Shuru
Apke Nagar Ki App…
"ఏనుగు వంశీయుల భూముల వివాదం: కుంట విద్యాసాగర్ రెడ్డి వాదనలపై వారసుల గళం.. 150 ఎకరాల పంపిణీపై మీడియా ముఖంగా క్లారిటీ. భూములు స్వాధీనంలో ఉన్నవారికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అండగా ఉంటామని వారసుల భరోసా!" సూపర్ భూమి 5.ఎకరాలు ఇచే బదులు 3.ఎకరాలు ఇస్తే ఎక్కువ కుటుంబాలకు మేలు జరుగుతుందని నా అభిప్రాయం కానీ అందులో రెడ్డి పేదలకు ఇస్తే మన పేదవారిని బతికించినవారు అవుతారు కదా వల్ల దృష్టికి తీసుకపోవాలని నా మనవి ..జై రెడ్డి ఏనుగు వంశీయులకు వందనం ఏది ఏమైనా మీరు చేసేది గొప్ప కార్యక్రమం ఎవరి పేరు మీద ఉన్న అది మీ వంశానికి పేరు వస్తుంది కానీ ఒక్కరికి కాదు మీ గొప్ప మనసుకు వందనం ఎప్పుడూ మీవంశం.చల్లగా వర్ధిల్లాలి
M.RAJKIRAN REDDY
"ఏనుగు వంశీయుల భూముల వివాదం: కుంట విద్యాసాగర్ రెడ్డి వాదనలపై వారసుల గళం.. 150 ఎకరాల పంపిణీపై మీడియా ముఖంగా క్లారిటీ. భూములు స్వాధీనంలో ఉన్నవారికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అండగా ఉంటామని వారసుల భరోసా!" సూపర్ భూమి 5.ఎకరాలు ఇచే బదులు 3.ఎకరాలు ఇస్తే ఎక్కువ కుటుంబాలకు మేలు జరుగుతుందని నా అభిప్రాయం కానీ అందులో రెడ్డి పేదలకు ఇస్తే మన పేదవారిని బతికించినవారు అవుతారు కదా వల్ల దృష్టికి తీసుకపోవాలని నా మనవి ..జై రెడ్డి ఏనుగు వంశీయులకు వందనం ఏది ఏమైనా మీరు చేసేది గొప్ప కార్యక్రమం ఎవరి పేరు మీద ఉన్న అది మీ వంశానికి పేరు వస్తుంది కానీ ఒక్కరికి కాదు మీ గొప్ప మనసుకు వందనం ఎప్పుడూ మీవంశం.చల్లగా వర్ధిల్లాలి
- M.RAJKIRAN REDDYAdilabad Rural, Telangana🙏1 hr ago
More news from Telangana and nearby areas
- స్వాధీనంలో ఉన్నవారికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అండగా ఉంటామని వారసుల భరోసా!" సూపర్ భూమి 5.ఎకరాలు ఇచే బదులు 3.ఎకరాలు ఇస్తే ఎక్కువ కుటుంబాలకు మేలు జరుగుతుందని నా అభిప్రాయం కానీ అందులో రెడ్డి పేదలకు ఇస్తే మన పేదవారిని బతికించినవారు అవుతారు కదా వల్ల దృష్టికి తీసుకపోవాలని నా మనవి ..జై రెడ్డి ఏనుగు వంశీయులకు వందనం ఏది ఏమైనా మీరు చేసేది గొప్ప కార్యక్రమం ఎవరి పేరు మీద ఉన్న అది మీ వంశానికి పేరు వస్తుంది కానీ ఒక్కరికి కాదు మీ గొప్ప మనసుకు వందనం ఎప్పుడూ మీవంశం.చల్లగా వర్ధిల్లాలి1
- కుంటాల మండలంలోని వెంకూరు గ్రామానికి చెందిన రైతు నారాయణకు చెందిన మొక్కజొన్న సంచులు రాత్రి దొంగతనానికి గురవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన గ్రామ పెద్దలు, రైతులు, స్థానిక నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు. దొంగలను తక్షణమే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.1
- ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక శనివారం అనూహ్య పరిణామాల మధ్య ఆదివారానికి వాయిదా పడింది. మరోవైపు విపక్ష నాయకులు చలో ఖానాపూర్ కు పిలుపునిచ్చారు. అదే సమయంలో మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు అవుతారోనని అంతటా ఆసక్తి నెలకొంది.1
- నిజామాబాద్, ఏప్రిల్: సరిపడా సౌకర్యాలు లేనప్పటికీ క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా అద్వితీయ ప్రతిభను కలిగి ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ జిల్లాకు చెందిన హుస్సాముద్దీన్, గుగులోత్ సౌమ్య, యెండల సౌందర్య, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నిజామాబాద్ కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారని కొనియాడారు. వీరిని స్పూర్తిగా తీసుకుని క్రీడాకారులు ముందుకుసాగాలని, నిజామాబాద్ జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చీఫ్ మినిస్టర్ కప్ – 2025 క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. వివిధ అంశాలలో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ అభినందిస్తూ, వారికి మెడల్స్, బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. నిజామాబాద్ జిల్లా వాసులైన అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత హుస్సాముద్దీన్, భారత ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ గుగులోత్ సౌమ్యలు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వీరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన అనేక మంది క్రీడాకారులు ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. తాను కూడా కళాశాలలో చదివే రోజుల్లో స్విమ్మింగ్ లో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జిల్లాలో క్రీడా సదుపాయాల మెరుగుదలకు, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంల ఏర్పాటు కోసం జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక కృషి చేస్తామని, వీటి ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. సీ.