logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి : బీసీ డిక్లరేషన్ సబ్ ప్లాన్ ను తక్షణమే అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహెర్ కామారెడ్డిలో సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ సబ్ ప్లాన్ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ తాహెర్, ప్రధాన కార్యదర్శి బొక్కల సంతోష్ డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

4 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
4 hrs ago

కామారెడ్డి : బీసీ డిక్లరేషన్ సబ్ ప్లాన్ ను తక్షణమే అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహెర్ కామారెడ్డిలో సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ సబ్ ప్లాన్ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ తాహెర్, ప్రధాన కార్యదర్శి బొక్కల సంతోష్ డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. 'వృక్షో రక్షతి రక్షితః' అని ఉమారాణి పేర్కొంటూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్ఓ నిఖిత, ఆర్డీవో వీణ పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. 'వృక్షో రక్షతి రక్షితః' అని ఉమారాణి పేర్కొంటూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్ఓ నిఖిత, ఆర్డీవో వీణ పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • సంక్షేమ పథకాల అమలుకై ఈనెల 30న ఇందిరా పార్క్ వద్ద జరిపే నిరాహార దీక్షలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనిలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయ వంతం చేయండి ఈనెల 30 తారీఖున నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం నాడు పాపన్నపేట్ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 30న తలపెట్టిన నిరాహార దీక్షను విజయవంతం కోసం జిల్లా నుండి భారీగా తరలివెళ్దామని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అల్లారం సుమన్ పిలుపునిచ్చారుఈకార్యక్రమంలో జిల్లా ,మండల నాయకులు ,కార్యకర్తలు ఉన్నారు.జిల్లా దండోరా ప్రధాన కార్యదర్శి అల్లరాంసుమన్ ఎన్నికలప్పుడు దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అమీలు నెరవేర్చడం లో జాప్యం చేస్తున్నాదని ఆరోపించారు.మంగళవారం పాపన్నపేటలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఏం ఆర్ పిఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాపయ్య ,వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ పిలుపుమేరకు హమీల అమలుకోసంఇందిరాపార్కువద్దతలపెట్టినధర్నవిజయవంతంచేయాలనిళ్లఉ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర లింగం మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లారం సుమన్ మాదిగ బాచుపల్లి ఎల్లం బాచుపల్లి శరత్ మహిళా అధ్యక్షురాలు బాచుపల్లి లక్ష్మి మాదిగ గుల్ల ప్రసాద్ గుడికి చంద్రం కుంట ప్రకాష్ కుంట బిక్షపతి వడ్ల భూషణం బూస మహేష్ వట్టెం శివయ్య వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గం కార్యకర్తలు అధిక సంఖ్యలోపాల్గోనివిజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు.
    1
    సంక్షేమ పథకాల అమలుకై ఈనెల 30న ఇందిరా పార్క్ వద్ద జరిపే నిరాహార దీక్షలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనిలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయ వంతం చేయండి
ఈనెల 30 తారీఖున నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం నాడు పాపన్నపేట్ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 30న తలపెట్టిన నిరాహార దీక్షను  విజయవంతం కోసం జిల్లా నుండి భారీగా తరలివెళ్దామని  ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అల్లారం సుమన్ పిలుపునిచ్చారుఈకార్యక్రమంలో  జిల్లా ,మండల నాయకులు ,కార్యకర్తలు ఉన్నారు.జిల్లా దండోరా ప్రధాన కార్యదర్శి అల్లరాంసుమన్ ఎన్నికలప్పుడు దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అమీలు నెరవేర్చడం లో  జాప్యం చేస్తున్నాదని ఆరోపించారు.మంగళవారం పాపన్నపేటలో విలేకరులతో మాట్లాడిన ఆయన  ఏం ఆర్ పిఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాపయ్య ,వర్కింగ్  ప్రెసిడెంట్ మోహన్ పిలుపుమేరకు హమీల అమలుకోసంఇందిరాపార్కువద్దతలపెట్టినధర్నవిజయవంతంచేయాలనిళ్లఉ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర లింగం మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లారం సుమన్ మాదిగ బాచుపల్లి ఎల్లం బాచుపల్లి శరత్ మహిళా అధ్యక్షురాలు బాచుపల్లి లక్ష్మి మాదిగ గుల్ల ప్రసాద్ గుడికి చంద్రం కుంట ప్రకాష్ కుంట బిక్షపతి వడ్ల భూషణం బూస మహేష్ వట్టెం శివయ్య వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గం కార్యకర్తలు అధిక సంఖ్యలోపాల్గోనివిజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా 5వ రోజు సోమవారం పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామి వారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు.శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
