Shuru
Apke Nagar Ki App…
రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది. రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది.
Stv9 Press
రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది. రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆడి కృత్తిక సందర్భంగా పుంగనూరు నుంచి తిరుత్తణికి భారీగా తరలిన భక్తులు ఆడి కృత్తిక సందర్భంగా పట్టణం నుంచి తమిళనాడులోని తిరుత్తణికి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.బుధవారం భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు. "హర హర" నామస్మరణల మధ్య ఊరేగింపుగా నగిరిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి బయలుదేరి స్వామివారికి కావెళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణమయ్యారు.1
- బోయకొండ గంగమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు పుంగనూరు మండల పరిధి వ్యవసాయ మార్కెట్ కు సమీపాన వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం తొలి వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు హోమాలు, నిర్వహించి అమ్మవారిని విశేషంగా అలంకరించారు.ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య గణపతి హోమం, నవగ్రహ హోమం, చండీ హోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అమ్మవారి కృపతో వార్షికోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- గుంతలు లేక మురుగు రోడ్లపైకి.. దోమల బెడదతో ఎస్సీ కాలనీలో నరకం బద్వేలు, ఆగస్టు 05:బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం బెడుసు పల్లిఎస్సీ కాలనీలోపారిశుద్ధ్య సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. ఇళ్ల వద్ద బాత్రూం గుంతలు తవ్వకపోవడం వల్ల మురుగునీరు బయటకు వచ్చి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల ముందే మురుగు కుంటలు కాలనీలో దాదాపు 80 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రతి ఇంటి నుంచి వచ్చే స్నానం, వంట, బాత్రూం నీరు బయటకు పోయేందుకు ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు. కొన్ని దగ్గర డ్రైనేజీ కాలవలు ఉన్న అవి నిరోపయోగంలో ఉన్నాయిగుంతలు కూడా తవ్వకపోవడంతో మురుగునీరు నేరుగా రోడ్లపైకి వచ్చి నిలిచిపోతోంది. రోడ్లపై అడుగు ఎత్తు మురుగు నిలవడంతో ప్రజలు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. ముఖ్యంగా స్కూల్కు వెళ్లే చిన్నపిల్లలు, వృద్ధులు మురుగులో నుంచే వెళ్లాల్సిన దుస్థితి. దుర్గంధం, దోమల బెడద.. అంటువ్యాధుల భయం నిలిచిన మురుగునీటి నుంచి తీవ్రమైన దుర్గంధం వస్తోంది. ఇళ్ల ముందు చెత్త, మురుగు కుళ్లి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రి పూట నిద్రపోలేని పరిస్థితి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. రోజూ దోమల కాటుకు గురవుతున్నాం. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అంటు వ్యాధులు వస్తాయేమోనని భయంగా ఉంది. ఇప్పటికే ఇద్దరు చిన్నపిల్లలకు జ్వరం వచ్చింది" అని కాలనీ వాసులుఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు ఈ సమస్యను గత 6 నెలలుగా పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, ఎంపీపీదృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని గ్రామస్తులు చెబుతున్నారు. వినతిపత్రాలు కూడా ఇచ్చాం కానీ ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. ఎన్నికల ముందు వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ మా కనీస అవసరాలు తీర్చరు. మేము మనుషులం కాదా?" వారు ప్రశ్నిస్తున్నారు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ కాలనీవాసులు ప్రభుత్వసంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు: 1. ప్రతి ఇంటి వద్ద బాత్రూం గుంతలుతవ్వించాలి 2. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి 3. మురుగును తొలగించి బ్లీచింగ్, దోమల మందు పిచికారీ చేయాలి వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సీ కాలనీవాసులకు న్యాయం చేస్తారా? అనేది వేసి చూడాలి.1
- రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన టి. చైతన్యకు మాదిగల జేఏసీ ఘన సన్మానం కడప నగరంలోని బాలాజీ నగర్లో ఉన్న మాదిగల జేఏసీ కార్యాలయంలో బుధవారం మాదిగల జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన శ్రీమతి టి. చైతన్య గారిని, ఆమె భర్త రాజశేఖర్ గారిని ఘనంగా సన్మానించారు. పూల బొకేలు అందజేసి, దుశాలువలు కప్పి అభినందనలు తెలియజేశారు. టి. చైతన్య గారు కడప జిల్లా బి. మఠం మండలం నాగిశెట్టిపల్లె గ్రామానికి చెందిన వారు. ఆమె నవజీవన సేవా ఆశ్రమం సంస్థను నిర్వహిస్తూ కడప నగరంలో పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వృద్ధాశ్రమాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఆమె చేపడుతున్న విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా నియమించింది. ఈ సందర్భంగా టి. చైతన్య గారు మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తానని తెలిపారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించే అక్రమాలు ఎక్కడ జరిగినా వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని చెప్పారు. అలాగే తన సేవా కార్యక్రమాలకు దళిత నాయకులు, ప్రజల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలపల్లె ఓబులపతి, గౌరవ అధ్యక్షులు ఎస్. కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదురూరు బాబు, ప్రచార కార్యదర్శి పచ్చారం బాలసుబ్బయ్య, అధికార ప్రతినిధి గొడుగునూరు మున్నెయ్య, ఉపాధ్యక్షులు పి. సుబ్బారాయుడు, డి. నరసయ్య, కార్యదర్శి తప్పెట హరిబాబు, పైయింటి సునీల్ కుమార్, గద్దె చిన్న నరసింహాలు, డి. వెంకటేష్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు నరేష్తో పాటు కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది. రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది.1
- బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించనున్న మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సినీ నటుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మొపూరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. బుధవారం మొపూరి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ సోమేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకం, అభిషేకం, మహా మృత్యుంజయ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో బాలయ్య అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.1
- దళిత గ్రామాల్లో నెలకొన్న మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మైదుకూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస), కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి. శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు జి. చంద్రశేఖర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జక్కరయ్య మాట్లాడుతూ, జులై 16 నుంచి 26 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన "అసమానతలు లేని సమాజం కోసం సామాజిక శంఖారావం" అధ్యయన యాత్రలో దళితవాడల్లో అనేక సమస్యలు వెలుగుచూశాయని తెలిపారు. మైదుకూరు మండలంలోని 10 గ్రామాల్లో పర్యటించగా, ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు నివసించడం, ఇంటి స్థలాలు, పక్కా ఇళ్లు లేకపోవడం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. అనేక గ్రామాల్లో స్మశాన వాటికలు లేకపోవడం, ఉన్న చోట్ల రోడ్లు, నీటి సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం అభివృద్ధి గురించి చెబుతున్న మాటలకు దళిత గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని విమర్శించారు. "గడపగడపకు టీడీపీ" కార్యక్రమాన్ని దళిత గ్రామాల్లో నిర్వహించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. దళితుల సంక్షేమానికి ఉన్న చట్టాలు ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని, రాజకీయ పార్టీలు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ఆరోపించారు. దళిత గ్రామాల్లోని మౌలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యకాస, కేవీపీఎస్, ఆవాజ్ నాయకులు గురయ్య, షరీఫ్, ఖాదర్ బాషా, రవి, సుధాకర్, ఇమామ్ ఓబులేసు, లక్ష్మీదేవి, తామస్, లక్ష్మయ్య, బాలరాజుతో పాటు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.1
- కుప్పం లో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు* *శ్రీ గంగమ్మ ఆలయ అభివృద్ధిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు* *:కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ ఐఏఎస్* కుప్పం శ్రీ గంగమ్మ ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణానికి సంబంధించి ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్లు, టెలివిజన్ మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా) ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శ్రీ గంగమ్మ ఆలయ అభివృద్ధి అంశంపై సోమవారం సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, రాష్ట్రస్థాయి అధికారులతో సాధారణ సమీక్ష సమావేశం మాత్రమే నిర్వహించామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివిధ నమూనాలు, ప్రతిపాదనలపై చర్చించినప్పటికీ ఎలాంటి తీర్మానం చేయలేదని, పునర్నిర్మాణంపై ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. సుమారు ఏడాదిన్నర క్రితం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. జాతరకు లక్షలాది మంది భక్తులు విచ్చేసే నేపథ్యంలో మరుగుదొడ్లు, మౌలిక వసతులు, పరిసరాల అభివృద్ధి వంటి పనులకు సుమారు రూ.8 నుంచి రూ.9 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, ముఖ్యమంత్రి సహకారంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. సోమవారం నిర్వహించిన సమావేశం పూర్తిగా చర్చల కోసమేనని, ఎలాంటి తీర్మానాలు చేయలేదని, మీడియాకు ప్రకటించే స్థాయిలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని తెలిపారు. ఆలయానికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా అధికారికంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని, ఎలాంటి విషయాన్నీ రహస్యంగా ఉంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వికాస్ మర్మత్ గారు తెలిపారు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటు, రహదారుల విస్తరణ, భూసేకరణ వంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అందువల్లే ప్రస్తుతం కుప్పంలో 32 పరిశ్రమలు ఏర్పడి, సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. అదేవిధంగా రీచ్-2, రీచ్-3 రహదారులు, బస్టాండ్, పార్కులు, పెరిమీటర్ వాల్, చెరువుల అభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, హైమాస్ట్ లైట్లు, డీపీఓఎన్, హార్టికల్చర్, పీ-4, సంజీవని, కేర్ అండ్ గ్రో తదితర కార్యక్రమాలు ప్రజల సహకారంతోనే విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. శ్రీ గంగమ్మ ఆలయం కుప్పం ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని, ప్రతి సంవత్సరం సుమారు ఐదు లక్షల మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి ఆలయానికి విచ్చేస్తారని తెలిపారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయానికి భక్తులకు తగిన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ నెల ఆగస్ట్ 31వ తేదీ వరకు కడ కార్యాలయంలో లిఖితపూర్వకంగా వినతులు, సూచనలు, అభిప్రాయాలు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజల నుంచి అందిన అభిప్రాయాలు, సూచనలను శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీతో సమగ్రంగా చర్చించిన అనంతరం, సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణంపై నిర్ణయం తీసుకోబడుతుంది అని పేర్కొన్నారు.1