logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదివాసీ వేడుకల్లో అధికారుల సందడి.. గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే, కలెక్టర్ నృత్యం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమాల్లో గిరిజనులు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ మకరంద్ సంప్రదాయ నృత్యంలో పాల్గొని సందడి చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గిరిజన కళాకారులతో కలిసి నృత్యం చేయడంతో కార్యక్రమ ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తమ అభిమానాన్ని చాటిన ఈ దృశ్యాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. కార్యక్రమానికి హాజరైన ప్రజలు అధికారుల నృత్యాన్ని ఆసక్తిగా తిలకిస్తూ చప్పట్లతో అభినందించారు.

23 hrs ago
user_తుడుం జితేందర్
తుడుం జితేందర్
Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
23 hrs ago

ఆదివాసీ వేడుకల్లో అధికారుల సందడి.. గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే, కలెక్టర్ నృత్యం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమాల్లో గిరిజనులు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ మకరంద్ సంప్రదాయ నృత్యంలో పాల్గొని సందడి చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గిరిజన కళాకారులతో కలిసి నృత్యం చేయడంతో కార్యక్రమ ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తమ అభిమానాన్ని చాటిన ఈ దృశ్యాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. కార్యక్రమానికి హాజరైన ప్రజలు అధికారుల నృత్యాన్ని ఆసక్తిగా తిలకిస్తూ చప్పట్లతో అభినందించారు.

More news from Telangana and nearby areas
  • కరీంనగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్‌పై దాడి పరామర్శించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీకాంత్‌పై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. ​దాడుల సంస్కృతిని తెచ్చింది బీజేపీనే: గంగుల కమలాకర్ ​మేయర్ పీఠం ఇస్తే దాడులా? కరీంనగర్ ప్రజలు బీజేపీకి మేయర్ పదవిని కట్టబెడితే, వారు నగరంలో 'దాడుల సంస్కృతి'కి తెరలేపారని గంగుల కమలాకర్ మండిపడ్డారు. ​గతంలో బీఆర్ఎస్ రెండు పర్యాయాలు మేయర్ పీఠం అధిరోహించినా, అలాగే కాంగ్రెస్ హయాంలోనూ కరీంనగర్‌లో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన సుపరిపాలన అందించామని గుర్తుచేశారు. ​కక్షసాధింపు చర్యలు: బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలలో తిరుగుతున్నాడనే అక్కసుతోనే బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు తన అనుచరులతో కలిసి రోడ్డుపై శ్రీకాంత్‌పై ఇనుప రాడ్లతో పాశవికంగా దాడి చేశారని ఆరోపించారు. శ్రీకాంత్ చనిపోయాడని భావించి వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. ​కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ప్రశ్నలు...పోలీసుల తీరుపై ప్రశంసలు కరీంనగర్ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు? కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పార్టీలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా?" అని గంగుల ప్రశ్నించారు. ​గతంలో తన కార్యాలయంపై దాడి జరిగినప్పుడే హోం మంత్రి హోదాలో ఉన్నవారు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే, నేడు ఇలాంటి దాడులు పునరావృతం కాకపోయేవని అన్నారు. ​కిసాన్ నగర్‌లో తాము రోడ్లు వేయిస్తే, బీజేపీ నాయకులు రాడ్లతో ప్రజలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. గెలిచి మూడు నెలలు కూడా కాకముందే దాడులకు తెరలేపారని ధ్వజమెత్తారు. ​పోలీసుల పనితీరు: పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏ పార్టీవారైనా సరే చట్టం ముందు శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. ​అభివృద్ధి వర్సెస్ విధ్వంసం ​కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్‌ను రూ.1,650 కోట్లతో అత్యద్భుతంగా, సురక్షితమైన 'స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్దామని తెలిపారు. ​కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ నగరానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారనుకుంటే, కేవలం దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ​కరీంనగర్ ఎప్పుడూ శాంతియుతంగా, సేఫ్ సిటీగా ఉండాలని ఆకాంక్షించారు. ​బీఆర్ఎస్ శ్రేణులకు పూర్తి భరోసా. ​బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ తన కార్యకర్తలకు అండగా ఉంటుందని భెరోసా కల్పించారు. కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే కరీంనగర్‌కు రానున్నట్లు తెలిపారు. ​రెండేళ్లలో ఈ ప్రభుత్వం తొలగిపోతుంది, ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తాము. మేము కూడా ప్రతిదాడులు చేయము కానీ చట్టం ముందే దోషులను నిలబెడతాము" అని హెచ్చరించారు. ​ఈ ఘటనపై కేంద్ర మంత్రి స్పందించి, హింసకు పాల్పడిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే గంగుల తో పాటు బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    2
    కరీంనగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్‌పై దాడి పరామర్శించిన మాజీ
 మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీకాంత్‌పై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు.
