నూతన ఉత్సహంతో సాగిన IFTU రాష్ట్ర 4వ మహసభలు..ర్యాలీ -ప్రదర్శన నిర్వహించారు. గోదావరిఖని పట్నంలోని సిరి ఫంక్షన్ హాల్లో ప్రారంభంఅయినాయి. మహాసభల ప్రారంభానికి ముందు సుత్తి కొడవలి జెండాను ఐ ఎఫ్ టు యు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విశ్వనాథ్ జెండాను ఆవిష్కరించారు. ర్యాలీ -ప్రదర్శన నిర్వహించారు. మహసభలకు ముఖ్య వక్తగా ఐఎఫ్ టియూ జాతీయ అధ్యక్షులు అరెళ్ళి కృష్ణ బి. భాస్కర్ (ఏఐకెఎం ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి) అనేక ఐ ఎఫ్ టి యు.జాతీయనాయకులు రామకృష్ణ ,సరళలు (pow)వచ్చి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికల మెడకు ఉరితాడుగా నాలుగు లేబర్ కోడ్ మారాయి అన్నారు. 12 సంవత్సరాల మోడి షా పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సంస్థలకు అప్పగించారు. కనీస వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిక చేసిన అమలు చేయడం లేదు. రాష్ట్రంలో ఆర్టీసీ ప్రైవేటికరణ, కొత్త ఉద్యోగాలు లేవు తెలంగాణ ఎర్పడి 12 సంవత్సరాలు అయినా ఉపాధి లేక నిరుద్యోగ యువత నేటికీ ఉద్యమం చేస్తున్న మన పాలకులు స్పందన లేదు. ఈ కార్యక్రమంలో నాయకులు వరదయ్య విజయ్ సురేందర్ లచ్చన్న భీమన్న తదితరులు పాల్గొన్నారు
నూతన ఉత్సహంతో సాగిన IFTU రాష్ట్ర 4వ మహసభలు..ర్యాలీ -ప్రదర్శన నిర్వహించారు. గోదావరిఖని పట్నంలోని సిరి ఫంక్షన్ హాల్లో ప్రారంభంఅయినాయి. మహాసభల ప్రారంభానికి ముందు సుత్తి కొడవలి జెండాను ఐ ఎఫ్ టు యు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విశ్వనాథ్ జెండాను ఆవిష్కరించారు. ర్యాలీ -ప్రదర్శన నిర్వహించారు. మహసభలకు ముఖ్య వక్తగా ఐఎఫ్ టియూ జాతీయ అధ్యక్షులు అరెళ్ళి కృష్ణ బి. భాస్కర్ (ఏఐకెఎం ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి) అనేక ఐ ఎఫ్ టి యు.జాతీయనాయకులు రామకృష్ణ ,సరళలు (pow)వచ్చి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికల మెడకు ఉరితాడుగా నాలుగు లేబర్ కోడ్ మారాయి అన్నారు. 12 సంవత్సరాల మోడి షా పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సంస్థలకు అప్పగించారు. కనీస వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిక చేసిన అమలు చేయడం లేదు. రాష్ట్రంలో ఆర్టీసీ ప్రైవేటికరణ, కొత్త ఉద్యోగాలు లేవు తెలంగాణ ఎర్పడి 12 సంవత్సరాలు అయినా ఉపాధి లేక నిరుద్యోగ యువత నేటికీ ఉద్యమం చేస్తున్న మన పాలకులు స్పందన లేదు. ఈ కార్యక్రమంలో నాయకులు వరదయ్య విజయ్ సురేందర్ లచ్చన్న భీమన్న తదితరులు పాల్గొన్నారు
- జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* *జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* పెద్దపల్లి, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మరియు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గార్ల అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గార్కి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీల జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేసేందుకు జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, తెలంగాణ రక్షణ సేన నాయకులు సిరవేన స్వప్న, బొల్లబత్తుల భూమయ్య,బొడిగె మహేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్న రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కంకటి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు నోమూరి శ్రీధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు ఇతర రంగాల్లో తగిన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.1
- ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలి బెల్లంపల్లి కాంట చౌరస్తాలో కాంట చౌరస్తా వద్ద ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలని ఆటో యూనియన్ అధ్యక్షులు కట్ల రాంకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయుట నిమిత్తంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు చూపించిన స్థలంలో ఆటోలు నిలుపుకుంటున్నామని ఈ క్రమంలో అదే స్థలంలో కాంట రాత్రికి రాత్రే అక్రమంగా పాన్ షాప్ ఏర్పాటు చేశారన్నారు. దింతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించాలని కోరారు1
- ఎల్లారెడ్డిపేట కలెక్టర్ లో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ..చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- ఆర్టీసీ ఈ-ఆటోలతో ఉపాధికి గండి: కరీంనగర్లో బంద్ సక్సెస్.. ఉచిత బస్సు పథకం, ఆన్లైన్ క్యాబ్లు, సీటీ బస్సుల వల్ల ఉపాధి కోల్పోతున్నామంటూ కరీంనగర్లో ఆటో కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆర్టీసీ ఈ-ఆటోలను నిలిపివేయాలని యూనియన్ నాయకుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఛార్జీల పెంపు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.1
