logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో విత్తన మేళా నిర్వహించారు. ఏడాది ఏడు రకాల సన్న వరి రకాలకు అదనపు బోనస్ ఇవ్వాలని యోచిస్తున్న నేపథ్యంలో, ఈ మేళా ద్వారా రైతులకు సన్న వరి సాగుపై అవగాహన కల్పించారు. తెలంగాణ సోనా, సాంబా మసూరి, కేఎన్ఎం-1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరాం, వీజీఎల్-44, కేఎన్ఎం-7715 రకాల వరికి మార్కెట్ మద్దతు ధరకు (MSP) అదనంగా రూ.500 బోనస్ అందించే అవకాశముందని ఆత్మ కమిటీ సభ్యులు రైతులకు తెలియజేశారు.

5 hrs ago
user_MOHD AKTHAR
MOHD AKTHAR
ఏటూరునాగారం, ములుగు, తెలంగాణ•
5 hrs ago

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో విత్తన మేళా నిర్వహించారు. ఏడాది ఏడు రకాల సన్న వరి రకాలకు అదనపు బోనస్ ఇవ్వాలని యోచిస్తున్న నేపథ్యంలో, ఈ మేళా ద్వారా రైతులకు సన్న వరి సాగుపై అవగాహన కల్పించారు. తెలంగాణ సోనా, సాంబా మసూరి, కేఎన్ఎం-1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరాం, వీజీఎల్-44, కేఎన్ఎం-7715 రకాల వరికి మార్కెట్ మద్దతు ధరకు (MSP) అదనంగా రూ.500 బోనస్ అందించే అవకాశముందని ఆత్మ కమిటీ సభ్యులు రైతులకు తెలియజేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో విత్తన మేళా నిర్వహించారు. ఏడాది ఏడు రకాల సన్న వరి రకాలకు అదనపు బోనస్ ఇవ్వాలని యోచిస్తున్న నేపథ్యంలో, ఈ మేళా ద్వారా రైతులకు సన్న వరి సాగుపై అవగాహన కల్పించారు. తెలంగాణ సోనా, సాంబా మసూరి, కేఎన్ఎం-1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరాం, వీజీఎల్-44, కేఎన్ఎం-7715 రకాల వరికి మార్కెట్ మద్దతు ధరకు (MSP) అదనంగా రూ.500 బోనస్ అందించే అవకాశముందని ఆత్మ కమిటీ సభ్యులు రైతులకు తెలియజేశారు.
    1
    మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో విత్తన మేళా నిర్వహించారు. ఏడాది ఏడు రకాల సన్న వరి రకాలకు అదనపు బోనస్ ఇవ్వాలని యోచిస్తున్న నేపథ్యంలో, ఈ మేళా ద్వారా రైతులకు సన్న వరి సాగుపై అవగాహన కల్పించారు. తెలంగాణ సోనా, సాంబా మసూరి, కేఎన్ఎం-1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరాం, వీజీఎల్-44, కేఎన్ఎం-7715 రకాల వరికి మార్కెట్ మద్దతు ధరకు (MSP) అదనంగా రూ.500 బోనస్ అందించే అవకాశముందని ఆత్మ కమిటీ సభ్యులు రైతులకు తెలియజేశారు.
    user_MOHD AKTHAR
    MOHD AKTHAR
    ఏటూరునాగారం, ములుగు, తెలంగాణ•
    5 hrs ago
  • హనుమకొండ జిల్లా పరకాలలో నిర్వహించిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో, ఎస్.ఐ.ఆర్ (SIR) ప్రక్రియను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు అవసరమైన వ్యూహాత్మక కార్యాచరణపై కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా, పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా, మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ నాయకులను, అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించారు. ప్రతి గులాబీ సైనికుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.
    1
    హనుమకొండ జిల్లా పరకాలలో నిర్వహించిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో, ఎస్.ఐ.ఆర్ (SIR) ప్రక్రియను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు అవసరమైన వ్యూహాత్మక కార్యాచరణపై కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా, పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా, మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ నాయకులను, అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించారు. ప్రతి గులాబీ సైనికుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    16 hrs ago
  • వరంగల్ జిల్లాలోని అశోక్ నగర్‌లో ఒక ఎన్జీవో ఆధ్వర్యంలో గౌడ్ లబ్ధిదారులకు మల్టీ ట్రీ క్లైంబింగ్ యంత్రాలను పంపిణీ చేశారు. తాటి చెట్లు ఎక్కే సమయంలో జరిగే ప్రమాదాలను తగ్గించడం, పనిని సులభతరం చేయడం, కార్మికుల భద్రతను పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు వెల్లడించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఎస్ఆర్డీ నరేశ్, వీఎస్ఎస్ సభ్యులు, ఎన్జీవో ప్రతినిధులు మరియు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, మల్టీ ట్రీ క్లైంబింగ్ యంత్రాలు తమ పనిని మరింత సురక్షితంగా మరియు సులభంగా నిర్వహించడానికి సహాయపడతాయని, అలాగే తమ ఉపాధికి ఎంతో తోడ్పాటును అందిస్తాయని హర్షం వ్యక్తం చేశారు.
    1
    వరంగల్ జిల్లాలోని అశోక్ నగర్‌లో ఒక ఎన్జీవో ఆధ్వర్యంలో గౌడ్ లబ్ధిదారులకు మల్టీ ట్రీ క్లైంబింగ్ యంత్రాలను పంపిణీ చేశారు.