​దాడుల సంస్కృతిని తెచ్చింది బీజేపీనే: గంగుల కమలాకర్
​మేయర్ పీఠం ఇస్తే దాడులా? కరీంనగర్ ప్రజలు బీజేపీకి మేయర్ పదవిని కట్టబెడితే, వారు నగరంలో 'దాడుల సంస్కృతి'కి తెరలేపారని గంగుల కమలాకర్ మండిపడ్డారు.
​గతంలో బీఆర్ఎస్ రెండు పర్యాయాలు మేయర్ పీఠం అధిరోహించినా, అలాగే కాంగ్రెస్ హయాంలోనూ కరీంనగర్‌లో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన సుపరిపాలన అందించామని గుర్తుచేశారు.
​కక్షసాధింపు చర్యలు:
బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలలో తిరుగుతున్నాడనే అక్కసుతోనే బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు తన అనుచరులతో కలిసి రోడ్డుపై శ్రీకాంత్‌పై ఇనుప రాడ్లతో పాశవికంగా దాడి చేశారని ఆరోపించారు. శ్రీకాంత్ చనిపోయాడని భావించి వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు.
​కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ప్రశ్నలు...పోలీసుల తీరుపై  ప్రశంసలు 
కరీంనగర్ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు? కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పార్టీలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా?" అని గంగుల ప్రశ్నించారు. ​గతంలో తన కార్యాలయంపై దాడి జరిగినప్పుడే హోం మంత్రి హోదాలో ఉన్నవారు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే, నేడు ఇలాంటి దాడులు పునరావృతం కాకపోయేవని అన్నారు.
​కిసాన్ నగర్‌లో తాము రోడ్లు వేయిస్తే, బీజేపీ నాయకులు రాడ్లతో ప్రజలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. గెలిచి మూడు నెలలు కూడా కాకముందే దాడులకు తెరలేపారని ధ్వజమెత్తారు.
​పోలీసుల పనితీరు:
పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏ పార్టీవారైనా సరే చట్టం ముందు శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు.
​అభివృద్ధి వర్సెస్ విధ్వంసం
​కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్‌ను రూ.1,650 కోట్లతో అత్యద్భుతంగా, సురక్షితమైన 'స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్దామని తెలిపారు.
​కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ నగరానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారనుకుంటే, కేవలం దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
​కరీంనగర్ ఎప్పుడూ శాంతియుతంగా, సేఫ్ సిటీగా ఉండాలని ఆకాంక్షించారు.
​బీఆర్ఎస్ శ్రేణులకు పూర్తి భరోసా.
​బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ తన కార్యకర్తలకు అండగా ఉంటుందని భెరోసా కల్పించారు. కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే కరీంనగర్‌కు రానున్నట్లు తెలిపారు.
​రెండేళ్లలో ఈ ప్రభుత్వం తొలగిపోతుంది, ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తాము. మేము కూడా ప్రతిదాడులు చేయము కానీ చట్టం ముందే దోషులను నిలబెడతాము" అని హెచ్చరించారు.
​ఈ ఘటనపై కేంద్ర మంత్రి స్పందించి, హింసకు పాల్పడిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే గంగుల తో పాటు బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    43 min ago
  • దళితుల సంక్షేమానికి కాంగ్రెస్‌ కృషి..సామాజిక న్యాయం,రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం : కవ్వంపల్లి దళితులు,బహుజనుల సంక్షేమం,సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం చైర్మన్‌,మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదిలాబాద్‌లోని టీఎన్‌జీవో ఫంక్షన్‌హాల్‌లో జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ముందు కలెక్టర్‌ చౌరస్తాలో కొమురం భీం,అంబేడ్కర్‌ చౌరస్తాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పుల చప్పుళ్లతో ర్యాలీగా సమావేశ వేదిక వద్దకు చేరుకున్నారు. నూతనంగా నియమితులైన జిల్లా,మండల ఎస్సీ విభాగం నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్‌ జాదవ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తోందన్నారు.అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు,సన్నబియ్యం,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,చేయూత పింఛన్లు,ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో దళితులకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి జిల్లా,రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేసి దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నరేష్‌ జాదవ్‌ పిలుపునిచ్చారు. దళిత కుటుంబాలను కలుసుకుని కాంగ్రెస్‌ విధానాలను వివరించాలని కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. దళితుల ఐక్యతతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి కృషి చేయాలని అన్నారు. దళితులు,మైనారిటీలు,గిరిజనులు ఐక్యంగా రాజ్యాంగ హక్కులు,సామాజిక న్యాయం కోసం పోరాడాలని కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సమావేశంలో జాతీయ ఎస్సీ విభాగం కోఆర్డినేటర్‌ సిద్ధార్థ హితంబ్రే, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌,ఆడే గజేందర్‌,సాజిద్‌ఖాన్‌,అల్లూరి సంజీవరెడ్డి,పరమేశ్వర్‌,దుర్గం శేఖర్‌,అల్లూరి సంజీవరెడ్డి,మాజీ డీసీసీ సాజిద్‌ఖాన్‌,ఆసిఫాబాద్‌ ఇన్‌ఛార్జి శ్యామ్‌నాయక్‌,తదితరులు పాల్గొన్నారు.
