Shuru
Apke Nagar Ki App…
సింగరాయ పల్లె లో గణేశుని లడ్డు వేలం పాటలో దక్కించుకున్న కిరణ్ యంబడి. కలస పాడు మండలం , సింగరాయ పల్లె లో గణేశుని లడ్డు వేలం పాట 11,116.00 రూపాయల కు తెలుగు దేశం పార్టీ నాయకులు కిరణ్ యంబడి దక్కించుకున్నారు. పూజ కార్యక్రమాల అనంతరం మేళా తలాల లో గ్రామస్థులు లడ్డును ఇంటికి చేర్చారు.
కిరణ్ యంబడి
సింగరాయ పల్లె లో గణేశుని లడ్డు వేలం పాటలో దక్కించుకున్న కిరణ్ యంబడి. కలస పాడు మండలం , సింగరాయ పల్లె లో గణేశుని లడ్డు వేలం పాట 11,116.00 రూపాయల కు తెలుగు దేశం పార్టీ నాయకులు కిరణ్ యంబడి దక్కించుకున్నారు. పూజ కార్యక్రమాల అనంతరం మేళా తలాల లో గ్రామస్థులు లడ్డును ఇంటికి చేర్చారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ప్రైస్ ది లార్డ్ టు ఆల్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్స్ యు కృప సమాధానం తోడైయులను గాక1
- మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్లు విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఓ డిగ్రీ కళాశాల యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉందని ఓ విద్యార్థిని అడిగారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం కావడంతో ప్రజల అవసరాల నిమిత్తం రాకపోకలు ఎక్కువయ్యాయన్నారు. సీఎం తో మాట్లాడి త్వరలో రోడ్లను విస్తరించే పనులను చేపడతామన్నారు. యువతీ యువకులు సహకరించాలని కోరారు.1
- బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి1
- ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుడికి దీపాల హారతులు వేంపల్లెలోని శ్రీవాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా బుధవారం వినాయకుడికి సాంప్రదాయ దుస్తులతో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు వివిధ రకాల దీపాల హారతులు ఇచ్చారు. పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో 32 రకాల దీపాల హారతులు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.1
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 76 జన్మదిన శుభాకాంక్షలు... మంత్రి నరేంద్ర మోడీకి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నారాయణ. భారతదేశం శత్రుదుర్విజ స్థాయిలోనిలిచేందుకు కారణం నరేంద్ర మోడీ రాజకీయ అపార అనుభవం అన్నారు. తన 25 సంవత్సరాల రాజకీయ అనుభవంలో 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలకు పైగా ప్రధానమంత్రిగా పనిచేయడమే అన్నారు. 2047 కళ్ళ ఆయన సంకల్పమైన భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దే శక్తి ఆ భగవంతుడు నరేంద్ర మోడీకి ఇవ్వాలని ప్రార్థించారు.1
- ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషిదాయకం: పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోవూరు పర్యటనకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో జొన్నవాడ కామాక్షితాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. బుచ్చి మండలం నాగమాంబ పురం పంచాయతీ నుండి సుమారు 300 మంది కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి లోకేష్ పర్యటనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు లోకేష్ పర్యటన విజయవంతం చేసేందుకు బయలుదేరమన్నారు. మొట్టమొదటిగా కోవూరులో దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఎంతమంది పరిపాలించిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయలేదన్నారు. వేమిరెడ్డి దంపతుల కృషితో నేడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి లోకేష్ కు వేమిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- అలంపూర్: జాతీయ జెండాను ఉపక్కోశాధికారి కార్యాలయంలో జెండా అవిష్కరించిన నేడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల పరిధిలోని స్థానిక ఉపకోషాధికారి కార్యాలయంలో స్థానిక ఎస్ టి ఓ జె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు ఎస్ టి ఓ మహానీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి కార్యాలయం సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.1
- కృష్ణా జలాలతో నిండిపోయిన వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల కలనూతల కృష్ణా జలాలతో నిండిపోయాయి. ఆగస్టు 31వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేశారు. అప్పటినుండి ఇప్పటివరకు నీటి ప్రవాహం కొనసాగడంతో ముంపు గ్రామాలు నిండిపోయాయి. అధికారులు గ్రామాలను ముందుగానే ఖాళీ చేయించిన విషయం తెలిసినదే. దీంతో మునిగిపోయిన తమ గ్రామాలను చూడడానికి నిర్వాసితులు ఆసక్తి కనపరిచారు.1