Shuru
Apke Nagar Ki App…
దర్శిలో కనిపిస్తున్న వింత వింత వాతావరణంతో తల పట్టుకుంటున్న ప్రజానీకం దర్శిలో వాతావరణం వింత వింతగా కనిపిస్తోంది. ఆకాశమంత నల్లటి కారు మబ్బులతో కూడుకొని ఉన్నది. రోడ్లపై ఎండ తీవ్రత మరోవైపు కనిపిస్తున్నది. వర్షాకాలం అయినప్పటికీ వర్షాలు పడకపోగా, ఇటువంటి వింత వింత విధానాలతో వాతావరణం కనిపిస్తుంది.
CNR NEWS
దర్శిలో కనిపిస్తున్న వింత వింత వాతావరణంతో తల పట్టుకుంటున్న ప్రజానీకం దర్శిలో వాతావరణం వింత వింతగా కనిపిస్తోంది. ఆకాశమంత నల్లటి కారు మబ్బులతో కూడుకొని ఉన్నది. రోడ్లపై ఎండ తీవ్రత మరోవైపు కనిపిస్తున్నది. వర్షాకాలం అయినప్పటికీ వర్షాలు పడకపోగా, ఇటువంటి వింత వింత విధానాలతో వాతావరణం కనిపిస్తుంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- దర్శిలో కనిపిస్తున్న వింత వింత వాతావరణంతో తల పట్టుకుంటున్న ప్రజానీకం దర్శిలో వాతావరణం వింత వింతగా కనిపిస్తోంది. ఆకాశమంత నల్లటి కారు మబ్బులతో కూడుకొని ఉన్నది. రోడ్లపై ఎండ తీవ్రత మరోవైపు కనిపిస్తున్నది. వర్షాకాలం అయినప్పటికీ వర్షాలు పడకపోగా, ఇటువంటి వింత వింత విధానాలతో వాతావరణం కనిపిస్తుంది.1
- చెరుకుపల్లి మండలంలో దంచి కొడుతున్న వర్షం. రైతులకి ఉపశమనం. చెరుకుపల్లి మండలంలో బుధవారం భారీ వర్షం దంచి కొట్టింది. గడిచిన కొన్ని రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. చాలా రోజుల విరామం తర్వాత ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.ప్రస్తుతం సాగు పనుల్లో నిమగ్నమైన రైతులకు ఈ వర్షం అమృతంతో సమానంగా మారింది. ముఖ్యంగా నారుమడులు వేసి, వరి నాట్లు ప్రారంభించిన రైతులకు ఈ వాన ఎంతో మేలు చేస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీటి కొరతతో ఎండిపోతున్న పైర్లకు జీవం పోసినట్లయిందని, రాబోయే రోజుల్లో నాట్లు వేయడానికి నేల అనుకూలంగా మారుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ వర్షాభావ పరిస్థితులతో దిగులు చెందిన రైతాంగం, ఈ వర్షంతో పొలం పనులను మరింత వేగవంతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.2
- సెయింట్ ఆన్స్ గర్ల్స్ షెల్టర్ హోమ్ను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గుంటూరు (సెప్టెంబర్ 2): గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీ బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు గుంటూరు స్తంభాలగరువులోని 'సెయింట్ ఆన్స్ ఓపెన్ షెల్టర్ హోమ్ ఫర్ గర్ల్స్'ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సయ్యద్ జియాఉద్దీన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా హోమ్లోని బాలికలతో మాట్లాడిన ఆయన, వారికి అందుతున్న ఆహారం, వైద్యం, విద్యా సదుపాయాల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలియనితనంతో తప్పటడుగులు వేసి భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, క్రమశిక్షణతో బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని బాలికలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్, హోమ్ ఇన్ఛార్జ్ వరలక్ష్మి, ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, పారా లీగల్ వాలంటీర్ గీతాంజలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.1
- ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి వైయస్ఆర్ దూరమై 17 ఏళ్లు *నేటికి ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి వైఎస్సార్ దూరమై 17 ఏళ్లు* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి నేటికి 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా, 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంతో నల్లమల అడవుల్లోని రుద్రకొండ సమీపంలో కూలిపోయింది. ప్రమాదం అనంతరం దాదాపు 24 గంటలపాటు భారీ గాలింపు చర్యలు కొనసాగగా, సెప్టెంబర్ 3న హెలికాప్టర్ శిథిలాలను గుర్తించారు. వైఎస్సార్ మరణంతో రాష్ట్రవ్యాప్తంగా విషాదం నెలకొంది.1
- బద్వేలులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. బద్వేలు, సెప్టెంబర్ 02: బద్వేలులో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు మురళి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ కేక్ కటింగ్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు పార్టీకి రాజీనామా...... బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు షేక్ అల్లాబక్షు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. రాజకీయ కారణాల దృశ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సేవ చేయడంలో విఫలమైంది. వైఎస్ఆర్సిపి చేస్తున్నా రాజకీయ వ్యతిరేక పనులపై అసమ్మతి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.1
- రేపల్లెలో ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు. తెలుగు ప్రజల గుండెచప్పుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రేపల్లె పట్టణంలో అత్యంత ఘనంగా జరిగాయి. రేపల్లె వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పీటా నాగమోహన్ కృష్ణ ఆధ్వర్యంలో రేపల్లె బస్టాండ్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పీటా నాగమోహన్ కృష్ణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ చేసిన సేవలను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు. పీటా నాగమోహన్ కృష్ణ మాట్లాడుతూ వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు అజరామరం అన్నారు. తన పరిపాలనతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు పూయించిన మహానాయకుడు అన్నారు. సంక్షేమ పథకాలంటే గుర్తుకువచ్చే ఏకైక పేరు వైఎస్సార్. నిరుపేదల ఆకలి తీర్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. తెలుగు ప్రజల గుండెచప్పుడుగా నిలిచిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మహానేత వైఎస్సార్కు అంజలి ఘటించారు.1
- స్కూల్ బస్సును వెనకనుంచి ఢీ కొట్టిన లారీ... పలువురు విద్యార్థులకు గాయాలు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది. మర్రిచెట్టుపాలెం నుంచి విప్పర్ల వైపు వెళ్తున్న సిబిఐటి స్కూల్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను తక్షణమే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.2