logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నేషనల్ హ్యాండ్‌బాల్‌కు ఎంపికైన విద్యార్థినులకు ఎమ్మెల్యే వేముల వీరేశం అభినందనలు .... నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలో నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థినులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అభినందించారు. ఈ సందర్భంగా వారు దేశ స్థాయిలో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు క్రీడా జర్సీలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరచాలని, క్రీడల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు.

8 hrs ago
user_Nagesh Kothapalli
Nagesh Kothapalli
Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
8 hrs ago

నేషనల్ హ్యాండ్‌బాల్‌కు ఎంపికైన విద్యార్థినులకు ఎమ్మెల్యే వేముల వీరేశం అభినందనలు .... నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలో నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థినులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అభినందించారు. ఈ సందర్భంగా వారు దేశ స్థాయిలో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు క్రీడా జర్సీలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరచాలని, క్రీడల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలో నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థినులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అభినందించారు. ఈ సందర్భంగా వారు దేశ స్థాయిలో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు క్రీడా జర్సీలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరచాలని, క్రీడల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు.
    1
    నకిరేకల్ నియోజకవర్గo:-
నకిరేకల్ నియోజకవర్గంలో నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థినులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అభినందించారు. ఈ సందర్భంగా వారు దేశ స్థాయిలో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు క్రీడా జర్సీలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరచాలని, క్రీడల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    8 hrs ago
  • *బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత మరియు శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు జలాల్ పురం గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది*
    1
    *బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత మరియు శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు జలాల్ పురం గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది*
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • NLG: నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో అంబేద్కర్ భవనం ఎదుట ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ గేట్ వాల్ మూత లేకుండా ప్రమాదకరంగా ఉంది. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో, వేగంగా వచ్చే వాహనాలు పక్కకు వెళ్లాల్సి వస్తే గుంతలో పడి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారి అంచున తెరుచుకొని ఉన్న గేట్ వాల్ గుంతపై మోత ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
    1
    NLG: నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో అంబేద్కర్ భవనం ఎదుట ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ గేట్ వాల్ మూత లేకుండా ప్రమాదకరంగా ఉంది. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో, వేగంగా వచ్చే వాహనాలు పక్కకు వెళ్లాల్సి వస్తే గుంతలో పడి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారి అంచున తెరుచుకొని ఉన్న గేట్ వాల్ గుంతపై మోత ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    22 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    2 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం జంగవానిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ ఇర్ఫ వారి గుంపులో గ్రామ దేవత (బొడ్రాయి) ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ గొంది సోనీ రాజు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు మంగళహారతులు అందించి, గంగాజలంతో పసుపు, కుంకుమలు కలిపి టెంకాయలు కొట్టి గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. శివసత్తులు అమ్మవారి పూనకాలతో భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    1
    మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం జంగవానిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ ఇర్ఫ వారి గుంపులో గ్రామ దేవత (బొడ్రాయి) ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
స్థానిక సర్పంచ్ గొంది సోనీ రాజు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు మంగళహారతులు అందించి, గంగాజలంతో పసుపు, కుంకుమలు కలిపి టెంకాయలు కొట్టి గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించారు.
