*ఊటుకూరు పెద్దపాళెం కాపులుగా ఎంపికైన మత్స్యకార పెద్దలకు ఘన సన్మానం* - కాపులుగా ఎంపికైన మత్స్యకార పెద్దలకు అభినందనలు. - మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి, వారి ఆర్థికాభివృద్ధికి కాపులు అంకిత భావంతో కృషి చేయాలి. - మత్స్యకారులకు ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తాను. - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విడవలూరు మండల పరిధిలోని ఊటుకూరు పెద్దపాళెం మత్స్యకార గ్రామ పెద్దలలు తమ నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ మత్స్యకార సంఘం పెద్ద కాపుగా ఆడంగారి కనకయ్య, నడిం కాపుగా కొండూరు ఏడుకొండలు, చిన్న కాపుగా కొండూరు అమరేంద్ర, మరియు క్యాషియర్గా పాపారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో ఆరుగురు మత్స్యకార ప్రముఖులను గ్రామ పెద్ద మనుషులుగా సంఘం సభ్యులు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మత్స్యకార నాయకులు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు కాపులు మరియు మత్స్యకార పెద్దలకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారు మత్స్యకార పెద్దలకు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు నూతన కార్యవర్గం మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి వారి ఆర్థికాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తాననని మత్స్యకార నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాపులతో పాటు పలువురు మత్స్యకార నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
*ఊటుకూరు పెద్దపాళెం కాపులుగా ఎంపికైన మత్స్యకార పెద్దలకు ఘన సన్మానం* - కాపులుగా ఎంపికైన మత్స్యకార పెద్దలకు అభినందనలు. - మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి, వారి ఆర్థికాభివృద్ధికి కాపులు అంకిత భావంతో కృషి చేయాలి. - మత్స్యకారులకు ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తాను. - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విడవలూరు మండల పరిధిలోని ఊటుకూరు పెద్దపాళెం మత్స్యకార గ్రామ పెద్దలలు తమ నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ మత్స్యకార సంఘం పెద్ద కాపుగా ఆడంగారి కనకయ్య, నడిం కాపుగా కొండూరు ఏడుకొండలు, చిన్న కాపుగా కొండూరు అమరేంద్ర, మరియు క్యాషియర్గా పాపారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో ఆరుగురు మత్స్యకార ప్రముఖులను గ్రామ పెద్ద మనుషులుగా సంఘం సభ్యులు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మత్స్యకార నాయకులు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు కాపులు మరియు మత్స్యకార పెద్దలకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారు మత్స్యకార పెద్దలకు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు నూతన కార్యవర్గం మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి వారి ఆర్థికాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తాననని మత్స్యకార నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాపులతో పాటు పలువురు మత్స్యకార నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
- బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.1
- విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లెలో 'కరెంటోళ్ల జనబాట'కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.1
- Post by Doddagalla Munirathinam1
- నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే )సందర్బంగా బాదంపప్పు బద్ద పై మైక్రో బ్రష్ ల తో వాటర్ కలర్ పెయింటిగ్స్ ద్వారా నలబై సూక్ష్మ చిత్రాలను ఒక గంటలో వేసి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో భూమాత భూమిని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ చేతులు జోడిస్తూ వేదనతో వేడుకున్నట్లు, అలాగే వన్య ప్రాణులు చెట్లు లేక, ఆహారం లేక, నీటి కొరతతో అలమటించి పోయి భూమాతకు మొర పెట్టుకున్నట్లు, ఎండి పోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల,జంతువుల కళే బరాలు వున్నట్లు, అలాగే నీటి బొట్టులో చెట్టు వున్నట్లు అంటే నీరును, చెట్లను కాపాడు కోవాలని అర్థం. ఇలా చిన్న బాదం పప్పు పై ఇన్ని సూక్ష్మ చిత్రాలను వేసానని తెలిపారు .ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ సకల జీవరాశులకు భూమి నిలయం. కాని మానవులు తమ అవసరాల కోసం భూమికి హాని కలిగిస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి అత్యంత వేడిమి వుంది. వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది.. భూమి మీద దృష్టి పెట్టకుంటే భవిష్యత్ లో మరెన్నో ప్రమాదాలు జరుగుతాయి. మనిషి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నీటిని వృధా చేయకూడదు, విపరీతంగా చెట్లను పెంచాలి. పర్యావరణం పచ్చగా వుంటేనే భూమిలోని వేడి తగ్గి చల్ల బరుస్తుంది. ప్రతి జీవరాశికి భూమిలో నివసించే హక్కు వుంది. భూమి రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. ప్రభుత్వం కూడా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి భూమిని కాపాడుకోవాలని తెలియ చెప్పాలి . భూమి నుండి అన్ని అవసరాలు తీర్చుకొని మనం భూమిని కాపాడుకోలేక పోతున్నాము . నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమినుండి వచ్చిందే. భూమి అంటే మనకు కావాలిసినది ఇచ్చే అక్షయపాత్ర.మన భూమిని చేయకు - మరు భూమి.అందరూ పర్యావరణాన్ని కాపాడుకొని భూమిని రక్షించు కొందాం అని పిలుపునిచ్చారు.1
- జెఈఈ మెయిన్–2026 ఫలితాలలో భాష్యం అద్భుత ప్రతిభ..ఓపెన్ కేటగిరీలో 100 పర్సంటేజీ తో ఆలిండియా టాపర్ టి.దుర్గా సుప్రభాత్ Shot News:జెఈఈ మెయిన్ – 2026 ఫలితాలలో భాష్యం బఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళినగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడన్నారు. టి.దుర్గా సుప్రభాత్ 100 పర్సంటైల్తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 11వ ర్యాంకును సాధించాడన్నారు.1
- శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం :-రెవిన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం లో అసెంబ్లీ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో ఉదయం 11:00 గంటలకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వెల్లడించిన ఓటర్ల వివరాలు: • *ధర్మవరం 160 అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,48,012 మంది ఓటర్లు ఉన్నారు* • పురుషులు : 1,22,706 • మహిళలు : 1,25,285 • ఇతరులు : 21 *18 సంవత్సరాలు నిండిన యువతీ–యువకులు తప్పనిసరిగా తమ ఓటు హక్కు నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.* అలాగే ఓటరు జాబితాలో కొత్త నమోదులు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ ,ఎలక్షన్ సీనియర్ సహాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.1
- ప్రెస్ నోట్ ఆరు సంవత్సరముల పాపకు గుండెల్లో రంద్రం దీర్ఘకాలిక సమస్య పి ఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి రావడంతో తక్షణం స్పందించి బాధితులు సొంత గ్రామానికి వెళ్లి పాప గుండె ఆపరేషన్ కై పాప తల్లికి ధైర్యం కౌన్సిలింగ్ ఇస్తున్న రాష్ట్ర అధ్యక్షులు చౌటూరు శ్రీనయ్య P N YNADI MAHANADU కందమూరు ఎస్టి యానాది కాలని నెల్లూరు రూరల్ మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్1
- బద్వేలు :మున్సిపాలిటీ సీనియర్ లీడర్ జివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బద్వేలుఆర్డీవో చంద్రమోహన్, డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి .వందలాది మంది కార్యకర్తలతో కోలాహలంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.1
- నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి దగ్గర రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలవ్వగా, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.1