Shuru
Apke Nagar Ki App…
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుదాం ADB: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుతామని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బుధవారం బోథ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ విఫల పాలనపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని మాట్లాడారు. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శించి, 'బాకీ కార్డు'తో నిరసన తెలిపారు.
Mallaiah Potta
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుదాం ADB: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుతామని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బుధవారం బోథ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ విఫల పాలనపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని మాట్లాడారు. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శించి, 'బాకీ కార్డు'తో నిరసన తెలిపారు.
More news from Telangana and nearby areas
- వికలాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచాలి: కల్లేపెల్లి ప్రేమ్రాజ్ ఆదిలాబాద్ జిల్లా : వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కల్లేపెల్లి ప్రేమ్రాజ్ డిమాండ్ చేశారు. సెప్టెంబరు 5న ఖమ్మంలో నిర్వహించనున్న వీఏచ్పీఎస్ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని వికలాంగులు, సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన అన్నారు. ముఖ్యంగా వికలాంగులకు అందిస్తున్న పింఛన్ను రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే వృద్ధులు, వితంతువులకు అందుతున్న పింఛన్ను రూ.4 వేలకు పెంచి వారి జీవనానికి మరింత భరోసా కల్పించాలని కోరారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వికలాంగుల హక్కులు, సంక్షేమం, పెన్షన్ల పెంపు తదితర అంశాలపై జాతీయ మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వికలాంగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కల్లేపెల్లి ప్రేమ్రాజ్ కోరారు... దీనికి హెడ్ లైన్స్ 70 అక్షరాలతో రాసి ఇవ్వండి1
- ఆదిలాబాద్ లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు....... ADB: తాంసి మండలం పోన్నారి సంకట మోచన్ హనుమాన్ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు, అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.1
- కల్వగడ్డ ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? | ఉడకని అన్నం.. మెనూలో వున్నా కూర లైవ్ లో మాయం!1
- కల్లూరు మోడల్ స్కూల్ విద్యార్థుల బస్ సమస్యకు పరిష్కారం చూపిన కోరుట్ల ఏమ్మెల్యే రెండు రోజుల క్రితం బస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ విద్యార్థులు ధర్నా నిర్వహించగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్ వెంటనే స్పందించారు. కోరుట్ల ఆర్టీసీ ఆర్ఎం, డీఎంతో మాట్లాడి విద్యార్థుల కోసం అదనంగా బస్ను కేటాయించేలా చర్యలు తీసుకున్నారు… ఈ మేరకు ఈరోజు అదనపు బస్ను అందుబాటులోకి తీసుకురాగా, ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా విద్యార్థులతో కలిసి కోరుట్ల నుంచి కల్లూరు మోడల్ స్కూల్ వరకు బస్లో ప్రయాణించారు… విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించి బస్ సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే సంజయ్ గారికి విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే సంజయ్ గారు తెలిపారు..1
- పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లాలి : ముధోల్ మాజీ ఎమ్మెల్యే విటల్ రెడ్డి... పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని ముధోల్ మాజీ ఎమ్మెల్యే విటల్ రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమృత్ పటేల్, పార్టీ మండల సెక్రటరి జిడ్డు మల్లయ్య, జనరల్ సెక్రటరీ ఢగే దిగంబర్, సెక్రటరీ రమేష్ పటేల్ ను దేగాం లోని స్వగృహం లో ఆయన సన్మానించారు. బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్, నాయకులు ఉన్నారు.1
- కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసింది: మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ బోధన్, (సెప్టెంబర్ 2 ): నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ ఆరోపించారు.బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా షకీల్ అమీర్ మాట్లాడుతూ, ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని గ్యారంటీ కార్డుల్లో హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని అన్నారు. మహిళలకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు అవినీతి, అక్రమాల ఆరోపణలు చేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ధర్నా సందర్భంగా కార్యకర్తలు “దొంగల రాజ్యం – దోపిడీ రాజ్యం – కాంగ్రెస్ రాజ్యం” అంటూ నినాదాలు చేయడంతో అంబేద్కర్ చౌరస్తా మారుమోగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, మండల నాయకులు సంజీవ్, శ్రీరామ్, నర్సింగ్ రావు, అబ్బన్న, భూమారెడ్డి, పట్టణ కౌన్సిలర్లు అశోక్ రెడ్డి, ముషీర్ భాయ్, మోబిన్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.4
- రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఇవ్వకపోతే కాంగ్రెస్ మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేస్తావా? సీఎం రేవంత్కు జోగు రామన్న సవాల్ ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన రూ.500 గ్యాస్ సిలిండర్ హామీని రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా అమలు చేసి చూపిస్తే మాజీ మంత్రిగా తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. అదే విధంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయించే బాధ్యత తీసుకుంటావా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు చేపట్టిన ‘కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన చేపట్టారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ‘420 అడుగుల కాంగ్రెస్ 420 హామీలు’ అనే ఫ్లెక్సీతో భారీ ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడని అన్నారు. అలాంటి ఉద్యమ నాయకుడిపై దొంగ సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్ను అవమానించేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని జోగు రామన్న విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు పెన్షన్లు, విద్యార్థులకు స్కూటీలు, రూ.4 వేల పెన్షన్, వికలాంగుల పెన్షన్లు తదితర హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 13 గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నారని విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను జోగు రామన్న వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమంలో రౌతు మనోహర్, యాసం నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు అజయ్, సాజి తోద్దీన్, యూనిస్ అక్బాని, వసంత్ అన్నెలా, ప్రమోద్ రెడ్డి, బోడగం మమత, పర్వీన్ నిఖిలేష్, సేవ్వా జగదీష్, ఫెరోజ్, దమ్మపాల్ వెంకటేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.1
- వైఎస్సార్ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి ఆదిలాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావు, బోథ్ ఇన్ఛార్జి ఆడే గజేందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, రైతుల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ఇన్స్టాగ్రామ్లో మోసాలు.. అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు అరెస్ట్ ADB: మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో ఇన్స్టాగ్రామ్లో మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్కు చెందిన ప్రకాశ్ కుమార్ను అరెస్టు చేసినట్లు SP అఖిల్ మహాజన్ బుధవారం తెలిపారు. దేశవ్యాప్తంగా 140 మందిని మోసం చేసి రూ.5.30 కోట్లు కొల్లగొట్టినట్లు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకుని రూ.1 లక్ష నగదు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.1