Shuru
Apke Nagar Ki App…
*అధిక ఫీజుల దోపిడీ చేస్తున్న శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యాసంస్థలను తొక్కినారతీయండి....A1 గా నేనే ఉంటా....* *తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగం మరియు యువజన విభాగానికి ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
JADI RAJU
*అధిక ఫీజుల దోపిడీ చేస్తున్న శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యాసంస్థలను తొక్కినారతీయండి....A1 గా నేనే ఉంటా....* *తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగం మరియు యువజన విభాగానికి ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
More news from తెలంగాణ and nearby areas
- బెంగళూరులోని మడివాళలో ఉన్న కృపానిధి కళాశాల కేంద్రంలో CET పరీక్షకు హాజరైన ఒక విద్యార్థి ఇలా అన్నాడు: "నేను ఉదయం సుమారు 9:40 గంటలకు పరీక్షా కేంద్రానికి వెళ్లాను. నా బ్యాగును గదిలో ఉంచాను, కానీ నా 'జంధ్యం' (Janeu) కనిపించడంతో వారు నన్ను లోపలికి అనుమతించలేదు. మీరు దానిని తీసివేయాలని వారు చెప్పడం మొదలుపెట్టారు. ఒకవేళ మీరు దానిని తీసివేయకపోతే, పరీక్ష రాయడానికి మిమ్మల్ని అనుమతించలేమని వారు స్పష్టం చేశారు... మరో ఏడుగురు విద్యార్థులను కూడా వారి జంధ్యాలను తీసివేయమని కోరారు. మాకు వేరే మార్గం లేకపోవడంతో మేము వాటిని తీసివేశాము... నాకు చాలా బాధ కలిగింది. నేను CET పరీక్షను సరిగ్గా రాయలేకపోయాను." ఇది నిజంగా చాలా సిగ్గుచేటు ఇలాంటి విధానాల పట్ల ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ సెక్యులరిజం పేరుతో మాట వినకపోతే బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది జాగో హిందూ జాగో హిందువులారా మేల్కొనండి ఇలాంటి ధర్మ వ్యతిరేక కార్యకలాపాల పట్ల నిరసన గళం వినిపించండి చేయి చేయి కలుపుదాం మన దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుందాం. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో విద్యార్థి రచర్ల కార్తీక్ (19) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతుడు భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు 132 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోందని సమాచారం. తన కుమారుడు చిన్నప్పటి నుంచి హాస్టళ్లలోనే చదువుకున్నాడని, ఆత్మహత్య చేసుకునే స్వభావం లేదని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో సీసీటీవీలు పనిచేయకపోవడం, ఘటనపై స్పష్టత లేకపోవడం, మృతదేహాన్ని తాము వచ్చేసరికే పోస్టుమార్టంకు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆత్మహత్య అని ఎలా నిర్ధారించారని ప్రశ్నిస్తున్నారు.1
- పెట్రోల్ డీజిల్ కొరత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తుంది. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంధన కొరత తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బంకుల వద్ద గంటల కొద్ది వేచి చూస్తున్నారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తుండడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట లో డీజిల్ తో పాటు పెట్రోల్ దొరకదనే అనుమానం తో బంకుల వద్ద వాహనదారులు భారీ క్యూ కట్టారు. శంకరపట్నం మండల కేంద్రం లో డీజిల్ ట్యాంకర్ వచ్చిందన్న సమాచారంతో భారీగా క్యాన్ తో క్యూ కట్టరు వాహనదారులు, రైతులు. అత్యవసర పనుల నిమిత్తం వెళ్ళే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంధన కొరత లేకుండా చూడాలనీ వాహనదారులు కోరుతున్నారు.1
- చిన్న కూతురు, తల్లి పరిస్థితి విషమం, ఆసుపత్రిలో చికిత్స ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం బుర్హాన్పురం ప్రాంతంలో భార్య రమ్య, కూతుళ్లు దివ్య నైనీ(5), దీక్షలతో నివాసం ఉంటూ, ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్న అనంతనగర్ ప్రాంతానికి చెందిన కొణతల రాము(29) అనే వ్యక్తి నాలుగు రోజులుగా భర్తకు ఎవరు ఫోన్ చేసినా అనారోగ్యంతో ఉన్నాడని అందుకే తాను మాట్లాడుతున్నానని చెబుతున్న రమ్య ఆదివారం ఉదయం పక్కింటి మహిళ వచ్చి పిలవగా దుప్పటి కప్పుకుని వచ్చి తలుపు తీసిన రమ్య, దుర్వాసన ఏంటని అడగగా ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని అందుకే శుభ్రం చేయలేదని సమాధానం ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి తలుపు కొట్టగా ఎంతకూ స్పందించకపోవడం, ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన రమ్య సోదరుడు తలుపులు పగలగొట్టి చూడగా మంచం కింద రాము, దివ్యనైనీ మృతదేహాలు, పక్కనే రమ్య, దీక్ష అపస్మారక స్థితిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు పరిస్థితి విషమంగా ఉండడంతో రమ్య, దీక్షలను ఆసుపత్రికి తరలింపు రమ్య తన భర్త, కూతురిని హతమార్చి మూడురోజులుగా మృతదేహాలతో ఉంటూ, చిన్నకూతురిని సైతం హత్య చేసేందుకు ప్రయత్నించిందని, విషయం బయట పడుతుందని భయంతో తాను కూడా ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల అనుమానం కారణాలు చెప్పడానికి రమ్య నిరాకరించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన పోలీసులు1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలో నేషనల్ హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థినులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అభినందించారు. ఈ సందర్భంగా వారు దేశ స్థాయిలో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు క్రీడా జర్సీలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరచాలని, క్రీడల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు.1
- హిందూ ఏక్తా యాత్రలో మంగళవారం రోజున పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు పాల్గొనాలని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అందరిని ఆహ్వానించారు దాదాపుగా 3,000 మంది హిందూ బంధువులందరూ వచ్చి విజయవంతం చేయాలని హనుమాన్ల రాజిరెడ్డి సెక్రటరీ కోరారు2
- వరంగల్ జిల్లా,మేడపల్లి గ్రామ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి ఆశీర్వాదంతో *పార్టీ ఆవిర్భావ దినోత్సవా వేడుకలు..ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం లో బి ఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నడిగట్టు వెంకన్న మరియు స్థానిక సర్పంచ్ అర్రేమ్ సాంబయ్య మరియు మాజీ సర్పంచ్ లావుడియా తిరుపతి, మాజీ గ్రామపార్టీ అధ్యక్షుడు వార్డ్ మెంబర్ చింతనూరి సూర్యనారాయణ గౌడ్ ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు ఆవునురి మురళి, అకారపు రాజు, మాజీ టిసి తాళ్లపల్లి సుదర్శన్, మాజీ ఎంపిటిసి పాడియాభద్రు MD ఫాష, వార్డు సభ్యులు తిరుపతి, మరియు ఆవునూరి ఏకాంబరం, పెరుమాండ్ల బసవయ్య ముఖ్యులు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లుగా కూడబెట్టిన అక్రమ సొమ్ము పంచుకోవడంలో కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగానే బిఆర్ఎస్ నేతలు విడిపోయి కొత్త పార్టీలు పెడుతున్నారని ఆరోపించారు. కవిత ఏర్పాటు చేసిన పార్టీ స్వతంత్రం కాదని, అది కేసీఆర్ వ్యూహంలో భాగమని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ రాజకీయ నాటకం నడుస్తోందని విమర్శించారు. అవినీతి సొమ్ము పంపకాలే ఈ పరిణామాలకు కారణమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ ఉనికి కోల్పోతోందని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు.1
- జల్సాలకు అలవాటు పడి, కష్టం లేకుండా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 5 లక్షల నగదు, సుమారు 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం సమక్షంలో అరెస్టు చూపించి వివరాలు వెల్లడించారు. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ గతంలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్ (PD Act) కింద జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మారని యుగేందర్, ఈ నెల 26న మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో దాచి ఉంచిన 5 లక్షల నగదును, ఒక బంగారు చైన్ దొంగిలించి తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు. నమ్మదగిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని దుర్షెడ్ లోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిపి ప్రకటించారు. 24 గంటల్లో చివరిని ఛేదించిన టూటౌన్ సృజన్ రెడ్డితో పాటు ఆయన సిబ్బందిని సిపి అభినందించారు. 4