ఎం కప్ క్రీడా పోటీల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 31,353 మంది క్రీడాకారులు వివిధ దశలలో పాల్గొనడం ద్వారా జిల్లాను మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. 2700 మంది జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో వివిధ అంశాలలో పాల్గొని 53 పతకాలు సాధించడం జరిగిందన్నారు. వీటిలో 12 బంగారు పతకాలు, 11 వెండి పతకాలు, 33 కాంస్య పతకాలు ఉన్నాయని, తద్వారా నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో టాప్–5 లో నిలిచిందని అభినందించారు. కోచ్ లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపాలని కలెక్టర్ ఉద్బోధించారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపితే, అధ్బుత అవకాశాలు దక్కుతాయని, ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని సూచించారు. ఉద్యోగ నియామకాలతో పాటు, ఉన్నత విద్యావకాశాలలోనూ స్పోర్ట్స్ కోటా కింద ప్రవేశాలు పొందవచ్చని అన్నారు. విద్యార్థులను, యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సీ.ఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభను చాటేలా విద్యార్థులను తీర్చిదిద్దిన కోచ్ లను, ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బందిని, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డివైఎస్ఓ పవన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నాగమణి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ బొబ్బిలి నర్సయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్ లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ---------------------------------1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారు 13 రోజుల సెలవుపై వెళ్లిన నేపథ్యంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో శ్రీ అంజనా రెడ్డి గారిని ఇన్చార్జ్ ఈవోగా నియమిస్తూ ఎండోమెంట్స్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్చార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆలయానికి చేరుకున్న అనంతరం, అంజనా రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు.తరువాత ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ జి. శ్రావణ్ కుమార్ గారు, శేషవస్త్రం మరియు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఈవో గారి చాంబర్లో అంజనా రెడ్డి గారు ఇన్చార్జ్ ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు మరియు వేద పండితులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలంలోని రామాలయంలో ఆదివారం నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం ఆధ్యాత్మిక శోభతో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణతో హిందూ ధర్మ సంకీర్తనలకు చేసిన నృత్యాలు, భరతనాట్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం అనంతరం భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.1
- కరీంనగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఓ తల్లి కన్నీటి వేదన కలకలం సృష్టించింది. గత ఏడాది మే 12న తన కొడుకు శ్రీనివాస్ మృతి పై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని ఇప్పటికైనా CID లేదా సిబిఐ విచారణ వెయ్యాలని CM రేవంత్ రెడ్డిని కొంగు చాచి ధర్మారం మండలానికి చెందిన మహిళ రాజమ్మ వేడుకుంది. ఉరి వేసి చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని తల్లి కన్నీటితో వేడుకోవడం చూపరులను ఆవేదనకు గురి చేసింది. వెంటనే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాజమ్మ ను సముదాయించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపిస్తామని, కేసు విషయం పై వివరాలు తెలుపాలని కరీంనగర్ సిపి ని కోరారు. వెంటనే సిపి గౌస్ ఆలం, శ్రీనివాస్ మృతికి సంబంధించిన కేసు తన దృష్టికి వచ్చిందని మరోసారి విచారణ చేయిస్తామని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో రాజమ్మ కొంగుచాచి వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది.1
- My fellow BJP workers are very confident of winning in West Bengal! Proud of their hardwork.1