాగా ఉన్నందున వర్షం పడి చల్లబడిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.1
- కామారెడ్డి జిల్లా : ఏప్రిల్ 27, 2026: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, ఈరోజు అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు వారి చేతుల మీదుగా దత్తత సహాయ కేంద్రం ప్రారంభించబడింది. దత్తత ప్రక్రియలు, చట్టపరమైన నిబంధనలు, అవసరమైన పత్రాలు మరియు కౌన్సెలింగ్పై పౌరులకు మార్గదర్శకత్వం అందించడం ఈ సహాయ కేంద్రం ఉద్దేశం. దత్తత కోరుకునే తల్లిదండ్రులు, కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి (DWO), జిల్లా బాలల పరిరక్షణ అధికారి (DCPO), శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, 99 రోజుల పాలన కార్యక్రమంలో బాలల సంక్షేమ సేవలను బలోపేతం చేయడానికి, దత్తత సేవల్లో పారదర్శకత తీసుకురావడానికి ఈ కేంద్రం దోహదపడుతుందని తెలిపారు.1