logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిరిసిల్ల కొత్త బస్టాండ్ లో పసికందును వదిలి వెళ్ళిన గుర్తుతెలియని వ్యక్తులు... చేరదీసి కన్న వారి కోసం ఆరా తీస్తున్న అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణలోని మూత్రశాలలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు ఆడపసికందును చేరదీసి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు పాపను సురక్షితంగా రక్షించి, మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పసికందును అక్కడ వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు.

5 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
5 hrs ago

సిరిసిల్ల కొత్త బస్టాండ్ లో పసికందును వదిలి వెళ్ళిన గుర్తుతెలియని వ్యక్తులు... చేరదీసి కన్న వారి కోసం ఆరా తీస్తున్న అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణలోని మూత్రశాలలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు ఆడపసికందును చేరదీసి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు పాపను సురక్షితంగా రక్షించి, మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పసికందును అక్కడ వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గన్నేరువరం మండల కేంద్రంలో గురువారం జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీ వేంకటేశ్వర కల్యాణ మండపం వరకు కొనసాగింది. హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో భక్తులు, యువకులు, మహిళలు పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు చేశారు. కార్యక్రమం భక్తి వాతావరణంలో శాంతియుతంగా సాగింది.
    1
    గన్నేరువరం మండల కేంద్రంలో గురువారం జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీ వేంకటేశ్వర కల్యాణ మండపం వరకు కొనసాగింది.
హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో భక్తులు, యువకులు, మహిళలు పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు చేశారు. కార్యక్రమం భక్తి వాతావరణంలో శాంతియుతంగా సాగింది.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • హనుమకొండ జిల్లా : కార్మికులను అడ్డుకున్న పోలీసులు.. హనుమకొండ లోకల్ డిపో ఎదురుగా నిరసన తెలిపేందుకు వెళుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ ఐకాసా ఆధ్వర్యంలో సుమారు 200 మంది బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ర్యాలీగా వెళుతుండగా పోలీసులు రాంనగర్ కూడలి వద్ద అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా నియంత్రించడం సరికాదని ఐకాస నేతలు అన్నారు.
    1
    హనుమకొండ జిల్లా : 
కార్మికులను అడ్డుకున్న పోలీసులు..
హనుమకొండ లోకల్ డిపో ఎదురుగా నిరసన తెలిపేందుకు వెళుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ ఐకాసా ఆధ్వర్యంలో సుమారు 200 మంది బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ర్యాలీగా వెళుతుండగా పోలీసులు రాంనగర్ కూడలి వద్ద అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా నియంత్రించడం సరికాదని ఐకాస నేతలు అన్నారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    15 hrs ago
  • మూఢనమ్మకాలను నమ్మవద్దని ఎఐఎఫ్టియు నాయకులు సోమిషెట్టి దశరథం అన్నారు.
    1
    మూఢనమ్మకాలను నమ్మవద్దని ఎఐఎఫ్టియు నాయకులు సోమిషెట్టి దశరథం అన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • నర్సంపేట ఆర్టీసీ డిపోలో చోటుచేసుకున్న విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపింది. డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం కలవరపరిచింది. ఈ ఘటనతో డిపో పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం ప్రకారం, డ్రైవర్ శంకర్ గౌడ్ తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆవేదనతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంఘటనను గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి, తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను అత్యవసర చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అక్కడ మోహరించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    నర్సంపేట ఆర్టీసీ డిపోలో చోటుచేసుకున్న విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపింది. డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం కలవరపరిచింది. ఈ ఘటనతో డిపో పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం ప్రకారం, డ్రైవర్ శంకర్ గౌడ్ తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆవేదనతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంఘటనను గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి, తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను అత్యవసర చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అక్కడ మోహరించారు.
ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలో గురువారం రోజున భారత రాష్ట్ర సమితి కొడిమ్యాల మండల శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇట్టి విలేకరుల సమావేశంలో మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, బిఆరెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, స్వార్థ రాజకీయ అవసరాలకు కాలేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ప్రచారం చేసి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ కు హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిది అన్నారు. ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై హర్షం వ్యక్తం చేస్తూ కాళీశ్వరం ముక్తీశ్వర స్వామి దయతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రివర్యులు కడిగిన ముత్యంలా వస్తారని, నిజం నిప్పులాంటిది, నిజం అనేది కొంత ఆలస్యంగా అయినా విజయం సాధిస్తుందని ఈ తీర్పుతో తేటతెల్లమైందన్నారు. రానున్న రోజుల్లో బిఆరెస్ ప్రభుత్వం రావడం ఖాయం అన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శోభమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, మండల యువజన అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు అబ్దుల్ సుకుర్, మాజీ రైతుబంధు అధ్యక్షులు అంకం రాజేశం, మాజీ ఎంపీటీసీ సభ్యులు సురుగు శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్, మాజీ సర్పంచ్ మల్యాల మహిపాల్, కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెల్లా లక్ష్మణ్, హిమ్మత్రావ్ పేట గ్రామ శాఖ అధ్యక్షులు ఆకునూరి మల్లయ్య , యువ నాయకులు రాచకొండ చంద్రమోహన్, నేరెళ్ల రాజయ్య, రామంచ లక్ష్మణ్, మోహన్, గణేష్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
    3
    జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలో గురువారం రోజున భారత రాష్ట్ర సమితి కొడిమ్యాల మండల శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇట్టి విలేకరుల సమావేశంలో మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, బిఆరెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, స్వార్థ రాజకీయ అవసరాలకు కాలేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ప్రచారం చేసి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ కు హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిది అన్నారు. ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై హర్షం వ్యక్తం చేస్తూ కాళీశ్వరం ముక్తీశ్వర స్వామి దయతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రివర్యులు కడిగిన ముత్యంలా వస్తారని, నిజం నిప్పులాంటిది, నిజం అనేది కొంత ఆలస్యంగా అయినా విజయం సాధిస్తుందని ఈ తీర్పుతో తేటతెల్లమైందన్నారు.
