Shuru
Apke Nagar Ki App…
NTR ముఖ్యమంత్రి అయ్యేంత వరకు బియ్యం తో అన్నం తినటం తక్కువ. NTR ముఖ్యమంత్రి అయిన తరువాత నే బియ్యం తో అన్నం తిన్నాను - #Pallaburusu యాక్టర్ సుధాకర్ రెడ్డి. #NTR ♥️🙏 #NandamuriTarakaRamarao యుగ పురుషుడు... నందమూరి తారక రామారావు గారు #జోహార్NTR #JoharNTR
GB MAHENDAR
NTR ముఖ్యమంత్రి అయ్యేంత వరకు బియ్యం తో అన్నం తినటం తక్కువ. NTR ముఖ్యమంత్రి అయిన తరువాత నే బియ్యం తో అన్నం తిన్నాను - #Pallaburusu యాక్టర్ సుధాకర్ రెడ్డి. #NTR ♥️🙏 #NandamuriTarakaRamarao యుగ పురుషుడు... నందమూరి తారక రామారావు గారు #జోహార్NTR #JoharNTR
More news from తెలంగాణ and nearby areas
- డా.ఏఎస్ రావు నగర్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని వినతి డా.ఏఎస్ రావు నగర్లో హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానిక నివాసులు కాప్రా సర్కిల్-7 డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం సరైన మౌలిక వసతులు లేకపోవడంతో సుమారు 30–40 కుటుంబాలకు చెందిన వృద్ధులు, మహిళలు, చిన్నారులు వాకింగ్, వ్యాయామం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ఖాళీ స్థలం సద్వినియోగం కోసం త్వరగా వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయాలని కోరారు.1
- కేశంపేట మండలం పరిధిలోని ఇప్పలపల్లి శివారులో ప్రమాదం పొంచి ఉంది కేశంపేట మండల పరిధిలోని ఇప్పలపల్లి శివారులో మూల మలుపుల వద్ద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కన వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన బోల్టాలన్నీ విరిగిపోయి, ప్రస్తుతం ఉపయోగం లేకుండా ఉన్నాయి. దీంతో మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందన్నారు. ప్రమాదాలను నివారించేందుకు వెంటనే విరిగిపోయిన బోల్టాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.61,874, బ్రేక్ దర్శనాలతో రూ.1,21,800, వీఐపీ దర్శనాలతో రూ.2,60,550, కార్ పార్కింగ్ రూ.3,45,500, ప్రసాద విక్రయాలతో రూ.6,17,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.16,16,870 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- అన్నం పెట్టిన వారిని మోసం చేయాలని చూస్తే ఇలాగే ఉంటుంది పోచారం గారు అన్నం పెట్టినవారిని మోసం చెయ్యాలని చూస్తే ఇలానే ఉంటది పోచారం గారు.. మంత్రి పదవి కోసం, డబ్బుల కోసం నేను పార్టీ మారలేదు.. అభివృద్ధికి సహకరిస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరా.! ముఖ్యమంత్రి మాటలు మంత్రులు వినడం లేదు.. సీఎం స్వయానా మంత్రులకు నిధులు మంజూరు చేయమని చెప్పిన మంత్రులు సీఎం మాటలు పట్టించుకోవడం లేదు.. కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు. నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు. ఆరు నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కండువా కుప్పుకున్నాక సగం నిధులు మాత్రమే మంజూరు చేశారు. బిల్లులు పెండింగ్ లో ఉండటం వల్ల గుత్తేదారులు పనులు ఆపేశారు. నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేల తో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా.. నేను నీకు అమ్ముడుపోయానా ఎమ్మెల్యేగిరిని కొన్నావా అని అడిగాను. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.. నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం, మంత్రులుభట్టి,పొంగులేటికి చెప్పిన నిధులు మంజూరు కావడం లేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సీఎం మాటలువినడం లేదు వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పిన పట్టించుకోవడం లేదు వేం నరేందర్ రెడ్డి కి 50 సార్లు ఫోన్ చేసిన ఫోన్ అటెండ్ చేయడం లేదు. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడు మర్చిపోలేను. అప్పటి రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారాల్సి వచ్చింది.1
- విష్ణుప్రియ రంభ ఊర్వశి మేనక టీజర్ ఈవెంట్ Vishnu Priya at #RambaOorvasiMenaka TEASER event @PriyaBhimaneni విష్ణుప్రియ భీమనేని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'రంభ ఊర్వశి మేనక' చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.1
- మల్లాపూర్ కలర్స్ థీమ్ పార్కులో వన మహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ మల్లాపూర్: వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్లోని కలర్స్ థీమ్ పార్కులో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మల్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (MMC), నాచారం సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.1
- తార్నాకలో ఘనంగా ఆషాఢ బోనాలు.. మహిళల బోనం సమర్న డీజే డ్యాన్స్.. తార్నాకలోని శ్రీ దుర్గా పోచమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో బస్తీవాసులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు యువత, బస్తీవాసులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దీంతో ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తుల రాకతో తార్నాకలో సందడి నెలకొంది.2