Shuru
Apke Nagar Ki App…
కోవూరు మండలం జమ్మిపాలెం వెళ్లే రోడ్డు సమీపంలోకాలవలో పడిన వృద్ధురాలు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొడుగుపాడు గ్రామం నుంచి జమ్మిపాలెం వెళ్లే రోడ్డులో ఉన్న బ్రిడ్జి కింద ఒక వృద్ధురాలు కాలువలో పడిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో వృద్ధురాలిని కాలువ నుంచి పైకి తీసి కాపాడారు. ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.అయితే ఆమె ఎవరు, ఎలా కాలువలో పడింది అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాలువలో పడిన వృద్ధురాలు సురక్షితం స్థానికుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది
Ravi Teja
కోవూరు మండలం జమ్మిపాలెం వెళ్లే రోడ్డు సమీపంలోకాలవలో పడిన వృద్ధురాలు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొడుగుపాడు గ్రామం నుంచి జమ్మిపాలెం వెళ్లే రోడ్డులో ఉన్న బ్రిడ్జి కింద ఒక వృద్ధురాలు కాలువలో పడిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో వృద్ధురాలిని కాలువ నుంచి పైకి తీసి కాపాడారు. ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.అయితే ఆమె ఎవరు, ఎలా కాలువలో పడింది అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాలువలో పడిన వృద్ధురాలు సురక్షితం స్థానికుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నెల్లూరు నగరంలోని స్థానిక మైపాడు గేటు సమీపంలో గల నాయుడు ఫంక్షన్ హాల్ నందు నేటి ఉదయం అంగరంగ వైభవంగా శ్రీ పీఠం గురువర్యులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ లలిత శివ స్వామి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలను నందు దాదాపు 11 గ్రూపులో సభ్యులు 300 మంది పాల్గొని ఈ కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలు సాంస్కృతిక ముత్యాలు తంబోలా గేమ్స్ మహిళల క్యాట్ వాక్ తదితర పోటీలను నిర్వహించి విజేతలు అయినటువంటి మహిళలను ఘనంగా సన్మానించే కార్యక్రమాన్ని చేపట్టారు. పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఈ కార్యక్రమంలో పండరి భజన బృందాలు కోలాట బృందాలు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు సాయంత్రం వచ్చిన మహిళలందరికీ కూడా బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పీఠం సభ్యులు బ్రాహ్మణ సంఘం సభ్యులు ఇతర గ్రూపు సభ్యులు భక్తులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన మహిళ లకు ప్రత్యేక బహుమతి మరియు ఘనంగా సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించేందుకు సహకరించిన శ్రీ పీఠం సభ్యులందరికీ కూడా పేరుపేరునా శ్రీ పీఠం నిర్వాహకులు శివయ్య స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.1
- ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం ఎక్సైజ్ చట్టాలను తుంగలోకి తొక్కి, బార్ రూల్స్కి విరుద్ధంగా టెంట్లు వేసి మద్యం అమ్మకాలు మద్యం సిండికేట్ల అవినీతి మత్తులో మునిగితేలుతున్న కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు ఏ బార్లో ఎంత సరుకు కొంటున్నారో.. బహిరంగంగా చెప్పే ధైర్యం ఎక్సైజ్ కమిషనర్కు ఉందా? -పేర్ని నాని, మాజీ మంత్ర1
- పుంగనూరు పట్టణంలో ఆదివారం ఓకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం అందరిని కలచివేసింది, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రా రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులను కలసి ఓదార్చిన పుంగనూరు తెలుగుదేశం పార్టీ నాయకులు. అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నాయకులు సోమవారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించడం జరిగింది, వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.1