శివసత్తులు అమ్మవారి పూనకాలతో భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • చిన్న కూతురు, తల్లి పరిస్థితి విషమం, ఆసుపత్రిలో చికిత్స ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం బుర్హాన్‌పురం ప్రాంతంలో భార్య రమ్య, కూతుళ్లు దివ్య నైనీ(5), దీక్షలతో నివాసం ఉంటూ, ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్న అనంతనగర్ ప్రాంతానికి చెందిన కొణతల రాము(29) అనే వ్యక్తి నాలుగు రోజులుగా భర్తకు ఎవరు ఫోన్ చేసినా అనారోగ్యంతో ఉన్నాడని అందుకే తాను మాట్లాడుతున్నానని చెబుతున్న రమ్య ఆదివారం ఉదయం పక్కింటి మహిళ వచ్చి పిలవగా దుప్పటి కప్పుకుని వచ్చి తలుపు తీసిన రమ్య, దుర్వాసన ఏంటని అడగగా ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని అందుకే శుభ్రం చేయలేదని సమాధానం ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి తలుపు కొట్టగా ఎంతకూ స్పందించకపోవడం, ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన రమ్య సోదరుడు తలుపులు పగలగొట్టి చూడగా మంచం కింద రాము, దివ్యనైనీ మృతదేహాలు, పక్కనే రమ్య, దీక్ష అపస్మారక స్థితిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు పరిస్థితి విషమంగా ఉండడంతో రమ్య, దీక్షలను ఆసుపత్రికి తరలింపు రమ్య తన భర్త, కూతురిని హతమార్చి మూడురోజులుగా మృతదేహాలతో ఉంటూ, చిన్నకూతురిని సైతం హత్య చేసేందుకు ప్రయత్నించిందని, విషయం బయట పడుతుందని భయంతో తాను కూడా ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల అనుమానం కారణాలు చెప్పడానికి రమ్య నిరాకరించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన పోలీసులు
    1
    చిన్న కూతురు, తల్లి పరిస్థితి విషమం, ఆసుపత్రిలో చికిత్స 
ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం  బుర్హాన్‌పురం ప్రాంతంలో భార్య రమ్య, కూతుళ్లు దివ్య నైనీ(5), దీక్షలతో నివాసం ఉంటూ, ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్న అనంతనగర్ ప్రాంతానికి చెందిన కొణతల రాము(29) అనే వ్యక్తి నాలుగు రోజులుగా భర్తకు ఎవరు ఫోన్ చేసినా అనారోగ్యంతో ఉన్నాడని అందుకే తాను మాట్లాడుతున్నానని చెబుతున్న రమ్య
ఆదివారం ఉదయం పక్కింటి మహిళ వచ్చి పిలవగా దుప్పటి కప్పుకుని వచ్చి తలుపు తీసిన రమ్య, దుర్వాసన ఏంటని అడగగా ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని అందుకే శుభ్రం చేయలేదని సమాధానం ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి తలుపు కొట్టగా ఎంతకూ స్పందించకపోవడం, ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన రమ్య సోదరుడు 
తలుపులు పగలగొట్టి చూడగా మంచం కింద రాము, దివ్యనైనీ మృతదేహాలు, పక్కనే రమ్య, దీక్ష అపస్మారక స్థితిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు
పరిస్థితి విషమంగా ఉండడంతో రమ్య, దీక్షలను ఆసుపత్రికి తరలింపు 
రమ్య తన భర్త, కూతురిని హతమార్చి మూడురోజులుగా మృతదేహాలతో ఉంటూ, చిన్నకూతురిని సైతం హత్య చేసేందుకు ప్రయత్నించిందని, విషయం బయట పడుతుందని భయంతో తాను కూడా ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల అనుమానం కారణాలు చెప్పడానికి రమ్య నిరాకరించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన పోలీసులు
    user_Venkatesh
    Venkatesh
    జర్నలిస్ట్ నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,* సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో సంబంధిత అన్ని విభాగాల అధికారులతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, జిల్లావ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగానికి సిఫారసు చేయాలని, ప్రతి దరఖాస్తులు పారదర్శకంగా పరిశీలించాలని, సూచించారు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన అన్ని కార్యక్రమాలను అందరూ సమిష్టిగా విజయవంతం చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో మరింత పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు, ప్రజావాణి దరఖాస్తులను కూడా పరిష్కరించాలని కోరారు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు జరిగే స్వీయ జన గణన కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు తమ పరిధిలో ఉన్న ప్రతి ఉద్యోగులు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు, ప్రజావాణిలో వివిధ శాఖలలో మొత్తం (179) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు, మరిపెడ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 264లో గల 02 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమిని, నిరుపేదలైన సుమారు 30 మంది పాత్రికేయులకు నివాస గృహాల కోసం కేటాయించాలని మరిపెడ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న భూ మార్పిడి, వారసత్వ హక్కులు మరియు ఇతర ధరణి సంబంధిత సమస్యలను పరిష్కరించాలని పలువురు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు మరియు ఆసరా పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారుల నుండి వినతులు అందాయి. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు తాగునీటి సమస్యలపై ప్రజలు కలెక్టర్‌కు విన్నవించారు. ప్రజావాణి కార్యక్రమం సమయం పూర్తి అయిన అదనంగా రెండున్నర గంటల వరకు దరఖాస్తులతో వేచి ఉన్న ప్రజల యొక్క వినుతులను స్వీకరించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, మండల కేంద్రాలలోని గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులకు సమస్యలను వివరించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు, ఈ ప్రజావాణి కార్యక్రమంలో మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారినీ కృష్ణవేణి, జిల్లా పరిషత్ సీఈవో పురుషోత్తం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మధుసూదన రాజు, అన్ని విభాగాల జిల్లా అధికారులు,పర్యవేక్షకులు మదన్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,* సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో సంబంధిత అన్ని విభాగాల అధికారులతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, 
జిల్లావ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగానికి సిఫారసు చేయాలని, ప్రతి దరఖాస్తులు పారదర్శకంగా పరిశీలించాలని, సూచించారు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన అన్ని కార్యక్రమాలను అందరూ సమిష్టిగా విజయవంతం చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో మరింత పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు, ప్రజావాణి దరఖాస్తులను కూడా పరిష్కరించాలని కోరారు.
ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు జరిగే స్వీయ జన గణన కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు తమ పరిధిలో ఉన్న ప్రతి ఉద్యోగులు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు,
ప్రజావాణిలో వివిధ శాఖలలో మొత్తం (179) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు, 
మరిపెడ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 264లో గల 02 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమిని, నిరుపేదలైన సుమారు 30 మంది పాత్రికేయులకు నివాస గృహాల కోసం కేటాయించాలని మరిపెడ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
పెండింగ్‌లో ఉన్న భూ మార్పిడి, వారసత్వ హక్కులు మరియు ఇతర ధరణి సంబంధిత సమస్యలను పరిష్కరించాలని పలువురు రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
కొత్త రేషన్ కార్డుల మంజూరు మరియు ఆసరా పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారుల నుండి వినతులు అందాయి.
డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు తాగునీటి సమస్యలపై ప్రజలు కలెక్టర్‌కు విన్నవించారు.
ప్రజావాణి కార్యక్రమం సమయం పూర్తి అయిన అదనంగా రెండున్నర గంటల వరకు దరఖాస్తులతో వేచి ఉన్న ప్రజల యొక్క వినుతులను స్వీకరించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, మండల కేంద్రాలలోని గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులకు సమస్యలను వివరించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు, 
ఈ ప్రజావాణి కార్యక్రమంలో మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారినీ కృష్ణవేణి,  జిల్లా పరిషత్ సీఈవో పురుషోత్తం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మధుసూదన రాజు, అన్ని విభాగాల జిల్లా అధికారులు,పర్యవేక్షకులు మదన్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    36 min ago
  • నల్లగొండ బ్రేకింగ్: _నాగార్జునసాగర్‌లో మైక్రో ఫైనాన్స్ మృత్యుఘంటికలు బాలాజీ నాయక్, మధు నాయక్ మైక్రో ఫైనాన్స్ కు మరో బాధితుడు బలి.. విజయపురి పోలీస్ స్టేషన్ ముందు మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన, కన్నీటి పర్యంతం.. “అప్పు ఇచ్చి ప్రాణాలు తీసుకుంటున్నారు..?” అంటూ బాధితుల ఆగ్రహావేశం.. బాలాజీ, మధు పేర్లు వినగానే వణికిపోతున్న కుటుంబాలు అని స్థానికుల ఆరోపణ.. తెలంగాణ సర్కార్ వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్..
    2
    నల్లగొండ బ్రేకింగ్:
_నాగార్జునసాగర్‌లో మైక్రో ఫైనాన్స్ మృత్యుఘంటికలు
బాలాజీ నాయక్, మధు నాయక్ మైక్రో ఫైనాన్స్ కు మరో బాధితుడు బలి..
విజయపురి పోలీస్ స్టేషన్ ముందు మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన, కన్నీటి పర్యంతం..
“అప్పు ఇచ్చి ప్రాణాలు  తీసుకుంటున్నారు..?” అంటూ బాధితుల ఆగ్రహావేశం..
బాలాజీ, మధు పేర్లు వినగానే వణికిపోతున్న కుటుంబాలు అని స్థానికుల ఆరోపణ..
తెలంగాణ సర్కార్ వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.