తాటి చెట్లు ఎక్కే సమయంలో జరిగే ప్రమాదాలను తగ్గించడం, పనిని సులభతరం చేయడం, కార్మికుల భద్రతను పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు వెల్లడించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఎస్ఆర్డీ నరేశ్, వీఎస్ఎస్ సభ్యులు, ఎన్జీవో ప్రతినిధులు మరియు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, మల్టీ ట్రీ క్లైంబింగ్ యంత్రాలు తమ పనిని మరింత సురక్షితంగా మరియు సులభంగా నిర్వహించడానికి సహాయపడతాయని, అలాగే తమ ఉపాధికి ఎంతో తోడ్పాటును అందిస్తాయని హర్షం వ్యక్తం చేశారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • వరంగల్ నగరంలోని హెడ్ పోస్టాఫీస్ ఎదుట మంగళవారం ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఈ నిరసనలో పార్టీ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ మాట్లాడుతూ, దేశంలోని ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో రహదారులకు విదేశీ నాయకుల పేర్లు పెట్టడంపై ప్రభుత్వాలు దృష్టి సారించడం సమంజసం కాదని అన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం, రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభం, సామాన్య ప్రజల ఆర్థిక ఇబ్బందుల పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని రమేశ్ నొక్కి చెప్పారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఇటువంటి ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని ఆయన విమర్శించారు. ట్రంప్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఎంసీపీఐ(యూ) నేతలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
    1
    వరంగల్ నగరంలోని హెడ్ పోస్టాఫీస్ ఎదుట మంగళవారం ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఈ నిరసనలో పార్టీ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ మాట్లాడుతూ, దేశంలోని ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో రహదారులకు విదేశీ నాయకుల పేర్లు పెట్టడంపై ప్రభుత్వాలు దృష్టి సారించడం సమంజసం కాదని అన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం, రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభం, సామాన్య ప్రజల ఆర్థిక ఇబ్బందుల పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

ప్రజలకు నేరుగా ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని రమేశ్ నొక్కి చెప్పారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఇటువంటి ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని ఆయన విమర్శించారు. ట్రంప్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఎంసీపీఐ(యూ) నేతలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ సీపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం లో భాగంగా వీణవంక ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించారు. ఎస్సై ఆవుల తిరుపతి ఈ మ్యాచ్ ను ప్రారంభించగా, జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో పోలీస్, ప్రెస్ యూత్ టీంలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. నేటి సమాజంలో డ్రగ్స్ కు బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచడానికి, వారి ఆలోచనలను ఆటల వైపు మళ్లించే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. యువత విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ పులి వెంకట్ ఈ సందర్భంగా కోరారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రెడ్డిపల్లి, వీణవంక, నర్సింగాపూర్, వల్బపూర్, భేతిగల్ గ్రామాలకు చెందిన యువకులకు క్రికెట్ బ్యాట్లు, షటిల్స్, ఫుట్ బాల్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రెస్ మిత్రులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ సీపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం లో భాగంగా వీణవంక ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించారు. ఎస్సై ఆవుల తిరుపతి ఈ మ్యాచ్ ను ప్రారంభించగా, జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో పోలీస్, ప్రెస్ యూత్ టీంలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

నేటి సమాజంలో డ్రగ్స్ కు బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచడానికి, వారి ఆలోచనలను ఆటల వైపు మళ్లించే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. యువత విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ పులి వెంకట్ ఈ సందర్భంగా కోరారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా రెడ్డిపల్లి, వీణవంక, నర్సింగాపూర్, వల్బపూర్, భేతిగల్ గ్రామాలకు చెందిన యువకులకు క్రికెట్ బ్యాట్లు, షటిల్స్, ఫుట్ బాల్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రెస్ మిత్రులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_T. sridhar✍️
    T. sridhar✍️
    వీణవంక, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, "గంజాయి వద్దు.. గెలుపే ముద్దు" అనే సందేశంతో యువతకు విలువైన సూచనలు చేశారు. దంతాలపల్లి మండలంలోని బొడ్లాడ గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి రహిత గ్రామ నిర్మాణ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారు ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సామాజికపరంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారని ఆయన స్పష్టం చేశారు. యువత తమ విలువైన జీవితాన్ని చెడు అలవాట్లకు బలిచేయకుండా విద్య, ఉపాధి, క్రీడలు, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు. వ్యసనాల బారిన పడితే భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసు శాఖ ఎటువంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటోందని ఎస్పీ స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజల సహకారంతోనే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొంటూ, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి స్నేహితులు, అలవాట్లు మరియు రోజువారీ కార్యకలాపాలను గమనించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకన్న, ఉప సర్పంచ్ బొడపట్ల సతీష్, సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి, వార్డు సభ్యులు ఇండ్ల శ్రీలేఖ, ఎర్రబోయిన మమత, గువ్వ రోజా, జనిగల అంజయ్య, కొత్తపల్లి మధు, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తోపాటు పలువురు పాల్గొన్నారు.
    4
    మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, "గంజాయి వద్దు.. గెలుపే ముద్దు" అనే సందేశంతో యువతకు విలువైన సూచనలు చేశారు. దంతాలపల్లి మండలంలోని బొడ్లాడ గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి రహిత గ్రామ నిర్మాణ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారు ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సామాజికపరంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారని ఆయన స్పష్టం చేశారు. యువత తమ విలువైన జీవితాన్ని చెడు అలవాట్లకు బలిచేయకుండా విద్య, ఉపాధి, క్రీడలు, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు. వ్యసనాల బారిన పడితే భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు.

