Shuru
Apke Nagar Ki App…
యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి భరోసా కల్పించారు.
M D Azizuddin
యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి భరోసా కల్పించారు.
More news from తెలంగాణ and nearby areas
- యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి భరోసా కల్పించారు.1
- ఆర్ఎంపి లు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. ఆర్ఎంపీలు నిబంధనలు అతిక్రమించి వైద్యం చేస్తే చట్టరీత్య కఠిన చర్యలు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్. మహబూబాబాద్ జిల్లా జూలై 29... ఆర్ఎంపీలు నిబంధనలు అతిక్రమించి వైద్యం చెయ్యొద్దని.. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ హెచ్చరించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ జిల్లాలోని మరిపెడ మండలంలో గల కంపాటి రవి బాబు ఆర్ఎంపి ప్రజత క్లినిక్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి క్లినిక్ వారితో ప్రథమ చికిత్స మాత్రమే చేయవలెనని స్థాయికి మించిన (ఇంజక్షన్లు, సెలైన్లు) వైద్యం చేసిన యెడల చట్టరీత్య చర్య తీసుకుంటామని జిల్లాలోని ప్రథమ చికిత్స చేసే ఆర్ఎంపి వైద్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం మనోహర్, కృష్ణ పాల్గొన్నారు.1
- భూపాలపల్లిలోని కాళేశ్వరం పంప్హౌస్లలో మోటార్ల ప్రారంభం..! BHPL: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం, గాయత్రి పంప్హౌస్లలో మోటార్లను ప్రభుత్వం ప్రారంభించింది. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేయాలని కేటీఆర్, హరీశ్రావు చేసిన డిమాండ్ల ఫలితంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని BRS పేర్కొంది. ప్రస్తుతం రెండు పంపుల ద్వారా సుమారు 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు వెల్లడించింది.1
- ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద...సగం నిండిన ప్రాజెక్ట్... ఎల్ఎండి, మిడ్ మానేర్ కు స్వల్పంగా కొనసాగుతున్న వరద అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జగిత్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 66 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం పది టిఎంసీలకు నీరు చేరింది. వరద ఇలానే కొనసాగితే రేపటి వరకు 14 టీఎంసీలు వరకు చేరే అవకాశం ఉంది. ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇక కాలేశ్వరం ప్రాజెక్టులోని నంది మేడారంలోని పంపులను ఆన్ చేసి మిడ్ మానేర్ కు నీటిని ఎత్తిపోసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మినహా ఏ ప్రాజెక్టుకు ఆశించని స్థాయిలో వరద వచ్చిన దాఖలాలు లేవు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాంకు స్వల్పంగా 206 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.4 టీఎంసీల నీరు నిలువ ఉంది. అదే విధంగా మిడ్ మానేర్ డ్యామ్ కు 2334 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. 27.55 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల మిడ్ మానేర్ లో ప్రస్తుతం 7.5 టీఎంసీలను నీరు నిల్వ ఉంది. జగిత్యాల పెద్దపెల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షంతో పలు జలాశయాలకు జలకల సంతరించుకోగా కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని జలాశయాలు వెలవెల బోతున్నాయి.1
- గురుపౌర్ణమి వేళ సాయినామస్మరణ.. కిటకిటలాడిన సాయిబాబ ఆలయాలు వరంగల్ నగరంలో గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీ దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పోర్టురోడ్డు శివనగర్లోని శ్రీ గణేష్ సాయిబాబా మందిరం, ములుగు రోడ్డులోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం, భద్రకాళి, దేశాయిపేట లక్ష్మీ టౌన్షిప్లోని శిరిడి సాయిబాబా దేవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. సాయిబాబాకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.1
- నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని మనస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య భూపాలపల్లి జిల్లాలో పలిమెల మండలం పంకెనకు చెందిన వైష్ణవి గడ్డి మందు తాగి.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడం, ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని తెలిపిన తండ్రి రాజయ్య.1