- మచిలీపట్నం సుకర్లాబాద్లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో చేరుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బండలను వరుసగా పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సరఫరా ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- అయ్యో ఎంత ఘోరం...దైవ దర్శనం కి వెళ్లి వస్తూ... దారి మధ్యలో లారీ వచ్చి డీ కొట్టగా... అక్కడికక్కడే ముగ్గురు మృతి.. కొందరి పరిస్థితి విషమం!* ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరటికాయల లోడుతో వెళ్తున్న లారీ, శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న జీపును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- మునుగోడు నియోజకవర్గంలో నివసించే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని తన మాతృమూర్తి *కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్* ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి తన ప్రాంత ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రి ని వినియోగిస్తున్నారు... ఈ అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రిలో అప్పటికప్పుడు వివిధ రకాల వ్యాధి నిర్ధారక పరీక్షలు నిర్వహిస్తారు... కంటి పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్న చాలా ఎక్కువ మందిలో వివిధ రకాల రుగ్మతలు ఉండడం వల్ల ఆపరేషన్లకు ఎంపిక కాకుండా వెనుతిరిగి వెళ్తున్న పరిస్థితిని గమనించిన గౌరవ ఎమ్మెల్యే ఏ ఒక్కరూ ఏ చిన్న రుగ్మతతో వెను దిరిగిపోవద్దనే సంకల్పంతో వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి వాటి రిజల్ట్ ను వెంటనే ఇచ్చే విధంగా ఈ మినీ మొబైల్ ఆస్పత్రిని నియోజకవర్గ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు... ఈ మినీ మొబైల్ ఆస్పత్రిలో సి బి పి, ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే లాంటి సౌకర్యాలు ఉన్నాయి... ఇప్పటివరకు 12 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 9034 మందికి కంటి పరీక్షలు జరిపి 1970 మందికి సక్సెస్ ఫుల్ గా కంటి పరీక్షలు చేయించారు.. 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో మినీ మొబైల్ ఆసుపత్రి ని ఉపయోగించి ప్రజలకు అన్ని రకాల వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు. కడుపున పుట్టిన వాళ్లే పట్టించుకోని ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా మారి తన సొంత ఖర్చుతో ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తూ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా జరిపిస్తున్నారు.. వచ్చిన ప్రతి ఒక్క పేషంట్ కి కడుపునిండా భోజనం తినిపించి మరి తమ ఇంటి వరకు దిగబెడుతుండడంతో ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు...2
- నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు నేటి సాయంత్రం హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల 2026 కార్యక్రమం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటుడు బాలాజీ హాజరయి జ్యోతి ప్రద్యులన కార్యక్రమాన్ని గావించారు. చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు పండర భజన తదితర సాంప్రదాయ నృత్యాలను వచ్చిన ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి హాజరవ్వటం జరిగింది. కార్యక్రమంలో రాజకీయ ప్రతినిధులు అధికారులు తదితరులు హాజరయ్యి విజయవంతంగా కొనసాగించారు. పుష్కారాలతో ఘనంగా సన్మానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించిన సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు ప్రత్యేకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు అమీర్జాన్ భాస్కర్ కోసూరు రత్నం అదే క్రమంలో సిఆర్ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టస్ పేరూరి ప్రదీప్ రంగారావు స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఉగాది ముందస్తు వేడుకలు అంబరాన్ని అంటాయని వచ్చిన ప్రతి ఒక్కరూ అభినందించారు.1
- కోవూరు చౌదరి పెట్రోల్ బంకు జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం కోవూరు మండలం లో చౌదరి పెట్రోల్ బంక్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న లారీ ను ఆటో డీ కొట్టడం అలాగే ఎల్లయ్యపాలెం కి చెందిన గర్భిణీ స్త్రీ నెల్లూరుకు వెళ్లి ఆస్పత్రిలో చూపించుకొని ఆటోలో ఇంటికి వెళ్లే తరుణంలో ముందుఆగి ఉన్న లారీని ఢీకొట్టడం జరిగింది వాళ్లల్లో డైవర్ కి గర్భిణీ స్త్రీ కి గాయాలు స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ లో నెల్లూరుకు తీసుకెళ్లడం జరిగింది.4
- ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం ఎక్సైజ్ చట్టాలను తుంగలోకి తొక్కి, బార్ రూల్స్కి విరుద్ధంగా టెంట్లు వేసి మద్యం అమ్మకాలు మద్యం సిండికేట్ల అవినీతి మత్తులో మునిగితేలుతున్న కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు ఏ బార్లో ఎంత సరుకు కొంటున్నారో.. బహిరంగంగా చెప్పే ధైర్యం ఎక్సైజ్ కమిషనర్కు ఉందా? -పేర్ని నాని, మాజీ మంత్ర1