Shuru
Apke Nagar Ki App…
ఎన్నికల సామాగ్రి పంపిణీకి సిద్ధం లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో జరిగే స్థానిక ఎన్నికలకు సంబంధించి గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. తాలూకా పరిధిలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల సామాగ్రిని సిబ్బంది సిద్దం చేశారు. ఒకటి రెండు రోజుల్లో సామాగ్రిని పంపిస్తామని అధికారులు తెలిపారు.
P.G.Murthy
ఎన్నికల సామాగ్రి పంపిణీకి సిద్ధం లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో జరిగే స్థానిక ఎన్నికలకు సంబంధించి గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. తాలూకా పరిధిలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల సామాగ్రిని సిబ్బంది సిద్దం చేశారు. ఒకటి రెండు రోజుల్లో సామాగ్రిని పంపిస్తామని అధికారులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- వికారాబాద్ లో నిర్వహించిన డిసిసి అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు డాన్స్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిసిసి అధ్యక్షుల ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతులమీదగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న బొజ్జు డాన్స్ చేస్తూ మెమోరాండం పొందారు.1
- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం పరిధిలో పెంచికల్పేట్, చింతలమానెపల్లి, బెజ్జూర్, కౌటాల మండలాల్లో కాముడు హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. హోలీకి ఒక రోజు ముందే కోలాటాలు, నృత్యాలతో సంబరాలు జరిపి, సాయంత్రం చేనులో సంప్రదాయంగా కాముడు దహనం చేశారు. మరుసటి రోజు బూడిదను ఇంటి ముందు చల్లడం ఆనవాయితీ. సహజ రంగులతో రెండు రోజుల పాటు పండుగను ఆనందంగా జరుపుకున్నారు1
- *మరో బస్సు ప్రమాదం.....ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 10 మందికి గాయాలు!* తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఏపీ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న నిడదవోలు ఆర్టీసీ బస్సు రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1
- Post by Ravi Poreddy1
- Post by Golem Venkatesham Patel3
- Post by Gajapally Narsaiah1
- ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ఫకీర్ నాయక్ తండలో Holi సందర్భంగా కామదహనం వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించారు. సాయంత్రం గ్రామస్తులు ఒకేచోట చేరి సంప్రదాయ పద్ధతిలో కట్టెలతో చుట్టం ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అగ్ని ప్రతిష్ఠ చేశారు. అనంతరం కామదహనం నిర్వహించగా, గ్రామస్తులు అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ కుటుంబ సుఖశాంతులు, పంటలాభాలు కోరుకున్నారు. యువత డోలు వాయిద్యాలు, డీజే సౌండ్స్తో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు ప్రత్యేక వంటకాలు తయారు చేసి పరస్పరం పంచుకున్నారు. శాంతిభద్రతల నడుమ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేడుకలు విజయవంతంగా ముగిశాయి. గ్రామంలో హోలీ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగుతున్నాయి.1
- గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ కార్మికులు క్షేమంగా ఉన్నారని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అధ్యక్షులు కల్లెడ భూమయ్య తెలిపారు. అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దుబాయ్ నుండి ఆయన మాట్లాడారు. దుబాయ్ లో యుద్ధ శబ్దాలు వినబడుతున్నాయని, అమెరికా సంబంధిత ఆస్తులపై ఇరాన్ దాడులు చేస్తుందన్నారు. అక్కడ పనిచేస్తున్న తెలంగాణ భారత కార్మికుల క్షేమంగా ఉన్నారని, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంతో పాటు తెలంగాణలో ఉన్న గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. దుబాయ్ అధికారులు కూడా తమకు సహకరించి హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు.1