Shuru
Apke Nagar Ki App…
ఐనవోలు దేవస్థానానికి 30 రోజుల్లో రూ.1.49 కోట్ల ఆదాయం హన్మకొండ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గత 30 రోజుల్లో మొత్తం రూ.1,49,28,081 ఆదాయం సమకూరింది. హుండీ ద్వారా రూ.38,73,858, వివిధ ఆర్థిక సేవా టికెట్ల ద్వారా రూ.1,10,54,223 వసూలైనట్లు అధికారులు తెలిపారు. మిశ్రమ వెండి, బంగారాన్ని హుండీలోనే వేసి సీల్ చేసి భద్రపరిచినట్లు ఈవో సుధాకర్ వెల్లడించారు.
M D Azizuddin
ఐనవోలు దేవస్థానానికి 30 రోజుల్లో రూ.1.49 కోట్ల ఆదాయం హన్మకొండ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గత 30 రోజుల్లో మొత్తం రూ.1,49,28,081 ఆదాయం సమకూరింది. హుండీ ద్వారా రూ.38,73,858, వివిధ ఆర్థిక సేవా టికెట్ల ద్వారా రూ.1,10,54,223 వసూలైనట్లు అధికారులు తెలిపారు. మిశ్రమ వెండి, బంగారాన్ని హుండీలోనే వేసి సీల్ చేసి భద్రపరిచినట్లు ఈవో సుధాకర్ వెల్లడించారు.
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గత 30 రోజుల్లో మొత్తం రూ.1,49,28,081 ఆదాయం సమకూరింది. హుండీ ద్వారా రూ.38,73,858, వివిధ ఆర్థిక సేవా టికెట్ల ద్వారా రూ.1,10,54,223 వసూలైనట్లు అధికారులు తెలిపారు. మిశ్రమ వెండి, బంగారాన్ని హుండీలోనే వేసి సీల్ చేసి భద్రపరిచినట్లు ఈవో సుధాకర్ వెల్లడించారు.1
- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో దొంగలు హల్చల్ తాళం వేసి ఉన్న ఆవుల సంపత్ ఇంట్లో 5 తులాల బంగారం,లక్ష యాభై వేల నగదు అపహరణ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.1
- వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సును ఏకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ చర్యలు చేపట్టింది. పర్యాటకుల కోసం బోటు షికారు, కాటేజీలు, అంతర్గత రహదారులు, టాయిలెట్లు వంటి సౌకర్యాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పనులతో పాకాల సరస్సు పర్యాటక ఆకర్షణగా మారనుంది.2
- వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పాకాల సరస్సును ఏకో టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రకృతి సోయగాలను కాపాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. వరంగల్ అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాకాల సరస్సులో బోటు షికారును మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదనంగా పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాయిలెట్ల మరమ్మత్తులు చేపడుతున్నట్లు వివరించారు. పర్యావరణానికి హాని కలగకుండా, సహజ వనరులను సంరక్షిస్తూ ఏకో టూరిజం ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబాలతో వచ్చే సందర్శకులకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధి చర్యలతో పాకాల సరస్సు ప్రాంతానికి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.2
- మహబూబాబాద్ జిల్లా:కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడెం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బంగారి నరేష్, తన కుమారుడు లక్కీతో కలిసి గుండం రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో తండ్రీకొడుకులిద్దరూ కలిసి లయబద్ధంగా డ్యాన్స్ చేశారు. తండ్రీకొడుకులు ఇలా కలిసి డ్యాన్స్ చేయడం చూడటానికి ఎంతో కనువిందుగా ఉందని స్థానికులు ప్రశంసించారు. చిన్న వయసులోనే లక్కీ ప్రదర్శించిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1
- ఎస్సారెస్పీ అధికారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. చేసిన పనులకు కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించడంలో జాప్యంపై జగిత్యాల జిల్లా మెట్ పల్లి కార్యాలయ ఆస్తులు జప్తుకు ఆదేశాలు జారీచేసింది. గాయత్రి ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ వారు 2002 లో మెట్ పల్లి ప్రాంతంలో ఎస్సారెస్పీ కెనాల్ లో రెండు ప్యాకేజీల క్రింద పనులు చేపట్టారు. ఆ పనులకు సంబంధించి 51 కోట్ల బకాయి. చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. 2018 లో క్రింది కోర్టు డబ్బులు చెల్లించాలని ఆర్డర్ ఇచ్చింది. అయినా బకాయిలు చెల్లించలేదు. దీంతో కంపెనీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించడంతో 2021లో పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రంగారెడ్డి కోర్టులో కేసు నడుస్తుంది. డబ్బులు చెల్లించాలని ఆర్డర్ వచ్చినప్పటికీ ఎస్సారెస్పీ అధికారులు బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడంతో మరోసారి కాంట్రాక్ట్ కంపెనీ కోర్టును ఆశ్రయించడంతో మెట్ పల్లి ఎస్సారెస్పీ కార్యాలయ ఆస్తులు జప్తుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్ తో కంపెనీ ప్రతినిధులు మెట్ పల్లి సివిల్ కోర్ట్ అధికారులు ఎస్సారెస్పీ కార్యాలయానికి చేరారు. బకాయిలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయని,వారంలో బకాయిలు చెల్లిస్తామని రాతపూర్వకంగా ఎస్సారెస్పీ అధికారులు స్పష్టం చేయడంతో కంపెనీ ప్రతినిధులు కోర్టు అధికారులు వెనుతిరిగారు.1
- *BNN న్యూస్ :-* సాహసానికి, స్వాభిమానానికి నిలువెత్తు రూపం *ఛత్రపతి శివాజీ మహారాజ్* గారి జయంతి సందర్భంగా నేడు దేవరకొండ పట్టణంలో నిర్వహించిన శోభయాత్రలో పాల్గొని,ఆ మరాఠా యోధునికి ఘన నివాళులర్పించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పాటించిన ధర్మనిరతి, సర్వమత సమభావన నేటికీ ఆచరణీయమని, వారు చూపిన బాట తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు.1
- హన్మకొండ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హన్మకొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ వ్యక్తిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఆ వ్యక్తి బస్సు కింద పడిపోవడంతో రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి.తీవ్ర గాయాల పాలైన బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1