    1
    దళితుల సంక్షేమానికి కాంగ్రెస్‌ కృషి..సామాజిక న్యాయం,రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం : కవ్వంపల్లి
దళితులు,బహుజనుల సంక్షేమం,సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం చైర్మన్‌,మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదిలాబాద్‌లోని టీఎన్‌జీవో ఫంక్షన్‌హాల్‌లో జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ముందు కలెక్టర్‌ చౌరస్తాలో కొమురం భీం,అంబేడ్కర్‌ చౌరస్తాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పుల చప్పుళ్లతో ర్యాలీగా సమావేశ వేదిక వద్దకు చేరుకున్నారు. నూతనంగా నియమితులైన జిల్లా,మండల ఎస్సీ విభాగం నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్‌ జాదవ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తోందన్నారు.అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు,సన్నబియ్యం,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,చేయూత పింఛన్లు,ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో దళితులకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి జిల్లా,రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేసి దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నరేష్‌ జాదవ్‌ పిలుపునిచ్చారు. దళిత కుటుంబాలను కలుసుకుని కాంగ్రెస్‌ విధానాలను వివరించాలని కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. దళితుల ఐక్యతతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి కృషి చేయాలని అన్నారు. దళితులు,మైనారిటీలు,గిరిజనులు ఐక్యంగా రాజ్యాంగ హక్కులు,సామాజిక న్యాయం కోసం పోరాడాలని కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సమావేశంలో జాతీయ ఎస్సీ విభాగం కోఆర్డినేటర్‌ సిద్ధార్థ హితంబ్రే, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌,ఆడే గజేందర్‌,సాజిద్‌ఖాన్‌,అల్లూరి సంజీవరెడ్డి,పరమేశ్వర్‌,దుర్గం శేఖర్‌,అల్లూరి సంజీవరెడ్డి,మాజీ డీసీసీ సాజిద్‌ఖాన్‌,ఆసిఫాబాద్‌ ఇన్‌ఛార్జి శ్యామ్‌నాయక్‌,తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    1 hr ago
  • *దళితులు, బహుజనుల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి* - **కవ్వంపల్లి*సత్య నారాయణ గారు* *ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో దళితులకు ఎక్కువ అవకాశం కల్పించాం* - డీసీసీ డా నరేశ్ జాదవ్ gaaru *ఆదిలాబాద్‌లో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం విస్తృత సమావేశం* ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని TNGO ఫంక్షన్ హాల్‌ లో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ మరియు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, జాతీయ కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ సిద్ధార్థ హితంబ్రే గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ గారు, డీసీసీ డా నరేష్ జాదవ్ గారు ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మొదటగా కలెక్టర్ చౌరస్తాలోని కొమరం భీం విగ్రహానికి పూల మాల తో నివాళులు అర్పించి అక్కడి నుండి అంబేద్కర్ చౌరస్తా లో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాలతో నివాళులర్పించి అక్కడి నుండి డప్పుల చప్పుడు తో ర్యాలీగా TNGO గార్డెన్ లో వేదిక వద్దకు చేరుకున్నారు. వేదిక వద్ద చేరుకున్న వేరు బౌద్ధ సంప్రదాయంలో అంబేద్కర్ గారి విగ్రహం పూల తో నివాళులు అర్పించారు. నూతనంగా నియమించబడ్డ జిల్లా కాంగ్రెస్ ఎస్సి విభాగం కమిటీకి మరియు నూతనంగా నియమించ బడ్డ ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ విభాగ మండల అధ్యక్షులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా డీసీసీ డా నరేష్ జాదవ్ గారు మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన పాలించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక పాత్ర పోషించిందన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలు, డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు, సామాజిక సమానత్వం వంటి విలువలను ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్ప గా మార్చిందని గత ప్రభుత్వా పాలనలో అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం ముఖ్యంగా దళితులు, బహుజన వర్గాలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లు ఇచ్చిందని,రేషన్ కార్డు ల ద్వారా ఉచిత సన్న బియ్యం పంపిణి,మహిళలకు ఫ్రీ బస్, చేయూత పెన్షన్ లు,అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నమాని పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని డీసీసీ డా నరేష్ జాదవ్ గారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో కూడా దళితులకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామని డీసీసీ డా నరేష్ జాదవ్ గారు తెలిపారు. డీసీసీ జనరల్ బాడీలో దళితులకు పెద్దపీట వేయడంతో పాటు, మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా దళిత నాయకులకు పార్టీ టికెట్లు కేటాయించడం సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్ర ఎస్సీ విభాగం చైర్మన్ శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ విభాగం మరింత బలోపేతమై, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తుందని ఆయన అన్నారు . గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఎస్సీ విభాగాన్ని మరింత పటిష్టం చేసి, దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలనిఆదిలాబాద్ డీసీసీ ఎస్సీ విభాగ చైర్మన్ పరమేశ్వర్ గారికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం ప్రతి కార్యకర్త చురుకైన పాత్ర పోషించాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్ గారిని, అలాగే కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన రాష్ట్ర ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ గారిని డీసీసీ డా నరేష్ జాదవ్ గారు అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం దళిత విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, జాతీయ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఎస్సీ విభాగాన్ని పునర్నిర్మించి మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. దళితులందరూ ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే బీజేపీకి గెలిచే అవకాశమే ఉండదని శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ విభాగం నాయకులు దళితులను కాంగ్రెస్ పార్టీ వైపు చైతన్యపరిచే విధంగా గ్రామస్థాయి నుంచి విస్తృతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో దళిత కుటుంబాలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీ విధానాలను, సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న కృషిని వివరించాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో దళితుల జనాభా 20 శాతానికి పైగా ఉందని, రాబోయే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ఎస్సీ విభాగం నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ విభాగాన్ని మరింత బలోపేతం చేసి, పార్టీ విజయానికి దళిత ఓటర్లను సమీకరించడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ హక్కులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు దళితులు, మైనారిటీలు, గిరిజనులు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య, సామాజిక న్యాయ విలువలకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు ఈ సమావేశంలో వారి తో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య గారు,బోథ్ నియోజకవర్గం ఇంచార్జి ఆడే గజేందర్ గారు,మాజీ డీసీసీ సాజిద్ ఖాన్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి గారు,ఆసిఫాబాద్ ఇంచార్జి శ్యామ్ నాయక్ గారు, అదిలాబాద్ ఎస్సి డిపార్ట్మెంట్ పార్లమెంట్ కోఆర్డినేటర్ సమతా సుదర్శన్ గారు,బోథ్ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్య నారాయణ గారు,ఇచ్చోడా మార్కెట్ చైర్మన్ కుంరం సత్యవతి కోటేష్ గారు, జైనథ్ మార్కెట్ చైర్మన్ అశోక్ రెడ్డి గారు,ఆత్మ డైరెక్టర్ లు కౌడాలా నారాయణ గారు, గిమ్మ సంతోష్ రావు గారు,సేవా దళ్ అధ్యక్షులు మోతి రామ్ గారు, మైనారిటీ అధ్యక్షులు షాహిద్ అలీ గారు, ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్ గారు, సెద్మకి ఆనంద్ రావు,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గిమ్మ దీపక్ గారు, చంద్రయ్య గారు, బ్రీజులాల్ గారు, బొల్లారం బాబన్న గారు, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లు మల్యాల కరుణాకర్ గారు, అక్తర్ అలీ గారు, దేవిదాస్ chary గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి గారు, జిల్లా కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్ గారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    2
    *దళితులు, బహుజనుల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి* - 

**కవ్వంపల్లి*సత్య నారాయణ గారు* 
*ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో దళితులకు ఎక్కువ అవకాశం కల్పించాం* - డీసీసీ డా నరేశ్ జాదవ్ gaaru
*ఆదిలాబాద్‌లో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం విస్తృత సమావేశం* 
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని TNGO ఫంక్షన్ హాల్‌ లో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ మరియు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, జాతీయ కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ సిద్ధార్థ హితంబ్రే గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ గారు, డీసీసీ డా నరేష్ జాదవ్ గారు ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మొదటగా కలెక్టర్ చౌరస్తాలోని కొమరం భీం విగ్రహానికి పూల మాల తో నివాళులు అర్పించి అక్కడి నుండి అంబేద్కర్ చౌరస్తా లో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాలతో నివాళులర్పించి  అక్కడి నుండి డప్పుల చప్పుడు తో ర్యాలీగా TNGO గార్డెన్ లో వేదిక వద్దకు చేరుకున్నారు. వేదిక వద్ద చేరుకున్న వేరు బౌద్ధ సంప్రదాయంలో అంబేద్కర్ గారి విగ్రహం పూల తో నివాళులు అర్పించారు. నూతనంగా నియమించబడ్డ జిల్లా కాంగ్రెస్ ఎస్సి విభాగం కమిటీకి మరియు నూతనంగా నియమించ బడ్డ ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ విభాగ మండల అధ్యక్షులకు నియామక పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా డీసీసీ డా నరేష్ జాదవ్ గారు మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన పాలించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక పాత్ర పోషించిందన్నారు.