    1
    వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా 5వ రోజు సోమవారం పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామి వారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు.శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • శివంపేట్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. భారత్ గ్యాస్ సెంటర్ వద్ద సిలిండర్ కోసం ప్రజలు భారీగా క్యూలు కడుతున్నారు. మండు ఎండలను కూడా లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.ఇంకా గ్యాస్ కష్టాలు తిప్పలు తగ్గకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా లోపంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    శివంపేట్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. భారత్ గ్యాస్ సెంటర్ వద్ద సిలిండర్ కోసం ప్రజలు భారీగా క్యూలు కడుతున్నారు. మండు ఎండలను కూడా లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.ఇంకా గ్యాస్ కష్టాలు తిప్పలు తగ్గకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా లోపంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    11 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 22 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలోని ఈద్గా వద్ద మరియు ప్రజ్ఞాపూర్ లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ఈద్-ఉల్-ఫితుర్ ఈద్ ముబారక్ తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి మీకు మీ కుటుంబ సభ్యులకు ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని కోరుకుంటున్నాను క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ రంజాన్ పండుగ మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రేమ శాంతి సంపదలతో మీ ఇంట్లో సంతోషాలను నింపాలని, రంజాన్ నింపే స్ఫూర్తి నిరంతరం ఉండాలని, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మైనార్టీలకు రక్షణ ఉండేది అన్నారు, కెసిఆర్ గారు మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. షాదీ ముబారక్ తో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆసరాగా ఉన్నారన్నారు. ఇమా మోజోన్లకు సగరవేతరణం చెల్లించాలన్నారు, తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ సోదరులందరికీ రంజాన్ తోఫా తో పాటు ఇఫ్తార్ విందులను ఇచ్చారన్నారు, తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో దాదాపు పదివేల కోట్ల రూపాయలతో మైనార్టీల సంక్షేమం జరిగిందన్నారు, చిరు వ్యాపారులకు 100% సబ్సిడీతో రుణాలను అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు, 3110 మంది యువకులకు స్వయం ఉపాధి కల్పించి శిక్షణ ఇచ్చారన్నారు, 1744 మందికి ఆటోలు 940 మందికి క్యాబ్ లు ఇచ్చి ఆదుకున్నారన్నారు, మహిళల ఉపాధికి చేయూత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారన్నారు దాదాపు గజ్వేల్ లోనే 420 కుట్టుమిషన్లు ఇచ్చారన్నారు, అనాథల కోసం 39 కోట్ల రూపాయలతో అనీసులు గుర్భ కార్యక్రమాన్ని చేపట్టి పేదలను ఆదుకున్నారన్నారు, రూపాయలు 8.48 కోట్లతో మక్కా మసీదు పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారన్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 205 మైనార్టీ గురుకులాలు, 204 జూనియర్ కళాశాలలో లక్షలాదిమంది విద్యార్థులకు ఒక్క విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు చేసి నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించి హాస్టల్ వసతులను కల్పించిన ఘనత కేసిఆర్ ది అన్నారు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 3310 మంది విదేశీ విద్యకు 20 లక్షల చొప్పున సాయం అందించిన ఘనత కేసిఆర్ ది అన్నారు, మైనార్టీ స్టడీ సర్కిస్తూ తొమ్మిది 9313 మందికి ఉచిత శిక్షణ ఇచ్చిన ఘనత కేసీఆర్ది అన్నారు గజ్వేల్ పట్టణంలో మైనార్టీల సంక్షేమం కోసం దాదాపు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారన్నారు, మదీనా మస్జిద్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, షాదీ ఖానా నిర్మాణం, ఈద్గాకు స్థలాల కేటాయింపు, మహిళల కోసం 420 కుట్టు మిషన్లు పంపిణీ, రంజాన్ తోఫా, మైనార్టీ బంధు, లాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి ఫలాలను గజ్వేల్ పట్టణంలో అందించిన ఘనత కేసీఆర్ గారిది అన్నారు. అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలకు చేసింది శూన్యమన్నారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు, ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గాలికి వదిలేసారని కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందని మండిపడ్డారు రంజాన్ తోఫాలు అందించడంలో పూర్తిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్నారు, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే రంజాన్ తోఫాలు ఇవ్వడం చాలా దారుణం అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రంజాన్ తోఫాలను తమ ఇంటి నుంచి ఇవ్వడం లేదని ప్రభుత్వ ఖజానా నుండి ఇస్తున్నారని ఆ మాట మరిచి కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఇస్తున్నారని,పేద ముస్లింలకు ఇవ్వకుండా విస్మరించడం చాలా దారుణమని మండిపడ్డారు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముస్లిం మైనార్టీల ఆర్థిక పరిస్థితిని దిగజార్చే విధంగా పాలన విధానాలు ఉన్నాయని మండిపడ్డారు, ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమ పట్టని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తమ వక్రబుద్ధిని మార్చుకొని ప్రజలందరినీ సమానంగా చూడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు విరాసత్ అలీ, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కియోద్దీన్, మాజీ సదర్ సయ్యద్ యూసుఫోదీన్ , కౌన్సిలర్ను బొగ్గుల స్వప్న సురేష్, కాముణి మురళి,మామిడి శ్రీధర్, కప్ప మమతా సంతోష్, మాజీ కౌన్సిలర్లు రహీం, చీర్ల మల్లేశం గుంటూరు రాజు నాయకులు జాఫర్ ఖాన్, అజీజ్, మాజీ ఎంపిటిసి రియాజ్ స్వామి, స్వామి చారి, హనుమంత్ రెడ్డి పుల్ల బీరయ్య , బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 22 ప్రజా తెలంగాణ న్యూస్/
గజ్వేల్ పట్టణంలోని ఈద్గా వద్ద మరియు ప్రజ్ఞాపూర్ లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ఈద్-ఉల్-ఫితుర్ ఈద్ ముబారక్ తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి 
మీకు మీ కుటుంబ సభ్యులకు ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు 
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని కోరుకుంటున్నాను 
క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ రంజాన్ పండుగ మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రేమ శాంతి సంపదలతో మీ ఇంట్లో సంతోషాలను నింపాలని, రంజాన్ నింపే స్ఫూర్తి నిరంతరం ఉండాలని, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు  ఈద్ ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు
మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మైనార్టీలకు రక్షణ ఉండేది  అన్నారు, కెసిఆర్ గారు మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. 
షాదీ ముబారక్ తో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆసరాగా ఉన్నారన్నారు. ఇమా మోజోన్లకు సగరవేతరణం చెల్లించాలన్నారు, తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ సోదరులందరికీ రంజాన్ తోఫా తో పాటు ఇఫ్తార్ విందులను ఇచ్చారన్నారు, తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో దాదాపు పదివేల కోట్ల రూపాయలతో మైనార్టీల సంక్షేమం జరిగిందన్నారు, చిరు వ్యాపారులకు 100% సబ్సిడీతో రుణాలను అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు, 3110 మంది యువకులకు స్వయం ఉపాధి కల్పించి శిక్షణ ఇచ్చారన్నారు, 1744 మందికి ఆటోలు 940 మందికి క్యాబ్ లు ఇచ్చి ఆదుకున్నారన్నారు, మహిళల ఉపాధికి చేయూత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారన్నారు దాదాపు గజ్వేల్ లోనే 420 కుట్టుమిషన్లు ఇచ్చారన్నారు, అనాథల కోసం 39 కోట్ల రూపాయలతో అనీసులు గుర్భ కార్యక్రమాన్ని చేపట్టి పేదలను ఆదుకున్నారన్నారు, రూపాయలు 8.48 కోట్లతో మక్కా మసీదు పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారన్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 205 మైనార్టీ గురుకులాలు,  204 జూనియర్ కళాశాలలో లక్షలాదిమంది విద్యార్థులకు ఒక్క విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు చేసి నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించి హాస్టల్ వసతులను కల్పించిన ఘనత కేసిఆర్ ది అన్నారు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 3310 మంది విదేశీ విద్యకు 20 లక్షల చొప్పున సాయం అందించిన ఘనత కేసిఆర్ ది అన్నారు, మైనార్టీ స్టడీ సర్కిస్తూ తొమ్మిది 9313 మందికి ఉచిత శిక్షణ ఇచ్చిన ఘనత కేసీఆర్ది అన్నారు 
గజ్వేల్ పట్టణంలో మైనార్టీల సంక్షేమం కోసం  దాదాపు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారన్నారు, మదీనా మస్జిద్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, షాదీ ఖానా నిర్మాణం, ఈద్గాకు స్థలాల కేటాయింపు, మహిళల కోసం 420  కుట్టు మిషన్లు పంపిణీ, రంజాన్ తోఫా, మైనార్టీ బంధు, లాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి ఫలాలను గజ్వేల్ పట్టణంలో అందించిన ఘనత కేసీఆర్ గారిది అన్నారు.
అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలకు చేసింది శూన్యమన్నారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు, ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గాలికి వదిలేసారని కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందని మండిపడ్డారు రంజాన్ తోఫాలు అందించడంలో పూర్తిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్నారు, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే రంజాన్ తోఫాలు ఇవ్వడం చాలా దారుణం అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రంజాన్ తోఫాలను తమ ఇంటి నుంచి ఇవ్వడం లేదని ప్రభుత్వ ఖజానా నుండి ఇస్తున్నారని ఆ మాట మరిచి కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే  ఇస్తున్నారని,పేద ముస్లింలకు ఇవ్వకుండా విస్మరించడం చాలా దారుణమని మండిపడ్డారు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముస్లిం మైనార్టీల ఆర్థిక పరిస్థితిని దిగజార్చే విధంగా పాలన విధానాలు ఉన్నాయని మండిపడ్డారు, ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమ పట్టని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తమ వక్రబుద్ధిని మార్చుకొని ప్రజలందరినీ సమానంగా చూడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు విరాసత్ అలీ, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కియోద్దీన్, మాజీ సదర్ సయ్యద్ యూసుఫోదీన్ , కౌన్సిలర్ను బొగ్గుల స్వప్న సురేష్, కాముణి మురళి,మామిడి శ్రీధర్, కప్ప మమతా సంతోష్, మాజీ కౌన్సిలర్లు రహీం, చీర్ల మల్లేశం గుంటూరు రాజు నాయకులు జాఫర్ ఖాన్, అజీజ్, మాజీ ఎంపిటిసి రియాజ్ స్వామి, స్వామి చారి, హనుమంత్ రెడ్డి పుల్ల బీరయ్య , బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    23 hrs ago
  • జగిత్యాల. పలు సమస్యలపై ప్రజలనుండి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్, అధికారులు  ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.   ఈ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్  అధికారులతో మాట్లాడుతూ....పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అర్జీలను  ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 46 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని  సూచించారు.
    1
    జగిత్యాల.
పలు సమస్యలపై ప్రజలనుండి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్, అధికారులు 
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు.
సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.  
ఈ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్  అధికారులతో మాట్లాడుతూ....పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అర్జీలను  ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 46 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని  సూచించారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • జగిత్యాల, మార్చి 23: జగిత్యాల పట్టణంలోని ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూం అర్బన్ కాలనీ (నూకపల్లి) సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ భారీగా చెత్తను పడేయడం, తరచుగా దానిని కాల్చడం వల్ల విషపూరిత పొగ, దుర్వాసన కాలనీ అంతటా వ్యాపిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, దగ్గు, అలర్జీలతో బాధపడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వైద్య ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు చేసి విసుగొచ్చిన కాలనీ వాసులు, ఈ పరిస్థితుల్లో అక్కడ నివసించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించకపోతే తాము అక్కడ ఉండలేమని, లేకపోతే తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ప్రస్తుతం కొనసాగుతున్న చెత్త కాల్చే చర్యలను తక్షణమే నిలిపివేసి, ఇప్పటికే ఉన్న మంటలను ఆర్పివేసి పొగ వ్యాప్తిని అరికట్టాలని కోరుతున్నారు. లేకపోతే, ఆందోళనలు, నిరసనలు మరియు చట్టపరమైన చర్యలు చేపట్టడం తప్ప మరో మార్గం ఉండదని కాలనీ వాసులు హెచ్చరించారు.
    4
    జగిత్యాల, మార్చి 23:
జగిత్యాల పట్టణంలోని ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూం అర్బన్ కాలనీ (నూకపల్లి) సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ భారీగా చెత్తను పడేయడం, తరచుగా దానిని కాల్చడం వల్ల విషపూరిత పొగ, దుర్వాసన కాలనీ అంతటా వ్యాపిస్తున్నాయి.
దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, దగ్గు, అలర్జీలతో బాధపడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వైద్య ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు.
ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు చేసి విసుగొచ్చిన కాలనీ వాసులు, ఈ పరిస్థితుల్లో అక్కడ నివసించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించకపోతే తాము అక్కడ ఉండలేమని, లేకపోతే తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, ప్రస్తుతం కొనసాగుతున్న చెత్త కాల్చే చర్యలను తక్షణమే నిలిపివేసి, ఇప్పటికే ఉన్న మంటలను ఆర్పివేసి పొగ వ్యాప్తిని అరికట్టాలని కోరుతున్నారు.
లేకపోతే, ఆందోళనలు, నిరసనలు మరియు చట్టపరమైన చర్యలు చేపట్టడం తప్ప మరో మార్గం ఉండదని కాలనీ వాసులు హెచ్చరించారు.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • కామారెడ్డిలో సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ సబ్ ప్లాన్ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ తాహెర్, ప్రధాన కార్యదర్శి బొక్కల సంతోష్ డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డిలో సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ సబ్ ప్లాన్ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ తాహెర్, ప్రధాన కార్యదర్శి బొక్కల సంతోష్ డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.