- సామాజిక,ప్రజా చైతన్యం కోసం కళాకారుల కలాలు, గళాలు ఉండాలి. కళాకారులు శిక్షణ ద్వారా కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి : సిపిఐ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సకల జనుల హితం కోసం,సామాజిక కోణంలో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం కళాకారులు తమ కళాలకు, గళాలకు పనిచెప్పాలని,కళాకారులు శిక్షణ ద్వారా తమ నైపుణ్యం పెంపొందించుకోవాలని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరంను చాడ వెంకట రెడ్డి ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంకు హాజరైన కళాకారులను ఉద్దేశించి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రచయితలు,కవులు,కళాకారులు కార్మిక,కర్షక,ప్రజా సమస్యలపై,వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ రచనలు, పాటలు,వీధి నాటకాలు వ్రాయాలని,కళాకారులు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడాలని,కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి కళాకారులని, అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని,పాటలు నేర్చుకొని పాడాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రజల కష్ట,సుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని, ఏ పోరాటాలు,ఉద్యమాలు,బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా కళాకారులు ఉండాల్సిందేనని, కరీంనగర్ లో సెప్టెంబర్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల విజయవంతం కోసం కళాకారులు తమ వంతుగా కళారూపాలు ప్రదర్శించాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ ,పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం,ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్ద శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి కటిక రెడ్డి బుచన్న యాదవ్,టేకుమల్ల సమ్మయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉప్పలయ్య,సహాయ కార్యదర్శి రేగుంట చంద్ర శేఖర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్,వెంకటాచారి, రోంటాల శ్యామ్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దుడ్డేల సమ్మయ్య, వరకోలు సదానందం, ఎజ్జ రాజయ్య,లక్ష్మీరాజం,ఆసాల రమ,ఇందిరా,లక్ష్మణ్,ఎర్రోజు శ్రీనివాస్,మోహన్,డప్పురాజు తదితరులు పాల్గొన్నారు.1
- గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి హుస్నాబాద్ను సస్యశ్యామలం చేస్తాం- మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, అందుకోసం ప్రభుత్వం 250 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా సోమవారం చిగురుమామిడి మండలం కొండాపూర్ నవాబుపేట ఇందుర్తి ఒగులాపూర్ గునుకులపల్లె లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పశు వైద్య శిబిరాలు ప్రారంభించారు. వనమహోత్సంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి సంబంధించి రైతులు సహకరించాలని మంత్రి కోరారు. భూసేకరణ ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా అందరూ సహకరిస్తే, భూములు సేకరించిన వెంటనే అర్హులైన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. మూడు జిల్లాల కలెక్టర్లు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయని మంత్రి అన్నారు.4
- పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. _తెలంగాణా_ తెల్లవారుజామున సోమవారం ఉదయం, పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. పోలీసు సైరన్లు మోగిస్తూ ఆరు వాహనాలు కాలనీలోని ఒక ఇంటి వద్దకు రావడంతో స్థానికుల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఆ ఇంటి లోపల ఏం జరుగుతోందో ఎవరికీ తెలియలేదు. బయట ఢిల్లీకి చెందిన వాహనాలు, స్థానిక పోలీసు వాహనాలు ఉన్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), సైబర్ క్రైమ్ యూనిట్, స్థానిక పోలీసుల బృందాలు హఠాత్తుగా ఆ ఇంట్లో సోదాలు నిర్వహించాయి. NIA అధికారులు దంతవైద్యుడి కుమారుడైన ముజామిల్ను ప్రశ్నించారు. ఉగ్రవాద లింకులు, సైబర్ నేరాల్లో ప్రమేయం ఉందన్న అనుమానంతో దాదాపు నాలుగు గంటల పాటు విచారణ జరిపారు. ఆ తర్వాత ముజామిల్ ఇంటి నుంచి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని రామగుండం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే, పెద్దపల్లి ట్రినిటీ కాలేజీలో ట్రైబల్ ఇంజనీరింగ్ చదువుతున్న ముజామిల్, ఏడాది క్రితం తాను ఒక వాట్సాప్ గ్రూప్లో చేరడం వల్లే ఈ వ్యవహారం మొదలైందని, ఆ గ్రూప్లో సైబర్ నేరం జరిగిందని చెబుతున్నాడు. తాను వెంటనే ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేశానని చెబుతున్నాడు. ఏడాది క్రితం జరిగిన ఆ ఘటనకు సంబంధించి విచారణకు అధికారులు వచ్చి, వివరాలు సేకరించి వెళ్లిపోయారని అతను, అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంత చిన్న ఘటన కోసం ఢిల్లీ నుంచి NIA బృందం వస్తుందా అని స్థానికులు ఆందోళన చెందుతూ ప్రశ్నిస్తున్నారు. గతంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మilitants ఉనికి ఉందని భావించి, ఢిల్లీ నుంచి NIA, గుజరాత్ పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించాయి. దాదాపు పదేళ్ల తర్వాత, ఉగ్రవాద కార్యకలాపాల అనుమానంతో NIA బృందం రావడం బొగ్గు బెల్ట్ ప్రాంతాన్ని కుదిపేసింది. అధికారులు ముజామిల్ నుంచి ల్యాప్టాప్, ఫోన్ను స్వాధీనం చేసుకుని రామగుండం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తదుపరి విచారణ కోసం తర్వాత మళ్లీ రావాలని అతడిని కోరినట్లు సమాచారం. ఏదేమైనా, ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు, ముజామిల్కు సంబంధించిన ఖాతా నుంచి విదేశాలకు నిధులు బదిలీ అయి ఉండవచ్చని NIA పోలీసు బృందం అనుమానిస్తోంది.1
- నిర్మల్లో రూ.50 వేల లంచం, ఇద్దరు ట్యాక్స్ అధికారులు అరెస్ట్. అనుకూలమైన GST ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏసీబీ ట్రాప్లో ఇద్దరూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.1