Shuru
Apke Nagar Ki App…
Mana Velugu
More news from తెలంగాణ and nearby areas
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణలోని ఎర్రవెల్లిలో పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీని బలోపేతం చేసే వ్యూహాలపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.1
- Post by Mana Velugu1
- నా కొడుకైనా శిక్ష పడాల్సిందే: చట్టంపై బండి సంజయ్ క్లారిటీ! తన కుమారుడిని క్రిమినల్గా చిత్రీకరించడంపై బండి సంజయ్ స్పందించారు. "నా కుమారుడు ఏ తప్పూ చేయలేదని చెబుతున్నాడు. ఒకవేళ తప్పు చేసినట్లు తేలితే నా కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే, ఎవరికీ మినహాయింపు ఉండదు" అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా చట్టం తన పని తాను చేసుకుపోవాలని ఆయన పేర్కొన్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మే 12 ఐ3 న్యూస్ ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన కీలక సమావేశం. ఈ సమావేశంలో... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభా పక్షాల ఉప నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు: తక్కెళ్లపల్లి రవీందర్ రావు (ఎమ్మెల్సీ), డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే), డా. బండ ప్రకాష్ ముదిరాజ్ (ఎమ్మెల్సీ), వి. గంగాధర్ గౌడ్ (మాజీ ఎమ్మెల్సీ), జోగినపల్లి సంతోష్ కుమార్ (మాజీ ఎంపీ), నారదాసు లక్ష్మణరావు (మాజీ ఎమ్మెల్సీ), ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ), టి. జీవన్ రెడ్డి (మాజీ మంత్రి), సోమా భరత్ కుమార్ గుప్తా (మాజీ చైర్మన్), సత్యవతి రాథోడ్ (మాజీ మంత్రి/ఎమ్మెల్సీ), రావుల చంద్రశేఖర్ రెడ్డి (మాజీ ఎంపీ) తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా.. కెఆర్. సురేష్ రెడ్డి (మాజీ ఎంపీ), మహమూద్ అలీ (మాజీ మంత్రి), మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (మాజీ చైర్మన్) హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ ఇన్ఛార్జుల నియామకం సహా పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై కేసీఆర్ గారి అధ్యక్షతన చర్చిస్తున్నారు.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ గౌడ్ అంతిమయాత్రలో బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా, పాడె మోసి ధైర్యం కల్పించారు.4
- సికింద్రాబాద్లో సంచలనం రేపిన యావన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన ఈ దారుణంలో యువతి తండ్రి, బాబాయ్తో సహా 10 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు హత్యలో నేరుగా పాల్గొనగా, నలుగురు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.1
- బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన కొడుకు బండి సాయి భగీరథ వ్యవహారంపై స్పందించారు. 'నేను ఏ తప్పు చేయలేదు, నిజాయితీగా బయటికి వస్తాను' అని తన కుమారుడు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. కొడుకు, ఆ అమ్మాయి గతంలో స్నేహితులు అని, ఇప్పుడు విడిపోయారని మీడియాకు తెలిపారు.1
- తెలంగాణలో బండి భగీరథ్ పోక్సో కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని అడ్వకేట్ లలితారెడ్డి ఆరోపించారు. కఠినమైన సెక్షన్లు కాకుండా తక్కువ శిక్ష పడే సెక్షన్లు నమోదు చేశారని ఆమె విమర్శించారు. బాధితులకు న్యాయం జరగాలని చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్కు వివరించినట్లు లలితారెడ్డి తెలిపారు.1