Shuru
Apke Nagar Ki App…
కడప జిల్లాలోని 23 కేంద్రాలలో తక్కువ ధరకే బియ్యం: జాయింట్ కలెక్టర్ కడప జిల్లాలోని 23 కేంద్రాల్లో తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం విక్రయిస్తామని జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనా తెలిపారు. స్టీమ్ రైస్ కిలో రూ.52, రా బియ్యాన్ని కిలో రూ.50 చొప్పున రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 26కేజీ లు ఇస్తారని చెప్పారు. ఎర్రగుంట్ల,ప్రొద్దుటూరు రైతుబజార్లతో పాటు కడపలోని రిలయన్స్,విశాల్ మార్ట్, బద్వేల్లోని ప్రసాద్ రైస్ మిల్లులో బియ్యం పొందవచ్చు.
LAKKU SIVA SANKAR reddy
కడప జిల్లాలోని 23 కేంద్రాలలో తక్కువ ధరకే బియ్యం: జాయింట్ కలెక్టర్ కడప జిల్లాలోని 23 కేంద్రాల్లో తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం విక్రయిస్తామని జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనా తెలిపారు. స్టీమ్ రైస్ కిలో రూ.52, రా బియ్యాన్ని కిలో రూ.50 చొప్పున రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 26కేజీ లు ఇస్తారని చెప్పారు. ఎర్రగుంట్ల,ప్రొద్దుటూరు రైతుబజార్లతో పాటు కడపలోని రిలయన్స్,విశాల్ మార్ట్, బద్వేల్లోని ప్రసాద్ రైస్ మిల్లులో బియ్యం పొందవచ్చు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సరి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ట్రేక్కింగ్ శ్రీ సత్యసాయి జిల్లా,బత్తలపల్లి మండలం డీ. చర్లపల్లి సమీపంలోని కొండల్లో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదివారం అనుచరులతో కలిసి ట్రెక్కింగ్ చేశారు. ప్రకృతి ఒడిలో సాగే ఈ యాత్ర శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. అనంతరం కొండపైన అక్కమ్మ గార్ల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది. కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.1
- బద్వేలు, ఆగస్టు 01: స్మార్ట్ కిచెన్ పేరుతో బద్వేలు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు టి.నాగేంద్ర బాబు ఆరోపించారు.బద్వేలులోని స్థానిక ఎమ్మార్సీ వద్ద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వేలాపాలా లేకుండా నాణ్యతలేని భోజనాన్ని ఇష్టారాజ్యంగా అందజేయడాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, ఎస్ఎఫ్ఐ నాయకులు టి.నాగేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసిన స్మార్ట్ కిచెన్ విధానంలో భాగంగా బద్వేలు మండల పరిధిలోని చిన్నకేశం పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేశారన్నారు. స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసినప్పటి నుండి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. అలాగే సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా భోజనాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలల షెడ్యూల్ ప్రకారం 12.15 నిమిషాలకు విద్యార్థులకు భోజనాన్ని అందజేయాల్సి ఉండగా పలు పాఠశాలల్లో 2 గంటలు దాటిన తర్వాత కూడా భోజనం సరఫరా చేస్తున్నారన్నారు. స్మార్ట్ కిచెన్ వారు భోజన సరఫరాకు తగినన్ని వాహనాలు, తగినన్ని వంట పాత్రలు ఏర్పాటు చేసుకోకపోవడం మూలాన దూర ప్రాంతాలకు చాలా ఆలస్యంగా భోజనం అందుతున్నదన్నారు. భోజనం ఆలస్యం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ పలు పాఠశాలల్లో కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తారని, భోజనం ఆలస్యమైనప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తినే అవకాశం కూడా లేదన్నారు. బద్వేల్ మండలంలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఐదారుసార్లు మండల పరిధిలోని విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భోజనం సరఫరా చేశారన్నారు. భోజనం కోసం పిల్లలు గంటలు గంటలు నిరీక్షించాల్సి రావడం దారుణమన్నారు. స్మార్ట్ కిచెన్ నిర్వాహకులు మెనూ కూడా సక్రమంగా అనుసరించడం లేదని, వారి ఇష్టారాజ్యంగా భోజనం పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం స్మార్ట్ కిచెన్ ద్వారా నెరవేరడం లేదని పేర్కొన్నారు. రుచి లేని ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డిస్తున్నారని వారు ఆరోపించారు. గంటలు గంటలు ఆలస్యం కావడం వల్ల పాఠశాలల్లో తరగతులు కూడా విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పత్రికల్లో కథనాలు వచ్చాయని, సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఆరోపణలపై విచారణకు వచ్చారని తెలిపారు. అయినప్పటికీ పరిస్థితులలో ఎలాంటి మార్పులు లేవని వారు ఆరోపించారు. మెనూ ప్రకారం వారంలో రెండు మార్లు గుడ్డు కూర, మూడు సార్లు ఉడకబెట్టిన గుడ్డును అందజేయాల్సి ఉండగా, గుడ్డు కూర ఇవ్వకుండా ఉడకబెట్టిన గుడ్డును అందజేస్తున్నారన్నారు. ఈ విషయంలో బద్వేలు మండల విద్యాశాఖ అధికారి సక్రమంగా స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకొని నాణ్యమైన భోజనాన్ని, కాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్, విద్యా శాఖ మంత్రి కి ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సి.సుధాకర్, నాయకులు రామాంజనేయులు, అబ్దుల్ రెహమాన్, రాజు, భాష తదితరులు పాల్గొన్నారు.1
- పుంగనూరు రోటరీ సెంటర్ క్లబ్ కు డైమండ్ సెవెన్ స్టార్ అవార్డు ఆదివారం బెంగళూరులోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3191 , సమావేశము నందు పుంగనూరు రోటరీ సెంటర్ క్లబ్ కు డైమండ్ 7 స్టార్ అవార్డు వచ్చినట్లు సంబంధిత ప్రెసిడెంట్ తెలియజేశారు. అవార్డును పుంగనూరు రోటరీ సెంటర్ 2025- 26 ప్రెసిడెంట్ నాన్ బాల్ గణేష్ , సెక్రటరీ సిఎస్ రాజారెడ్డి , అసిస్టెంట్ గవర్నర్ భాస్కర్ జట్టు ,2026-27 ప్రెసిడెంట్ శివశంకర్ , అసిస్టెంట్ గవర్నర్ అనిల్ కుమార్ చాప్టర్ ప్రెసిడెంట్ విజయ కుమారి, డాక్టర్ ప్రభాకర్ , ట్రెజరర్ పురుషోత్తం , పాల్గొని డిస్టిక్ గవర్నర్ బిఆర్ శ్రీధర్ చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు.1
- చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిలో అదుపుతప్పి లారీ బోల్తా ముద్దనూరు మండల పరిధిలోని చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై తీవ్ర ప్రమాదం తృప్తిలో తప్పింది. నెల్లూరు నుంచి కర్ణాటకలోని బళ్లారికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.అయితే లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ప్రాణపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.1