ఇమామ్, మౌజన్ ల గౌరవ వేతనం పొందుతున్న మసీదు కమిటీల పత్రాలను సమర్పించాలి- ఉమ్మడి జిల్లాల మైనార్టీ సంక్షేమాధికారి రాష్ట్ర వక్స్ బోర్డ్ కార్యనిర్వహణాధికారి, విజయవాడ వారి ఆదేశాల మేరకు నంద్యాల, కర్నూలు జిల్లాలలో ప్రభుత్వం ద్వారా గౌరవ వేతనం పొందుతున్న. మసీదు ఇమామ్, మౌజన్ లకు వారి యొక్క గౌరవ వేతనం తదుపరి పొందాలనుకుంటే, ఆ సంబంధిత మసీదు కమిటీ ప్రెసిడెంట్ లేక ముత్తవలి (ధర్మకర్త) ఎవరయితే ఉన్నారో వారు మసీదుకు సంబంధించిన పత్రాలను 30/04/2026 తేదీ లోపల జిల్లా వక్స్ బోర్డు వారి కార్యాలయంలో సమర్పించవలెనని కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల మైనారిటీల సంక్షేమాధికారి, సయ్యద్ సబిహా పర్వీన్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. మసీదుకు సంబంధించిన డాక్యుమెంట్ పత్రాలు సమర్పించని యెడల వారి యొక్క మసీదుకు వచ్చే గౌరవ వేతనం నిలిపివేయబడుతుందనీ ఆమె పేర్కొన్నారు. కావున మసీదు రిజిస్ట్రేషన్ కొరకు మసీదు కార్యాలయంలో ఖచ్చితంగా సంబంధించిన స్థలం పత్రాలను వక్స్ బోర్డు వారికి సమర్పించవలెనని ఈ సందర్భంగా సయిదా సబిహ పర్వీన్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు నంద్యాల వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఇమ్రాన్, సెల్ నెంబర్ 8520974482 ను సంప్రదించాలని కోరారు.
ఇమామ్, మౌజన్ ల గౌరవ వేతనం పొందుతున్న మసీదు కమిటీల పత్రాలను సమర్పించాలి- ఉమ్మడి జిల్లాల మైనార్టీ సంక్షేమాధికారి రాష్ట్ర వక్స్ బోర్డ్ కార్యనిర్వహణాధికారి, విజయవాడ వారి ఆదేశాల మేరకు నంద్యాల, కర్నూలు జిల్లాలలో ప్రభుత్వం ద్వారా గౌరవ వేతనం పొందుతున్న. మసీదు ఇమామ్, మౌజన్ లకు వారి యొక్క గౌరవ వేతనం తదుపరి పొందాలనుకుంటే, ఆ సంబంధిత మసీదు కమిటీ ప్రెసిడెంట్ లేక ముత్తవలి (ధర్మకర్త) ఎవరయితే ఉన్నారో వారు మసీదుకు సంబంధించిన పత్రాలను 30/04/2026 తేదీ లోపల జిల్లా వక్స్ బోర్డు వారి కార్యాలయంలో సమర్పించవలెనని కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల మైనారిటీల సంక్షేమాధికారి, సయ్యద్ సబిహా పర్వీన్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. మసీదుకు సంబంధించిన డాక్యుమెంట్ పత్రాలు సమర్పించని యెడల వారి యొక్క మసీదుకు వచ్చే గౌరవ వేతనం నిలిపివేయబడుతుందనీ ఆమె పేర్కొన్నారు. కావున మసీదు రిజిస్ట్రేషన్ కొరకు మసీదు కార్యాలయంలో ఖచ్చితంగా సంబంధించిన స్థలం పత్రాలను వక్స్ బోర్డు వారికి సమర్పించవలెనని ఈ సందర్భంగా సయిదా సబిహ పర్వీన్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు నంద్యాల వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఇమ్రాన్, సెల్ నెంబర్ 8520974482 ను సంప్రదించాలని కోరారు.
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని 3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.1
- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నన్ను గేట్ దాటనివ్వను, బయట తిరగనివ్వను అంటావా.. నీకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే ఏమనుకుంటున్నావ్ అంటూ కాటసాని మండిపడ్డారు. మంత్రి పదవిపై గౌరవంతో పద్ధతిగా మాట్లాడుతున్నా అని హెచ్చరించారు.1
- ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.1
- కర్నూల్ జిల్లాలోని సి బెళగల్ మండలం సి.బెళగల్ గ్రామంలో రైతులు వరి పంట వేసుకుంటే శ్రీ బెలగల్లోని ఉన్నటువంటి పందులు పొలాలను నాశనం లేపుతున్న సి బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీలు సి బెళగల్ ఎమ్మార్వో కనీసం ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు కనీసం సి బెళగల్ పోలీస్ వారికి చెపితే సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ చెపితే మేము చర్య తీసుకుంటామని అంటున్నారు దయచేసి మా పంటలను పందుల నుండి రక్షణ కల్పించాలని సి.బెళగల్ రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ సర్ రైతులను కాపాడాలని వేడుకుంటున్నారు3
- మండలంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోడేరు వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. 16 గ్రామ పంచాయతీల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టునే ఉండాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ మంచినీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ను నివారించవచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, lఅనారోగ్యంగా అనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.1
- రైతు భరోసా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఈరోజు రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది కానీ ఈ వీడియో అంతకుముందు షూట్ చేశాం.1
- గ్రామస్తులంతా కన్నీటి పర్యంతం1
- బనగానపల్లె మండలం మైన్ ప్రాథమిక పాఠశాల యందు జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో బడిబాట విశిష్టత హెచ్ఎం మల్లికార్జున రావుకు సన్మానం, విద్యార్థులకు బహుమతులు ప్రధాన ఉత్సవం, అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది, ముందుగా బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిల్లల కోసం మధ్యాహ్న భోజనం మంచి పౌష్టికాహారం బూట్లు పుస్తకాలు అమ్మ ఒడి రూ. 15000 మొదలగునవి మీకోసం అమలు చేస్తుందని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కృషి చేయాలని బడిబాటి బంగారు బాట అన్నారు. అనంతరం హెచ్ ఎం మల్లికార్జునరావు ఘనంగా సన్మానించి విద్యార్థులకు బహుమతులు అందించారు. హెచ్ఎం మల్లికార్జునరావు ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ.. పిల్లలు మా పాఠశాలలో చేర్పించండి చదువు చెప్పడం మా వంతు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు వల్లపు శంకర్, ఉపాధ్యాయులు, మధు కిషోర్, సురేష్, మల్లేశ్వరుడు, మల్లికార్జున , పలుకూరు గ్రామస్తులు పాల్గొన్నారు.1