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసు శాఖ ఎటువంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటోందని ఎస్పీ స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజల సహకారంతోనే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొంటూ, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి స్నేహితులు, అలవాట్లు మరియు రోజువారీ కార్యకలాపాలను గమనించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకన్న, ఉప సర్పంచ్ బొడపట్ల సతీష్, సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి, వార్డు సభ్యులు ఇండ్ల శ్రీలేఖ, ఎర్రబోయిన మమత, గువ్వ రోజా, జనిగల అంజయ్య, కొత్తపల్లి మధు, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తోపాటు పలువురు పాల్గొన్నారు.
    user_ఎర్రబోయిన మురళి యాదవ్
    ఎర్రబోయిన మురళి యాదవ్
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    3 min ago
  • పెద్దపల్లి జిల్లా రామగుండంలోని మూతపడిన బి- పవర్ హౌస్ విద్యుత్ ప్లాంట్‌ను త్వరలో డిస్మెటల్ చేయనున్నారు. ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జెన్కో ట్రాన్స్ కో సీఎండి హరీష్ రెడ్డి అధికారులతో కలిసి ఈ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ పర్యటనలో, వారు ప్రస్తుత విద్యుత్ ప్లాంట్ స్థితిగతులను గురించి స్థానిక అధికారులతో చర్చించారు. నూతనంగా నిర్మించబోయే విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం సంబంధించిన వనరులపైనా స్థానిక అధికారులతో ప్రస్తావించారు. త్వరలోనే డిస్మెటల్ పనులు చేపట్టడం జరుగుతుందని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా, ప్లాంట్‌కు సంబంధించిన అధికారులు ఆయనను ఆత్మీయంగా సన్మానించారు.
    2
    పెద్దపల్లి జిల్లా రామగుండంలోని మూతపడిన బి- పవర్ హౌస్ విద్యుత్ ప్లాంట్‌ను త్వరలో డిస్మెటల్ చేయనున్నారు. ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జెన్కో ట్రాన్స్ కో సీఎండి హరీష్ రెడ్డి అధికారులతో కలిసి ఈ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ పర్యటనలో, వారు ప్రస్తుత విద్యుత్ ప్లాంట్ స్థితిగతులను గురించి స్థానిక అధికారులతో చర్చించారు.

నూతనంగా నిర్మించబోయే విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం సంబంధించిన వనరులపైనా స్థానిక అధికారులతో ప్రస్తావించారు. త్వరలోనే డిస్మెటల్ పనులు చేపట్టడం జరుగుతుందని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, ప్లాంట్‌కు సంబంధించిన అధికారులు ఆయనను ఆత్మీయంగా సన్మానించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    12 min ago
  • వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గోర్రెకుంట గ్రామానికి చెందిన ల్యాదెల్ల రాజు అలియాస్ లవ్‌రాజు మృతి కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. ఈ కేసులో లవ్‌రాజుది సహజ మరణమేనని దర్యాప్తులో తేలింది. ఏసీపీ సతీష్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా వంటి ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, ఈ పరిశీలనలో హత్య లేదా మరే ఇతర నేరపూరిత చర్యలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. వైద్య మరియు ఫోరెన్సిక్ నివేదికలు లవ్‌రాజు 'సడన్ కార్డియాక్ అరెస్ట్'తో మరణించినట్లు నిర్ధారించాయి. ఈ నివేదికల ఆధారంగా, లవ్‌రాజు మృతి కేసును సహజ మరణంగా ముగించినట్లు ఏసీపీ సతీష్ బాబు తెలిపారు.
    1
    వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గోర్రెకుంట గ్రామానికి చెందిన ల్యాదెల్ల రాజు అలియాస్ లవ్‌రాజు మృతి కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. ఈ కేసులో లవ్‌రాజుది సహజ మరణమేనని దర్యాప్తులో తేలింది.

ఏసీపీ సతీష్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా వంటి ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, ఈ పరిశీలనలో హత్య లేదా మరే ఇతర నేరపూరిత చర్యలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. వైద్య మరియు ఫోరెన్సిక్ నివేదికలు లవ్‌రాజు 'సడన్ కార్డియాక్ అరెస్ట్'తో మరణించినట్లు నిర్ధారించాయి.

ఈ నివేదికల ఆధారంగా, లవ్‌రాజు మృతి కేసును సహజ మరణంగా ముగించినట్లు ఏసీపీ సతీష్ బాబు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.