Shuru
Apke Nagar Ki App…
యాదగిరిగుట్ట: ఏకశిఖరవాసుడి సన్నిధిలో ఏకాదశి విశేష పర్వాలు ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేషపూజలు కొనసాగాయి. ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చనలు, సువర్ణ పుష్పార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపిన ఆచార్యులు నిజాభిషేకం, సుదర్శన హోమం, నిత్య కళ్యాణం జరిపారు. అలాగే పాతగుట్ట శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
P.srinu
యాదగిరిగుట్ట: ఏకశిఖరవాసుడి సన్నిధిలో ఏకాదశి విశేష పర్వాలు ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేషపూజలు కొనసాగాయి. ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చనలు, సువర్ణ పుష్పార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపిన ఆచార్యులు నిజాభిషేకం, సుదర్శన హోమం, నిత్య కళ్యాణం జరిపారు. అలాగే పాతగుట్ట శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- డా.ఏఎస్ రావు నగర్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని వినతి డా.ఏఎస్ రావు నగర్లో హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానిక నివాసులు కాప్రా సర్కిల్-7 డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం సరైన మౌలిక వసతులు లేకపోవడంతో సుమారు 30–40 కుటుంబాలకు చెందిన వృద్ధులు, మహిళలు, చిన్నారులు వాకింగ్, వ్యాయామం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ఖాళీ స్థలం సద్వినియోగం కోసం త్వరగా వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయాలని కోరారు.1
- మోటర్లు ఆన్ చేయకుండా యాగాలు చేయడం వల్ల ప్రజలకు ఒరిగే లాభమేంది: కేటీఆర్ ప్రజల దృష్టిని మళ్లించడానికే కొందరు యాగాలు చేస్తున్నట్లుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువు గారికి గురుదక్షిణ కింద నీళ్లు వదిలిపెట్టకుండా.. మోటర్లు ఆన్ చేసి అప్పుడు యాగాలు చేస్తే ఉపయోగం ఉంటుందని ఆయన చురకలంటించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.1
- అమ్మో 80 ఏళ్ల కింద నాటి బావి వైరల్ వీడియో చూసి తరించండి జనగాం జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలోని అతి పురాతనమైన బావి ఉంది. ఇది దగ్గర దగ్గర 7 గోళల లోతు ఉంటుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. వీలుంటే మీరు కూడా అటు పక్కకు పోయినప్పుడు చూసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించండి.1
- రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి ఫోర్త్ సిటీలో 5 ఎకరాల భూమిని కట్టబెట్టారు: బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీకి రావిర్యాలలోని ఫోర్త్ సిటీలో రూ.100 కోట్లకు పైగా విలువైన 5 ఎకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టారు కొండల్ రెడ్డి సూట్ వెయ్యగానే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ యొక్క ఎక్స్పర్ట్ అయిపోయారా? ఈ డొల్ల షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని కొండల్ రెడ్డి అమెరికా వాళ్లను కూడా మోసం చేస్తూ, వాళ్లతో సమావేశం పెడుతున్నాడు * బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్1
- పటాన్చెరులో ఘనంగా ముదిరాజుల బోనాలు వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పటాన్చెరు నియోజకవర్గంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. డప్పుల మోతలు, భక్తిగీతాలతో పరిసరాలు మార్మోగాయి. ఈ వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసిన తన అమ్మానాన్నల బాటలోనే ప్రయాణిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతున్న ములుగు ప్రజల ఆశాజ్యోతి శ్రీమతి బడే నాగజ్యోతి ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన తన అమ్మ -నాన్న ల బాటలో పయనిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగుతున్న అడవి తల్లి ముద్దు బిడ్డ సమ్మక్క -సారక్కతల్లుల పోరాట వారసురాలు, ములుగు ప్రజల ఆశజ్యోతి *శ్రీమతి బడే నాగజ్యోతి* గారు జయహో *నాగజ్యోతి అక్క*1
- మల్లాపూర్ కలర్స్ థీమ్ పార్కులో వన మహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ మల్లాపూర్: వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్లోని కలర్స్ థీమ్ పార్కులో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మల్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (MMC), నాచారం సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.1
- తార్నాకలో ఘనంగా ఆషాఢ బోనాలు.. మహిళల బోనం సమర్న డీజే డ్యాన్స్.. తార్నాకలోని శ్రీ దుర్గా పోచమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో బస్తీవాసులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు యువత, బస్తీవాసులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దీంతో ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తుల రాకతో తార్నాకలో సందడి నెలకొంది.2