Shuru
Apke Nagar Ki App…
అనంతబాబు అరెస్ట్ వార్తను రాయడానికి కూడా జగన్కు మనసు ఒప్పలేదు. దళితుడైన వీధి సుబ్రహ్మణ్యం పేరు రాసే దమ్ము కూడా లేద
K AMPAIAH ACHARI
అనంతబాబు అరెస్ట్ వార్తను రాయడానికి కూడా జగన్కు మనసు ఒప్పలేదు. దళితుడైన వీధి సుబ్రహ్మణ్యం పేరు రాసే దమ్ము కూడా లేద
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- దళితుడైన వీధి సుబ్రహ్మణ్యం పేరు రాసే దమ్ము కూడా లేద1
- తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణలో సామాజిక న్యాయం ప్రజల సంక్షేమం కోసం టిఆర్ఎస్ పార్టీ స్థాపించినట్టు ఆమె తెలిపారు.1
- నందవరంలో స్థానిక కోట వీదికి వెళ్లే ప్రధాన రహదారి సీసీ రోడ్డు పక్కన అక్రమ కట్టడాలు ఆపాలని గ్రామ ప్రజలు, మల్లికార్జున గౌడ్,మీసాల సంపత్, తెలిపారు. ఆదివారం ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. సుమారు వందల మంది తిరిగే, సిసి రోడ్డు పక్కనే అక్రమ కట్టడాలు ఏర్పాటు చేస్తే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ కట్టడాన్ని ఆపాలని, లేకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.1
- శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన రైతు చుక్కలూరు రాము అనే రైతు చిన్నూరు కొండ కింద తన పొలంలో దాదాపు 8 ఎకరాల పైగా దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాడు. పూత కాయ ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తోటకి నిప్పు పెట్టడంతో దాదాపు 3,200 దానిమ్మ చెట్లుతో పాటు డిప్ వైరు అగ్నికి ఆహుతి అయ్యాయని రైతు కన్నీరు అవుతూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతు రాము మీడియాతో మాట్లాడుతూ, దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాను.ఐతే రెండు పంటలు పూర్తిగా నష్టపోయానని ఈసారైనా పంట పూర్తిగా చేతికి వస్తుందని దానితో అప్పులు తీర్చుకోవాలి అని అనుకున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పక్క తోట వారు నాకు సమాచారం తెలియజేయగా నేను ఇంటి దగ్గర నుండి టూవీలర్లో పొలం దగ్గరికి వచ్చేపాటికి మంటలు పూర్తిగా వ్యాపించాయి నేను ఏం చేయాలో దిక్కుతోచక స్థితిలో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశాను.వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారు వచ్చేపాటికి కొంచమైనా మంటలని అదుపు చేయాలని నా 2 వీలర్ ని పక్కన పెట్టి మంటలు ఆర్పుతున్న సమయంలో టూవీలర్ కూడా అగ్నికి హాహుతి అయిపోయిందని.మొత్తం 8 ఎకరాల పొలంలో ఆరున్నర ఎకరాలలో ఉన్నటువంటి దానిమ్మ చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 15 లక్షల వరకు నష్టం జరిగిందని కావున నాపై దయవుంచి మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్ రెడ్డి,లు స్పందించి నాకు ప్రభుత్వం ద్వారా సహాయం చేసి రైతును ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాంఅని తెలిపారు.3
- వినుకొండ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మరియు అక్రమ మద్యం వ్యవహారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వెంకటరామిరెడ్డి . మాట్లాడుతూ కూటమి నేతల అక్రమ మైనింగ్పై మండిపడ్డారు. వెంకుపాలెం గ్రామం సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకుని అధికారులకు అప్పగించినప్పటికీ, ఆ లారీలు మాయం కావడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు గారు తన సొంత భూమిలో మట్టి తవ్వినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన జీవీ ఆంజనేయులు, ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్పై మౌనం వహించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదమని విమర్శిస్తూ, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుతో కలిసి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి గారు* మాట్లాడుతూ అక్రమ మైనింగ్పై “కఠిన చర్యలు తీసుకుంటాం” అనే ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయాలు చీఫ్ విప్కు తెలియనట్లు నటించడం ఆశ్చర్యకరమన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత వంటి సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాయకుల పాఠాలను పట్టించుకోకపోవడం పాలనలో వైఫల్యానికి సంకేతమని విమర్శించారు. ప్రముఖ న్యాయవాది & పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి M.N ప్రసాద్ గారు* మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ స్థాయిలో అక్రమ మైనింగ్పై మీడియా స్పందన అభినందనీయం అన్నారు. గతంలో బ్రహ్మానాయుడు గారు తన సొంత స్థలంలో మట్టి తవ్వితే దానిని అక్రమంగా ప్రచారం చేసిన వారు, ఇప్పుడు భారీగా జరుగుతున్న అక్రమాలపై స్పందించకపోవడం ప్రశ్నార్థకమన్నారు. వెంకుపాలెం, దాసరిపల్లి, దొండపాడు గ్రామాల్లో పెద్ద ఎత్తున మట్టి అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మైనింగ్ మరియు రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పట్టుబడ్డ లారీలు తిరిగి అదే కార్యకలాపాల్లో పాల్గొనడం అధికారుల పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. అక్రమ మద్యం వ్యవహారంపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మద్యం సరఫరా చేస్తూ, ప్రభుత్వ ధరకు కాకుండా ఎంపిక చేసిన బాటిళ్లపై రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మద్యం కొనుగోలు చేయకపోతే సంబంధిత వ్యక్తులను పోలీసులకు అప్పగించేలా బెదిరింపులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి నీచమైన రాజకీయాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. నియోజకవర్గం మొత్తం మాఫియా వలలో చిక్కుకుపోయిందని, ఈ పరిస్థితికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణం కన్వీనర్ కొత్తమసు శివ గారు, వినుకొండ రూరల్ మండల కన్వీనర్ దండు చెన్నయ్య మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.4
- అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అంజుమన్ అజ్మతుల్ ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఖత్నా (సున్తీ) కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో సుమారు 156 మంది బాలలకు సున్నతి నిర్వహించగా, వారికి నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను కూడా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు బ్రెడ్ సర్మస్ మాట్లాడుతూ, ఈ ఉచిత సున్నతి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మస్జిద్ ఇమామ్లకు మరియు కార్యక్రమంలో సేవలు అందించిన యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సున్నతి నిర్వహించిన వైద్యులు అతావుర్ రహమాన్ మరియు మూసా కి శాలువాలతో సత్కరించి, వారి సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు బ్రెడ్ సర్మాస్, కార్యదర్శి మొహమ్మద్ షఫీ, సహాయ కార్యదర్శి హుజేఫా, కోశాధికారి అహ్మద్ హుస్సేన్,కమిటీ సభ్యులు ఖాసిం, షాకీర్, ఉమర్ అలీ,షేక్ జాకీర్, రజాక్, భాష తదితరులు పాల్గొన్నారు.1
- అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై దొరల అహంకార విషయాన్నీ చిమ్మి కిందిస్థాయి కులాలను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ అన్నారు జిల్లేడు చౌదరిగుడా మండలంలో జరిగిన హత్యయత్నంపై ఆయన స్పందిస్తూ కొత్తూరు మండలంలో పలువురు సర్పంచులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్పంచ్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- మహానంది మండలంలోని ఇంధన బంకుల్లో పెట్రోలు, డీజిల్ కోసం వినియోగదారులు బారులు తీరుతున్నారు. కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆదివారం మహానంది మండలం గాజుల పల్లెలో బంకు వద్ద పెద్ద ఎత్తున వాహనాల క్యూలు దర్శనమిస్తున్నాయి.బంకుల ప్రాంగణాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా మహానంది ఎస్ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.5