Shuru
Apke Nagar Ki App…
మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ పోలీసుల అదుపులోకి..? ములుగు జిల్లాలో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ పోలీసుల అదుపులోకి వచ్చినట్లు సమాచారం అందింది. గత వారం రోజులుగా మహాముత్తారం, ఏటూరునాగారం అడవీ ప్రాంతాల్లో విస్తృత కూంబింగ్ చేపట్టిన పోలీసులు కీలక విజయాన్ని సాధించినట్లు తెలుస్తోంది.అయితే, ఈ ఘటనపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మూడు నెలలుగా దామోదర్ ములుగు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నాడని సమాచారం ఉంది. పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేశారు.
M D Azizuddin
మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ పోలీసుల అదుపులోకి..? ములుగు జిల్లాలో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ పోలీసుల అదుపులోకి వచ్చినట్లు సమాచారం అందింది. గత వారం రోజులుగా మహాముత్తారం, ఏటూరునాగారం అడవీ ప్రాంతాల్లో విస్తృత కూంబింగ్ చేపట్టిన పోలీసులు కీలక విజయాన్ని సాధించినట్లు తెలుస్తోంది.అయితే, ఈ ఘటనపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మూడు నెలలుగా దామోదర్ ములుగు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నాడని సమాచారం ఉంది. పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని దాదాసాహెబ్ కాలనీలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎస్సై ఊర సృజన్ కుమార్ కాలనీకి వెళ్లి నివాసులతో సమావేశమయ్యారు. ఇకపై అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేయబోమని, ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం అందిస్తామని కాలనీ వాసులతో ప్రతిజ్ఞ చేయించారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో దొంగలు హల్చల్ తాళం వేసి ఉన్న ఆవుల సంపత్ ఇంట్లో 5 తులాల బంగారం,లక్ష యాభై వేల నగదు అపహరణ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.1
- మోకుదెబ్బ రమేష్ గౌడ్ పిలుపు... తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పోర్తి తో రాజకీయంగా ఎదగాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు.నర్సంపేట పట్టణం లోని కంఠ మహేశ్వరుని ఆలయం ఆవరణలో వరంగల్ జిల్లాలో ఇటీవల నూతనం గా కౌన్సిలర్ లుగా ఎన్నికైన వేముల సంధ్య- సాంబయ్య గౌడ్, జూలూరి రోజా రాణి, దొమ్మటి రమ్య-సంతోష్ గౌడ్ లకు గౌడ కులస్తులకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదె బ్బ వరంగల్ జిల్లాకమిటీ,నర్సం పేట జిడబ్ల్యూఎస్, నర్సంపేట పట్టణ గౌడ సంఘాల నాయకులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్,గండి లింగయ్య గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, గోడిశాల సదానందం గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్ అధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరి గింది. ఈ సంధర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ మూడు దశబ్దాల క్రితమే సామాన్య గీత కార్మికుల కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 12 కోటలను జయించి గోల్కొండ కోట పరిపాలన చేసిన చక్రవర్తిగా పేరు గదించడం జరిగిందన్నారు.ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన రాజకీయంగా వెనుకబడి పోతున్నామన్నారు.గౌడ కులస్తులు ఐక్యతగా ఉండి అభివృద్ధి చెందా లని రమేష్ గౌడ్ తెలిపారు.అనంతరం నూతన గౌడ కౌన్సిలర్ కు శాలువ, షీల్డ్, పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గిరాగాని సాంబయ్య గౌడ్, కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్, తాళ్లపెల్లి చంద్ర మౌళి గౌడ్,జూలూరి మనీష్ గౌడ్, కల్లెపు వెంకట్ నారాయణ గౌడ్, మర్ద గణేష్ గౌడ్, జనగాం మల్లికార్జున్ గౌడ్, నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,వేముల ఐలు సమ్మయ్య గౌడ్,నాగేల్లి సారంగం గౌడ్, గండి నర్సయ్య గౌడ్,నాతి సదానందం గౌడ్, గాదెగోని బాబు గౌడ్,కక్కేర్ల అశోక్ గౌడ్, తాళ్లపెల్లి కృష్ణ గౌడ్, ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, గండి రాము గౌడ్, బూర వేణు గౌడ్, వేముల కృష్ణ గౌడ్,తాబేటీ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.2
- కలెక్టరేట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) మ్యాపింగ్పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్తో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 50 మ్యాపింగ్లు పూర్తి చేసి, వారం రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.1
- కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానం పై అలకబూనారు. ఢిల్లీకి రావాలని పిలిచిన వెళ్లకుండా సొంత పనుల్లో జీవన్ రెడ్డి నిమగ్నమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అవమానపరిచేలా పార్టీ పెద్దలు వ్యవహరించారని జీవన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సంజయ్ ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం తమకు తప్పవు వేధింపులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. భవిష్యత్తు ఎటు వైపు దారితీస్తాయో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైలెంట్ గా కాంగ్రెస్ పెద్దల తీరును జీవన్ రెడ్డి నిరసిస్తున్నారు. జీవన్ రెడ్డి అలకబూనడంపై పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.1
- కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామానికి చెందిన వివాహిత పోలవేణి అనుష (25) కాకతీయ కెనాల్లో పడి మృతి చెందింది. ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆమె కోసం గాలింపు చేపట్టగా రంగపేట శివారులో మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.1
- Post by Sk Noori4
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠగా సాగాయి. మొత్తం 16 వార్డుల్లో 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్-బీఆర్ఎస్ సమానంగా 9-9కి చేరాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. చైర్మన్ పదవికి జరిగిన డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి తునం శ్రవణ్ పేరు రావడంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య ఆనందంతో కేరింతలు కొట్టారు. వైస్ చైర్మన్ డ్రాలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి పేరు రావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1