రానున్న రోజుల్లో బిఆరెస్ ప్రభుత్వం రావడం ఖాయం అన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శోభమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, మండల యువజన అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు అబ్దుల్ సుకుర్, మాజీ రైతుబంధు అధ్యక్షులు అంకం రాజేశం, మాజీ ఎంపీటీసీ సభ్యులు సురుగు శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్, మాజీ సర్పంచ్ మల్యాల మహిపాల్, కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెల్లా లక్ష్మణ్, హిమ్మత్రావ్ పేట గ్రామ శాఖ అధ్యక్షులు ఆకునూరి మల్లయ్య , యువ నాయకులు రాచకొండ చంద్రమోహన్, నేరెళ్ల రాజయ్య, రామంచ లక్ష్మణ్, మోహన్, గణేష్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
    user_Kattekola raju
    Kattekola raju
    Television repair service కోడిమ్యాల్, జగిత్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • వరంగల్:నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయపడిన డ్రైవర్ శంకర్ గౌడ్‌ను రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడంతో మనస్తాపానికి గురైన శంకర్ గౌడ్ ఘటనలో గాయపడగా, తోటి కార్మికులు వెంటనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని నేతలు అడిగి తెలుసుకున్నారు.
    1
    వరంగల్:నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాయపడిన డ్రైవర్ శంకర్ గౌడ్‌ను రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడంతో మనస్తాపానికి గురైన శంకర్ గౌడ్ ఘటనలో గాయపడగా, తోటి కార్మికులు వెంటనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని నేతలు అడిగి తెలుసుకున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన వర్షం బీభత్సం సృష్టించింది. గోడ కూలి ఆరుగురు గాయపడగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అకాల వర్షం గాలివాన సిరిసిల్ల ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. ఒక్కసారి కురిసిన గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలికి చెట్లు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి, కరెంట్ వైరస్లు తెగి పవర్ సప్లై నిలిచిపోయింది. కటౌట్లు, బారీగేట్లు, ఫ్లెక్సీలు గాలికి కొట్టుకొచ్చి రోడ్లపై పడిపోయాయి. రోడ్లపై చెట్లు అస్తవ్యస్తంగా పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గాలివానకు ఓ ఇల్లు ధ్వంసమైంది. గోడ కూలి ఆరుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో గాలివాన ధాటిక రేకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉధృతమైన గాలులకు పలు చోట్ల వృక్షాలు నేలకూలగా, మరికొన్ని చోట్ల భారీ చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. మున్సిపల్, విపత్తు నిర్వహణ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్లను, శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కాలి వానకు తోడు అకాల వర్షం అన్నదాతలు అందులో గురిచేస్తుంది. కల్లాల్లో దాన్యం తడిసిపోగా చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.‌ అకాల వర్షం ఆగం చేస్తుందని అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన వర్షం బీభత్సం సృష్టించింది. గోడ కూలి ఆరుగురు గాయపడగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అకాల వర్షం గాలివాన సిరిసిల్ల ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. ఒక్కసారి కురిసిన గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలికి చెట్లు విరిగిపడ్డాయి.  ఇంటి పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి, కరెంట్ వైరస్లు తెగి పవర్ సప్లై  నిలిచిపోయింది. కటౌట్లు, బారీగేట్లు, ఫ్లెక్సీలు గాలికి కొట్టుకొచ్చి రోడ్లపై పడిపోయాయి. రోడ్లపై చెట్లు అస్తవ్యస్తంగా పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గాలివానకు ఓ ఇల్లు ధ్వంసమైంది. గోడ కూలి ఆరుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో గాలివాన ధాటిక రేకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉధృతమైన గాలులకు పలు చోట్ల వృక్షాలు నేలకూలగా, మరికొన్ని చోట్ల భారీ చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. మున్సిపల్, విపత్తు నిర్వహణ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్లను, శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కాలి వానకు తోడు అకాల వర్షం అన్నదాతలు అందులో గురిచేస్తుంది. కల్లాల్లో దాన్యం తడిసిపోగా చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.‌
అకాల వర్షం ఆగం చేస్తుందని అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    10 hrs ago
  • వరంగల్ జిల్లా:రాయపర్తి మండలం జగన్నాథపల్లికి చెందిన రావుల జయసింహారెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 46వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. తొలిసారి స్వగ్రామానికి బుధవారం చేరుకోగా గ్రామస్థులు డీజేలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ శివారులో బ్రహ్మరథం పట్టి సంబరాలు జరిపారు. జాతీయ స్థాయిలో రాణించి ఊరి పేరు మరింత నిలబెట్టాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.
    1
    వరంగల్ జిల్లా:రాయపర్తి మండలం జగన్నాథపల్లికి చెందిన రావుల జయసింహారెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 46వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. తొలిసారి స్వగ్రామానికి బుధవారం చేరుకోగా గ్రామస్థులు డీజేలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ శివారులో బ్రహ్మరథం పట్టి సంబరాలు జరిపారు. జాతీయ స్థాయిలో రాణించి ఊరి పేరు మరింత నిలబెట్టాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • గజ్వేల్ లో మల్లన్న సాగర్ డ్యాం
    1
    గజ్వేల్ లో మల్లన్న సాగర్ డ్యాం
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.