Shuru
Apke Nagar Ki App…
కరీంనగర్ ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క.. గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.
OM NAMSHIVAYA
కరీంనగర్ ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క.. గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.
More news from Telangana and nearby areas
- కరీంనగర్ ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క.. గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.1
- జగిత్యాల జిల్లాలో CMR ధాన్యం దుర్వినియోగం కేసులో నలుగురు అరెస్ట్... మరో నలుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగం చేసిన రెండు రైస్ మిల్లులకు చెందిన 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లిలోని అమృత ఆగ్రో ఇండస్ట్రీస్, హరిహర ఆగ్రో ఇండస్ట్రీస్లలో సిఎంఆర్ ధాన్యం దుర్వినియోగం అయినట్లు సివిల్ సప్లైస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్థారించారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో కోడిమ్యాల పోలీస్ స్టేషన్లో మిల్లు యజమానులు 8 మందిపై కేసు నమోదు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న ముక్క గంగాధర్, ముక్క గోదావరి, సామ వజ్రమ్మ, సామ మారుతిలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు మల్యాల సీఐ రాజ్కుమార్ తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగంపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకుని పనులు నిమగ్నమయ్యారు.1
- సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని మార్కండేయ ఆలయంలో సాంప్రదాయబద్ధంగా జంధ్యాల బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని పద్మశాలీ కులస్థులు ఆలయంలో ప్రత్యేకంగా జంధ్యా ధారణ కార్యక్రమాన్ని చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జంధ్యాలను ధరించి సంప్రదాయ ఆచారాలను పాటించారు. అనంతరం శ్రీ మార్కండేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేదమంత్రాల ఘోషతో, భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.4
- ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు రాఖీ కట్టిన సోదరి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.1
- అనుబంధాలకు ప్రతీక.. రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల ఆత్మీయ బంధానికి వేడుక1
- బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నేతలపై స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1,400 కోట్లు అక్రమంగా వచ్చినవే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన వీడియోలో నేనే ఉన్నానని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారన్నారు.1
- *కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క* గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది. *కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ కు రాఖీ కట్టిన అక్క* గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకి తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ఆపి రాఖీ కట్టిన అక్క తమ్మనవేణి స్వప్న. తమ్ముడు రాజు డ్యూటీలో ఉండడంతో రేణికుంట చెందిన అక్క స్వప్న రాజీవ్ రహదారి పై బస్సు ఆపి రాఖీ కట్టింది.1
- కరీంనగర్ జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలోజిల్లా సమావేశంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిచాలి.. జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల 4వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 9.30 గంటలకు శ్రీ కృష్ణా పూజ కార్యక్రమం. 10.30హోమం.పూజ కార్యక్రమంలో పాల్గొనే దంపతులు జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్ కి పేర్లు నమోదు చేసుకోగలరు. 12.15 నిమిషాలకి ఉట్ల కార్యక్రమం.అనంతరం ప్రసాద పంపిణీ. ఈ కార్యక్రమంలో భాగంగా యాదవ్ కులస్థూలు అందరూ భాగస్వాములు అయి ఇట్టి కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు అంబటి సంతోష్ యాదవ్ , జిల్లా అధ్యక్షులకు,ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘం జిల్లా డైరెక్టర్ సందబోయిన ప్రసాద్ యాదవ్,గీతాంజలి యాదవ్, బొబ్బూరి కుమార్ యాదవ్ ,రాజేందర్ యాదవ్,వేల్పుల కొమురయ్య యాదవను సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ సందబోయిన ప్రసాద్ యాదవ్.శ్రీ క్రిష్ణ ట్రస్ట్ చైర్మన్ బబ్బూరు కుమార్ యాదవ్.జిల్లా మహిళా అధ్యక్షురాలు సందబోయిన గీతాంజలి యాదవ్,యాదవ్ సంఘం జిల్లా కార్యదర్శి కాల్వ మల్లేశ్ యాదవ్.ఉపాధ్యక్షులు ముంజ రాజేందర్ యాదవ్. కొండ రవి యాదవ్ జాతీయ అవార్డు గ్రహీత గారు.యూత్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ యాదవ్. యాదవ్ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బండి మల్లయ్య యాదవ్.కరీంనగర్ టౌన్ ఉపాధ్యక్షులు మెండ రాజు యాదవ్. జంగా కొమురయ్య యాదవ్.8వ డివిజన్ అధ్యక్షులు వేలుపుల కొమురయ్య యాదవ్.యువజన విభాగం కార్యదర్శి అంబటి సంతోష్ యాదవ్ ,మరియు కుల బంధువులు పాల్గొన్నారు..1