మహాత్మా గాంధీ ఆశయాలు, డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు, సామాజిక సమానత్వం వంటి విలువలను ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్ప గా మార్చిందని గత ప్రభుత్వా పాలనలో అర్హులైన  పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం ముఖ్యంగా దళితులు, బహుజన వర్గాలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లు ఇచ్చిందని,రేషన్ కార్డు ల ద్వారా ఉచిత సన్న బియ్యం పంపిణి,మహిళలకు ఫ్రీ బస్, చేయూత పెన్షన్ లు,అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నమాని పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని డీసీసీ డా నరేష్ జాదవ్ గారు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో కూడా దళితులకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామని డీసీసీ డా నరేష్ జాదవ్ గారు తెలిపారు. డీసీసీ జనరల్ బాడీలో దళితులకు పెద్దపీట వేయడంతో పాటు, మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా దళిత నాయకులకు పార్టీ టికెట్లు కేటాయించడం సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు.
రాష్ట్ర ఎస్సీ విభాగం చైర్మన్ శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ విభాగం మరింత బలోపేతమై, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తుందని ఆయన అన్నారు . గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఎస్సీ విభాగాన్ని మరింత పటిష్టం చేసి, దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలనిఆదిలాబాద్ డీసీసీ ఎస్సీ విభాగ చైర్మన్ పరమేశ్వర్ గారికి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం ప్రతి కార్యకర్త చురుకైన పాత్ర పోషించాలని సమావేశంలో పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్ గారిని, అలాగే కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన రాష్ట్ర ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ గారిని డీసీసీ డా నరేష్ జాదవ్ గారు అభినందించారు.
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం దళిత విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, జాతీయ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఎస్సీ విభాగాన్ని పునర్నిర్మించి మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
దళితులందరూ ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే బీజేపీకి గెలిచే అవకాశమే ఉండదని శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ విభాగం నాయకులు దళితులను కాంగ్రెస్ పార్టీ వైపు చైతన్యపరిచే విధంగా గ్రామస్థాయి నుంచి విస్తృతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో దళిత కుటుంబాలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీ విధానాలను, సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న కృషిని వివరించాలని పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ జిల్లాలో దళితుల జనాభా 20 శాతానికి పైగా ఉందని, రాబోయే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ఎస్సీ విభాగం నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ విభాగాన్ని మరింత బలోపేతం చేసి, పార్టీ విజయానికి దళిత ఓటర్లను సమీకరించడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ హక్కులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు దళితులు, మైనారిటీలు, గిరిజనులు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య, సామాజిక న్యాయ విలువలకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు
ఈ సమావేశంలో వారి తో  పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య గారు,బోథ్ నియోజకవర్గం ఇంచార్జి ఆడే గజేందర్ గారు,మాజీ డీసీసీ సాజిద్ ఖాన్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి గారు,ఆసిఫాబాద్ ఇంచార్జి శ్యామ్ నాయక్ గారు, అదిలాబాద్ ఎస్సి డిపార్ట్మెంట్ పార్లమెంట్ కోఆర్డినేటర్ సమతా సుదర్శన్ గారు,బోథ్ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్య నారాయణ గారు,ఇచ్చోడా మార్కెట్ చైర్మన్ కుంరం సత్యవతి కోటేష్ గారు, జైనథ్ మార్కెట్ చైర్మన్ అశోక్ రెడ్డి గారు,ఆత్మ డైరెక్టర్ లు కౌడాలా నారాయణ గారు, గిమ్మ సంతోష్ రావు గారు,సేవా దళ్ అధ్యక్షులు మోతి రామ్ గారు, మైనారిటీ అధ్యక్షులు షాహిద్ అలీ గారు, ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్ గారు, సెద్మకి ఆనంద్ రావు,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గిమ్మ దీపక్ గారు, చంద్రయ్య గారు, బ్రీజులాల్ గారు, బొల్లారం బాబన్న గారు, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లు మల్యాల కరుణాకర్ గారు, అక్తర్ అలీ గారు, దేవిదాస్ chary గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి గారు, జిల్లా కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్ గారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ఈశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: సింగర్ మంగ్లీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని మంగ్లీ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు మంగ్లీకి ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న మంగ్లీ, ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానులు ఆమెను ఆసక్తిగా గమనించారు.
    2
    ఈశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: సింగర్ మంగ్లీ 
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని మంగ్లీ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు మంగ్లీకి ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న మంగ్లీ, ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానులు ఆమెను ఆసక్తిగా గమనించారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • జైల్ భరో విజయవంతానికి గోదావరిఖనిలో 2K రన్ : తుమ్మల రాజారెడ్డి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెండే శ్రీనివాస్ గోదావరిఖని సిఐటియు ఆఫీసు శ్రామిక భవన్ నుండి కూరగాయల మార్కెట్ వరకు... ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గోదావరిఖని పారిశ్రామిక కార్మికులు, యువత, ప్రజల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి గారు 2k రన్ జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ... క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు రైతులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల హక్కులను హరిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి ఎన్టీపీసీ తదితర సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ, 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల రైతుల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు, కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మెండె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపెల్లి జిల్లా కోశాధికారి ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, వంగల శివరాం రెడ్డి, నంది నారాయణ, దుర్గాప్రసాద్, జనార్దన్ రెడ్డి, అఖిల్, కుంభం కిషన్, కే సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
    1
    జైల్ భరో విజయవంతానికి గోదావరిఖనిలో 2K రన్ : తుమ్మల రాజారెడ్డి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మెండే శ్రీనివాస్ 
గోదావరిఖని సిఐటియు ఆఫీసు శ్రామిక భవన్ నుండి కూరగాయల మార్కెట్ వరకు... ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గోదావరిఖని పారిశ్రామిక కార్మికులు, యువత, ప్రజల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి గారు 2k రన్ జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ... క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు రైతులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల హక్కులను హరిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి ఎన్టీపీసీ తదితర సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ, 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల రైతుల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు, కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మెండె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపెల్లి జిల్లా కోశాధికారి ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, వంగల శివరాం రెడ్డి, నంది నారాయణ, దుర్గాప్రసాద్, జనార్దన్ రెడ్డి, అఖిల్, కుంభం కిషన్, కే సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    22 hrs ago
  • During their interaction with Prime Minister Narendra Modi , the CWG 2026 winners shared their experiences with him and highlighted how the Sports Authority of India (SAI) and initiatives like Khelo India supported them throughout their journey.
    1
    During their interaction with Prime Minister Narendra Modi
, the CWG 2026 winners shared their experiences with him and highlighted how the Sports Authority of India (SAI) and initiatives like Khelo India supported them throughout their journey.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా. *మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ కి వచ్చే పర్యాటకుల భద్రతకు చర్యలు.* *పర్యాటకులు పోలీస్ వారి సూచనలు, హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలి.* *మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ.* తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. *పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.* ఎస్పీ గారి వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా.

*మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ కి వచ్చే పర్యాటకుల భద్రతకు  చర్యలు.*

*పర్యాటకులు పోలీస్ వారి సూచనలు, హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలి.*

*మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ.*
తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు.
ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.
*పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.*
ఎస్పీ గారి వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • ఉద్రిక్తంగా మారిన జైల్ భరో కార్యక్రమం.. వామపక్ష నేతల అరెస్ట్ ADB: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదిలాబాద్ పట్టణంలో వామపక్ష ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేసిన నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ ను తరలించారు.
    1
    ఉద్రిక్తంగా మారిన జైల్ భరో కార్యక్రమం.. వామపక్ష నేతల అరెస్ట్
ADB: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదిలాబాద్ పట్టణంలో వామపక్ష ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేసిన నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ ను తరలించారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.